Maldives Row: భారత్తో వివాదం నేపథ్యంలో చైనా, జిన్పింగ్పై మాల్దీవ్స్ అధ్యక్షుడి ప్రశంసలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maldives Row: భారత్-మాల్దీవుల మధ్య వివాదం నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ చైనా, ఆ దేశ అధ్యక్షుడు జి జిన్పింగ్పై ప్రశంసలు కురిపించాడు. చైనాతో తమ దేశ సంబంధాల గురించి గొప్పగా చెప్పారు. రెండు దేశాలు ఒకరిని ఒకరు గౌరవించుకుంటున్నాయని.. మాల్దీవ్స్ సార్వభౌమాధికారానికి పూర్తి మద్దతు ఇస్తుందని చెప్పారు. 1972లో దౌత్య సంబంధాలను ఏర్పరచుకున్నప్పటి నుండి మాల్దీవుల అభివృద్ధికి చైనా సహాయం అందించిందని ప్రశంసలు కురిపించాడు.
గతేడాది నవంబర్లో అక్కడ జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఇండియా వ్యతిరేక వైఖరి అవలంభించి ముయిజ్జూ గెలుపొందాడు. అప్పటి నుంచి భారత్కి వ్యతిరేకంగా, చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు. ఇటీవల ఇండియా, మాల్దీవ్స్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఆ దేశ మంత్రులు ప్రధాని నరేంద్రమోడీ లక్షద్వీప్ పర్యటనను ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం ఈ సమస్య మరింత పెద్దదిగా మారింది. భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ముగ్గురు మంత్రుల్ని మాల్దీవ్స్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
Also Read
- Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
- Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
- Bengaluru: ప్రేమికుడిని పెళ్లాడిన 4 నెలలకే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..!
Read Also: Hanuman: ‘హనుమాన్ దెబ్బ’ కేజీఎఫ్, కాంతార రికార్డులు అబ్బా.. పుష్పతో సమానంగా కలెక్షన్స్
ఇదిలా ఉంటే ఇటీవల చైనా పర్యటనకు వెళ్లిన ముయిజ్జూ పలు ఒప్పందాలు చేసుకున్నాడు. మాల్దీవ్స్ తిరిగిరాగానే చైనాను పొగుడుతూ వ్యాఖ్యలు చేస్తున్నాడు. చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వైపాక్షిక సంబంధాలను కొత్త స్థాయికి తీసుకెళ్లిందని ఆయన అన్నారు. చైనా మాల్దీవ్స్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే దేశం కాదని.. అందుకే రెండు దేశాల మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయని చైనా ప్రభుత్వ మీడియా సీజీటీఎన్ ఛానెల్కి ఇచ్చి ఇంటర్వ్యూలో ముయిజ్జూ చెప్పాడు. భవిష్యత్తులో చైనా-మాల్దీవ్స్ బంధం మరింత దృఢమవుతుందని అన్నారు. జి జిన్పింగ్ పౌరుల ప్రయోజనాలకు మొదటిస్థానం ఇస్తున్నారని, ఆయన నాయకత్వంలో చైనా ఆర్థిక వ్యవస్థ కొత్త శిఖరాలకు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మాల్దీవులు తన లక్ష్యాలను సాధించేందుకు చైనా ప్రభుత్వం సాయం చేస్తుందని, ఈమేరకు జిన్ పింగ్ హామీ ఇచ్చినట్లు ముయిజ్జు తెలిపారు.
మార్చి 15లోగా మాల్దీవుల్లో ఉన్న 88 మంది భారత సైనిక సిబ్బంది వెళ్లిపోవాలని మరోసారి ఆ దేశం చెప్పింది. శనివారం మీడియాతో మాట్లాడుతూ, పరోక్షంగా భారత్ ని ఉద్దేశించి ముయిజ్జూ విమర్శలు చేశారు. మేము చిన్నవాళ్లం కావచ్చు, కానీ మమ్మల్ని బెదిరించే లైసెన్స్ మీకు ఇవ్వలేదని అన్నారు. ఆహార వస్తువులు, ఔషధాలు, ఇతర దిగుమతులపై భారత్పై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ముయిజ్జూ కొత్త ప్రణాళికను ప్రకటించారు.
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!