MP Ranjith Reddy: ఆరు గ్యారంటీలను ప్రతి గడపకు తీసుకెళ్తా.. మీకోసం అహర్నిశలు పని చేస్తా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే నాయకుడిని గెలిపించాలని చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. ఇవాళ (శుక్రవారం) కొంగర కలాన్ లోని పీఎస్ఆర్ శ్లోక కన్వెన్షన్ హాల్లో మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ జి. రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. తాను గెలిచిన తర్వాత ఆరు గ్యారెంటీలను ప్రతి గడపకు తీసుకెళ్తానన్నారు. చేవెళ్ల పార్లమెంట్ అభివృద్దిని బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఏనాడు పట్టించుకోలేదన్నారు. ఆయన అసలు ఎవరికి అందుబాటు ఉండరని తెలిపారు. మహిళలు, యువకులు, రైతాంగం కాంగ్రెస్ వైపే ఉన్నారన్నారు. తుక్కుగూడ జన జాతర బహిరంగ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం మోగించిందన్నారు. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందన్నారు. కార్యకర్తలందరూ సమిష్టిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. తన 30 రోజులు కష్టపడితే చేవెళ్ల పార్లమెంట్ ప్రజల కోసం అహర్నిశలు పని చేస్తానన్నారు.
Read Also: Chiranjeevi: తేజ సజ్జ చేశాడు.. ఇక నేను చేయనక్కర్లేదు..చిరు ఆసక్తికర వ్యాఖ్య లు
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
కాగా, తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రంజిత్ రెడ్డి వివాదరహితుడని చెప్పారు. ఇక్కడి బీజేపీ ఎంపీ అభ్యర్థి ప్రజలలో లేరన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించి ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పి చైర్ పర్సన్ తీగల అనితా హరినాథ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శారద, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ కేఎల్ఆర్, సీనియర్ నాయకుడు దేప భాస్కర్ రెడ్డి, బడంగ్ పేట్ మేయర్ పారిజాత నర్సింహ రెడ్డి, ఏనుగు జంగారెడ్డి, కందుకూరు జడ్పీటీసీ బొక్క జంగారెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ తరఫున కదనం చేసేది బూతు స్థాయి కార్యకర్తలే… ఈ ఎన్నికల్లో పార్టీ గెలవాలంటే… మీ కష్టం, మీ పోరాటం అనివార్యం.
అందుకే మిమ్మల్ని కలిసి… గెలుపు ఆవశ్యకత వివరించేందుకే ఈ సమావేశం.
చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి… pic.twitter.com/aNFq1QgFK7
— Dr Ranjith Reddy (@DrRanjithReddy) April 12, 2024
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!