Maoists :తెలంగాణ చత్తీస్ గడ్ సరిహద్దులోని బీజాపూర్ జిల్లా పామిడి ఏరియాలో ఉన్న బేస్ క్యాంపు లపై మావోయిస్టులు పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారు. గత నాలుగు రోజులు వ్యవధిలో మూడుసార్లు జీడిపల్లి బేస్ క్యాంపై మావోయిస్టులు దాడి చేశారు. గత రాత్రి బేస్ క్యాంప్ పై దాడి చేశారు. మళ్లీ ఆయుధాలను సమకూర్చుకొని ఈ తెల్లవారుజామున కూడా దాడి చేశారు .దీంతో తెలంగాణ సరిహద్దులోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఛత్తీస్గడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా సరిహద్దులు…
ఛత్తీస్గఢ్లో బీజాపూర్ జిల్లాలోని పోలీస్ బేస్ క్యాంపుపై నక్సలైట్లు మరోసారి దాడి చేశారు. గత మూడు రోజుల్లో నక్సలైట్లు పోలీసులపై దాడి చేయడం ఇది రెండోసారి. పోలీసు శిబిరంలో కాల్పులు జరిగినట్లు బీజాపూర్ ఎస్పీ డాక్టర్ జితేంద్ర యాదవ్ ధృవీకరించారు. పామేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జీడపల్లి పోలీస్ క్యాంపుపై నక్సలైట్లు దాడి చేశారు.. పోలీసులు, నక్సలైట్ల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు జవాన్లకు స్వల్ప గాయాలయ్యాయి. బేస్ క్యాంపులో సైనికులకు ప్రథమ చికిత్స చేస్తున్నారు. ఈ…
ఛత్తీస్గఢ్లోని నక్సల్స్ ప్రభావిత బీజాపూర్ జిల్లాలో ఇద్దరు మాజీ సర్పంచ్లను మావోయిస్టులు కిడ్నాప్ చేసి హత్య చేశారు. జిల్లాలోని నైమెడ్, భైరామ్గఢ్ పోలీస్స్టేషన్ల పరిధిలో మాజీ సర్పంచ్ సుఖ్రామ్ అవలం, సుకాలు ఫర్సాలను అనుమానిత మావోయిస్టులు కిడ్నాప్ చేసి హతమార్చినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
Maoist: తెలంగాణ-ఛత్తీ్స్ గఢ్ సరిహద్దుల్లోని అడవుల్లో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. నేటి (డిసెంబర్ 2) నుంచి జరగనున్న మావోయిస్టు పార్టీ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ వారోత్సవాలకు దండకారణ్యం వేదికగా మారింది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల ఘాతుకానికి తెగబడ్డారు. పోలీస్ ఇన్ఫార్మర్ అనే అనుమానంతో గ్రామస్థుడిని గొంతు కోసి మావోయిస్టులు హత్య చేశారు. మృతుడు భైరంగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దలేర్ గ్రామానికి చెందిన కుమ్మేష్ కుంజమ్గా గుర్తించారు.
ఛత్తీస్గఢ్లో శుక్రవారం ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లాలో 10 మంది మావోయిస్టులను భద్రతా సిబ్బంది అంతమొందించాయి. 10 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Massive Encounter: ఛత్తీస్గడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు- మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురు కాల్పులు చోటు చేసుకుంది. సుమారు 10 మంది మావోలు మృతి చెందినట్లు సమాచారం.
ఛత్తీస్గఢ్లోని కంకేర్, నారాయణపూర్ జిల్లాల సరిహద్దులోని మాద్ ప్రాంతంలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎన్కౌంటర్ జరుగుతోంది. ఎన్కౌంటర్ను పోలీసు సూపరింటెండెంట్ ఐకె ఎలిసెలా ధృవీకరించారు. కోర్ ఏరియా కావడంతో సైనికులు సంప్రదించలేకపోతున్నారు. కంకేర్ నక్సలైట్ ఎన్కౌంటర్లో చాలా మంది నక్సలైట్లు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇది అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ఘటనా స్థలం నుంచి ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎన్ కౌంటర్ కొనసాగుతోంది.
బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ను చంపేస్తానని బెదిరింపులకు పాల్పడిన ఛత్తీస్గఢ్ న్యాయవాదిని ముంబై పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసిన ఫైజాన్ ఖాన్ను రాయ్పూర్ నివాసం నుండి అరెస్టు చేశారు. బాంద్రా పోలీసులకు వాంగ్మూలం ఇచ్చేందుకు నవంబర్ 14న ముంబై వస్తానని ఫైజాన్ ఖాన్ గతంలో చెప్పాడు.