ఫిల్మ్ ఫెడరేషన్ మెగాస్టార్ కు ధన్యవాదాలు తెలిపింది. ఎన్నో దశాబ్దాలుగా మీరు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి దాని ద్వారా ఎంతోమంది ప్రజలకు, అభిమానులకు, సినిమా కార్మికులకు సేవ చేస్తున్న విషయం మరచిపోలేనిది. కరోనా మహమ్మారి ప్రారంభ దశలోనే 2020 ఏప్రిల్లో సినిమా షూటింగ్స్ నిలిచిపోయి, లాక్ డౌన్ లో ఏ కార్మికులు బయటకు వెళ్లలేని పరిస్థితుల్లో సి సి సి నీ మనకోసం ఏర్పాటు చేసి, దానికి కమిటీని నియమించి, సినిమా రంగంలోని పెద్దలందరిని భాగస్వాములను…
(జూన్ 24తో ‘ఊరికిచ్చిన మాట’ 40 ఏళ్ళు పూర్తి)నలభై ఏళ్ళ క్రితం చిరంజీవి ఇంకా వర్ధమాన కథానాయకునిగా రాణిస్తున్న రోజుల్లో నటునిగా ఆయనకు మంచి పేరు సంపాదించి పెట్టిన చిత్రం ‘ఊరికిచ్చిన మాట’. ప్రముఖ నటుడు యమ్.బాలయ్య సమర్పణలో అమృతా ఫిలిమ్స్ పతాకంపై ఆయన దర్శకత్వంలోనే తెరకెక్కిన చిత్రమిది. 1981 జూన్ 24న విడుదలైన ఈ చిత్రంలో చిరంజీవి, సుధాకర్ అన్నదమ్ములుగా నటించారు. ‘ఊరికిచ్చిన మాట’ కథ విషయానికి వస్తే – ఓ మారుమూల పల్లెటూల్లో ఇద్దరు…
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం “ఆచార్య” చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ త్వరలోనే తిరిగి ప్రారంభం కానుంది. ఈ చిత్రం తరువాత చిరంజీవి తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహించబోయే మలయాళ హిట్ మూవీ “లూసిఫర్”కు సిద్ధం కానున్నారు. ఈ రెండు చిత్రాలు పూర్తయ్యాక బాబీ దర్శకత్వంలో చిరు మరో చిత్రం చేయనున్నారు. ప్రస్తుతం ఇంకా టైటిల్…
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు త్వరలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో పోటీదారుల లిస్ట్ ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ప్రెసిడెంట్ పదవికి ప్రకాశ్రాజ్ బరిలోకి దిగుతున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మంచు వారి అబ్బాయి మంచు విష్ణు పేరు తెరపైకి వచ్చింది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. కాగా మెగాస్టార్ చిరంజీవిని కలిసి మాట్లాడిన తర్వాతే విష్ణు ప్రకటన చేస్తారని సమాచారం. మంచు విష్ణు బరిలోకి దిగితే ప్రకాష్ రాజ్ కు…
ఇటీవలే యంగ్ హీరో సంతోష్ శోభన్ నటించిన ‘ఏక్ మినీ కథ’ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. ఈ అడల్ట్ కామెడీ మూవీ తర్వాత వరుసగా సంతోష్ కు ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పటికే మారుతీ దర్శకత్వంలో ఓటీటీ మూవీకి సంతోష్ కమిట్ అయ్యాడు. అలానే ‘ప్రేమకుమార్’ పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు. కొన్ని వెబ్ సీరిస్ లలో నటించడానికి చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే… తాజాగా మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత… సంతోష్ శోభన్…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఉన్న పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పిక్ లో ఇద్దరూ బ్లాక్ అండ్ బ్లాక్ దుస్తులు ధరించారు. రామ్ చరణ్ హ్యాండ్సమ్ లుక్ లో ఉండగా… చిరంజీవి మ్యాన్లీ లుక్ లో కన్పిస్తున్నారు. అయితే ఈ పిక్ కు ఓ స్పెషలిటీ ఉంది. అదేంటంటే… ఈరోజు ఫాదర్స్ డే. ఈ సందర్భంగా తన తండ్రి చిరంజీవికి పితృ దినోత్సవం…
దర్శకుడు కొరటాల శివ ‘మిర్చి’ లాంటి తొలి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. ఆతర్వాత ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్’, ‘భరత్ అనే నేను’ లాంటి వరుస హిట్లతో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా మారాడు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘ఆచార్య’ సినిమా చేస్తున్నాడు. అయితే రేపు కొరటాల శివ పుట్టినరోజు నేపథ్యంలో కొరటాల సినిమాలకు సంబంధించిన సర్ప్రైజ్ ఏమైనా ఉంటుందా అని సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆచార్య సినిమా…
మెగాస్టార్ చిరంజీవి పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తాజాగా ప్రశంసల వర్షం కురిపించారు. మానవ జీవితాన్ని కాపాడడమే మానవత్వానికి గొప్ప సేవ అని… సూపర్ స్టార్, మాజీ కేంద్రమంత్రి చిరంజీవి నిస్వార్థ సేవ హృదయాన్ని తాకిందని, కరోనా మహమ్మారి కల్పించిన క్లిష్ట పరిస్థితులలో చిరంజీవి… అలాగే ఆయన బృందం చాలా విలువైన ప్రాణాలను రక్షించి ఎంతోమందికి సహాయ పడ్డారని తెలుపుతూ చిరంజీవి చేసిన సేవను సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి కొనియాడుతూ ట్వీట్…
ఆక్సిజన్ అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతోన్నారని తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ జిల్లాలో ఆక్సిజన్ బ్యాంక్ను ఏర్పాటు చేశారు. ఇక ఇప్పుడు చిరంజీవి మరో ముందడుగు వేశారు. అంబులెన్స్ కొరత ఉందన్న సంగతి చిరంజీవి దృష్టికి వెళ్లడంతో త్వరలోనే అంబులెన్స్ సర్వీసులను ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. అయితే తాజాగా చిరు సేవలపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. సాటి మనిషి ప్రాణాన్ని కాపాడడం మానవత్వానికి సంబంధించిన మహోన్నతమైన సేవ అని…
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల కరోనా బాధితులకు అండగా నిలిచిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలోని చాలా జిల్లాల్లో ఇప్పటికే ఆక్సిజన్ బ్యాంక్ సేవలను నెలకొల్పాడు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, ఆక్సిజన్ బ్యాంక్ లతో ప్రజలకు అండగా నిలుస్తున్న చిరు.. తాజాగా చిరు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారని తెలుస్తోంది. వీలైనంత త్వరగా తెలుగు రాష్ట్రాల అంతటా చిరంజీవి అంబులెన్స్ సర్వీస్ లను ప్రారంభించాలని చిరు భావిస్తున్నాడని తెలుస్తోంది. ప్రతి జిల్లాలోనూ ఈ సేవల్ని అందుబాటులోకి తీసుకురానున్నారని…