భారత్- మల్దీవుల మధ్య వివాదంతో స్థానిక ప్రజలు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా తమ అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూపై విమర్శలు గుప్పిస్తున్నారు. దౌత్యపరమైన సమస్యలు రావడంతో మాల్దీవుల ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టాలను కలిగిస్తుంది అని పేర్కొన్నారు.
చైనాకు ద్వీపదేశంగా ఉన్న తైవాన్పై యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. తైవాన్లో ఇవాళ జరుగనున్న ఎన్నికల్లో వెలువడే ఫలితాల ఆధారంగా ఆ దేశ భవితవ్యం ఆధారపడి ఉంటుందని పరిశీలకులు పేర్కొంటున్నారు. తైవాన్ను తన అధీనంలోకి తీసుకోవాలని డ్రాగన్ కంట్రీ భావిస్తుంది.
భారత్- మాల్దీవుల మధ్య దౌత్య సంబంధాలు క్షీణిస్తున్నాయి. ఈ రెండు దేశాల మధ్య పాత స్నేహానికి తెర పడుతుంది. మహ్మద్ ముయిజ్జూ అధికారంలోకి వచ్చిన తర్వాత మాల్దీవుల్స్ ఆరు దశాబ్దాల వెనుకబడి పోయింది.
Rajnath Singh: చైనాను ఉద్దేశించి భారత్ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. యూకే పర్యటనలో ఉన్న ఆయన అక్కడ మీడియాలో మాట్లాడుతూ.. 2020 గల్వాన్ ఘటన తర్వాత భారత్ ఏంటో చైనాకు అర్థమైందని అన్నారు. భారత్ ఇప్పుడు వ్యూహాత్మకంగా ఉందని, బలహీనమైన దేశం కాదని చెప్పారు. భారత దేశాన్ని ఎవరూ భయపెట్టి తప్పించుకోలేరని అన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీపై మాల్దీవుల మంత్రులు చేసిన అవమానకరమైన వ్యాఖ్యలపై దౌత్యపరమైన వివాదం నేపథ్యంలో భారతీయ పర్యాటకులు బుకింగ్లను రద్దు చేసుకుంటున్నారు. ఈ సంఘటనల మధ్య మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు చైనా నుంచి ఎక్కువ మంది పర్యాటకులను తన దేశానికి పంపే ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
వెకేషన్ అనగానే అందరికీ గుర్తొచ్చేది మాల్దీవులే. సెలబ్రిటీలు కూడా తరచూ మాల్దీవులకు వెళ్తుంటారు. అక్కడి బీచ్లు, రిసార్ట్స్లో సేద తీరుతుంటారు. ట్రిప్కు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంటుంటారు. ఇవి చూసిన చాలా మంది అక్కడి లొకేషన్స్కు ఫిదా అయ్యి.. మాల్దీవ్స్ వెకేషన్కు వెల్లాలన్నది పెద్ద డ్రీమ్గా పెట్టుకుంటుంటారు.
Maldives Row: భారత్, ద్వీప దేశం మాల్దీవ్స్ మధ్య తీవ్ర దౌత్య ఘర్షణ చెలరేగుతోంది. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ లక్షద్వీప్ సందర్శించి, అక్కడి పర్యటకాన్ని ప్రమోట్ చేయడం మాల్దీవ్స్ ప్రభుత్వానికి నచ్చడం లేదు. దీంతో అక్కడి మంత్రులు ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఇక భారతీయుల దెబ్బకు ‘బాయ్కాట్ మాల్దీవ్స్’ హాష్ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. మరోవైపు మోడీపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రుల్ని అక్కడి ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
భారత ప్రధాని నరేంద్ర మోడీపై మాల్దీవులకు చెందిన పలువురు మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వివాదం కొనసాగుతుంది. అయితే, మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ మాత్రం ఆదివారం రాత్రి చైనా వెళ్లారు.
Maldives: ప్రధాని నరేంద్రమోడీ లక్షద్వీప్ పర్యటన మాల్దీవుల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. భారత్పై, ప్రధాని మోడీపై అక్కడి నేతలు అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఇటీవల మాల్దీవుల్లో చైనా అనుకూల మహ్మద్ మొయిజ్జూ అధ్యక్షుడిగా గెలిచాడు. ఇతని నేతృత్వంలోని ప్రభుత్వం భారత్ వ్యతిరేక చర్యల్ని అవలంభిస్తోంది. ఇదే కాకుండా అక్కడ ఉన్న 77 మంది భారత సైనికులను వెళ్లాలని ఆదేశిస్తోంది. మరోవైపు మొయిజ్జూ చైనాలో పర్యటించే పనిలో ఉన్నారు.
UN Economic Report: భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉంటుందని ఐక్యరాజ్యసమితి ఆర్థిక నివేదిక వెల్లడించింది. 2024లో కూడా భారత వృద్ధి 6.2 శాతానికి చేరుకోగలదని యూఎన్ ఆర్థిక మరియు సామాజిక వ్యవహారాల విభాగం ప్రచురించిన వరల్డ్ ఎకనామిక్ సిట్యుయేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ 2024 నివేదిక తెలిపింది. భారత వృద్ధి 2024లో 6.2 శాతంగా ఉంటుందని, అయితే ఇది 2023లోని 6.3 శాతంతో పోలిస్తే తక్కువగానే ఉంటుందని యూఎన్ రిపోర్ట్ అంచనా…