నా తల్లిదండ్రులు, భార్య, పిల్లల మీద ఓట్టేసి చెబుతున్న.. నేను రంజిత్ రెడ్డి అన్న గెలుపు కోసం కృషి చేస్తాను అని స్పష్టం చేశారు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.
చేవెళ్ళ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి జోరు పెంచారు. టికెట్ ప్రకటించిందే ఆలస్యంగా పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి ఊరు, వాడ తిరుగుతున్నారు. ఇప్పటివరకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు చుట్టేయగా.. దాదాపు ప్రతి నియోజకవర్గంలో బూతు కమిటీల మీటింగ్.. ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ ముందుకు వెళుతున్నారు.
ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై చేవెళ్ల ఎంపీ రంజీత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ లో ఒక్క గజం భూమిని కబ్జా చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్దం అని ఓపెన్ చాలెంజ్ చేశారు.
తన కోసం ఈ 30 రోజులు కష్టపడితే.. రానున్న ఐదేండ్లు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, సామాన్య ప్రజల కోసం పని చేస్తానని చేవెళ్ళ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ జి. రంజిత్ రెడ్డి పేర్కొన్నారు.
మహిళలు, యువకులు, రైతాంగం కాంగ్రెస్ వైపే ఉన్నారన్నారు. తుక్కుగూడ జన జాతర బహిరంగ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం మోగించిందన్నారు. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందన్నారు. కార్యకర్తలందరూ సమిష్టిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. తన 30 రోజులు కష్టపడితే చేవెళ్ల పార్లమెంట్ ప్రజల కోసం అహర్నిశలు పని చేస్తానన్నారు.
BRS Party: ఈ నెల 13 నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజల్లోకి రానున్నారు. చేవెళ్ల బహిరంగ సభతో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రచారంలో బహిరంగ సభల కంటే బస్సు యాత్రలకే ప్రాధాన్యం మని భావించిన ఆయన చేవెళ్ల బహిరంగ సభలో ప్రచారం చేయనున్నారు.
చేవెళ్ళ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనజాతర చేయూతనిచ్చినట్టు కనిపిస్తోంది. శనివారం రాష్ట్ర కాంగ్రెస్ నిర్వహించిన తుక్కుగూడ బహిరంగ సభ కిక్కిరిసిపోయింది. కాంగ్రెస్ శ్రేణులంతా కదం తొక్కారు. పార్టీ కార్యకర్తలు లక్షలాదిగా తరలిరాగా... చేవెళ్ళ ఎంపీ డాక్టర్ జి. రంజిత్ రెడ్డి కార్యక్రమ నిర్వహణలో అంతా తానై వ్యవహరించారు.
వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలో చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రజా ఆశీర్వాద యాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది 5 గ్యారంటీలు కాదు ఐదు మోసాలు, ఐదు అబద్ధాలు అని విమర్శలు గుప్పించారు.
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగ బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన ఎంపీ రంజిత్ రెడ్డిపైన ఆయన ఘాటైన కామెంట్స్ చేశారు.
మోడీ మీద నమ్మకంతో బీజేపీ చేవెళ్లలో భారీ మెజారిటీతో గెలుస్తుందని బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. చేవెళ్లలో తమ ఫస్ట్ రౌండ్ ప్రచారం అయిపోయిందని పేర్కొన్నారు. చేవెళ్లలో సర్వే చేయించాం.. గెలిచేది బీజేపీయేనని అన్నారు. చేవెళ్ల సీటు మోడీదే.. ఇది రాసి పెట్టుకోవచ్చని ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీపై దుష్ప్రచారం జరుగుతోందని విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని అసెంబ్లీలో ఎన్నికల్లో కూడా అన్నారు.. లిక్కర్ కేసులో…