Chhattisgarh: బీజేపీలో చేరినందుకు.. మాజీ సర్పంచ్లను కిడ్నాప్ చేసి చంపిన నక్సల్స్!
- ఇద్దరు మాజీ సర్పంచ్ల కిడ్నాప్
- ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో ఘటన
- మృతదేహాల వద్ద కరపత్రాలు స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛత్తీస్గఢ్లోని నక్సల్స్ ప్రభావిత బీజాపూర్ జిల్లాలో ఇద్దరు మాజీ సర్పంచ్లను మావోయిస్టులు కిడ్నాప్ చేసి హత్య చేశారు. జిల్లాలోని నైమెడ్, భైరామ్గఢ్ పోలీస్స్టేషన్ల పరిధిలో మాజీ సర్పంచ్ సుఖ్రామ్ అవలం, సుకాలు ఫర్సాలను అనుమానిత మావోయిస్టులు కిడ్నాప్ చేసి హతమార్చినట్లు పోలీసు అధికారులు తెలిపారు. మృతులు బీజేపీ కార్యకర్తలని పోలీసు క్యాంపును ఏర్పాటు చేయడంలో వారికి సహాయం చేశారని మావోయిస్టులు ఆరోపించారు.
READ MORE: Sambhal Violence: సంభాల్లో శుక్రవారం ప్రార్థనలకు ముందు పోలీసులు హైఅలర్ట్
Also Read
- Rishabh Pant Fined: విజయం సాధించినా.. LSG కెప్టెన్ కు తప్పని భారీ ఫైన్..!
- TDP vs YSRCP: టెంపుల్ సిటీలో టెన్షన్.. టెన్షన్.. టీడీపీ వర్సెస్ వైసీపీ
- Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
- Story Board: మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
కడేర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఆవలం బీజాపూర్లోని శాంతినగర్లో నివాసం ఉండేవారు. వ్యవసాయ పనుల నిమిత్తం స్వగ్రామం ఖాదర్ కు వెళ్లారు. అతను తన వ్యక్తిగత పని కోసం ఖాదర్ నుంచి సమీపంలోని కైక గ్రామానికి వెళ్లి.. తిరిగి ఖదర్కు వస్తుండగా.. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు సుఖ్రామ్ను అడవి వైపు తీసుకెళ్లారు. అనంతరం మావోయిస్టులు అతడిని హత్య చేసి, మృతదేహాన్ని కాదర్-కైకా రహదారిపై విసిరారు. ఘటనా స్థలం నుంచి గంగలూరు ఏరియా కమిటీ మావోయిస్టులు జారీ చేసిన కరపత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి మరో ఘటనలో మాజీ సర్పంచ్ సుకాలు ఫర్సాను మావోయిస్టులు అనుమానితులు కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు అధికారులు తెలిపారు. బిర్యాభూమి గ్రామానికి వెళ్లే మార్గంలో మావోయిస్టులు ఫర్సాను కిడ్నాప్ చేశారు. ఫర్సా కుమార్తె తన తండ్రిని విడుదల చేయాలని సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేసింది. అయినా కూడా నక్సల్స్ కనికరం చూపకుండా ఫర్సా హతమార్చారు. పోలీసులు మృతదేహాన్ని, మావోయిస్టుల కరపత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఫర్సా బీజేపీలో చేరినందుకు చంపేశామని మావోయిస్టులు కరపత్రంలో పేర్కొన్నారు. కాగా.. ఛత్తీస్గఢ్లో ఈ సంవత్సరం నక్సలైట్లు కనీసం 55 మందిని చంపినట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Naresh : నరేష్ గ్యారేజ్లోకి కొత్త బీస్ట్: రూ. 2.7 కోట్ల పోర్షే కారు కొన్న తొలి టాలీవుడ్ నటుడు!
-
Rishabh Pant Fined: విజయం సాధించినా.. LSG కెప్టెన్ కు తప్పని భారీ ఫైన్..!
-
Gold and Silver Rates: కమింగ్ డౌన్.. నేడు మళ్లీ పతనమైన గోల్డ్, సిల్వర్ ధరలు..
-
TDP vs YSRCP: టెంపుల్ సిటీలో టెన్షన్.. టెన్షన్.. టీడీపీ వర్సెస్ వైసీపీ
-
Vrushakarma: ‘వృషకర్మ’ నుంచి సాలిడ్ అప్డేట్..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..