MP Ranjith Reddy: ఆరు గ్యారంటీలను ప్రతి గడపకు తీసుకెళ్తా.. మీకోసం అహర్నిశలు పని చేస్తా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే నాయకుడిని గెలిపించాలని చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. ఇవాళ (శుక్రవారం) కొంగర కలాన్ లోని పీఎస్ఆర్ శ్లోక కన్వెన్షన్ హాల్లో మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ జి. రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. తాను గెలిచిన తర్వాత ఆరు గ్యారెంటీలను ప్రతి గడపకు తీసుకెళ్తానన్నారు. చేవెళ్ల పార్లమెంట్ అభివృద్దిని బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఏనాడు పట్టించుకోలేదన్నారు. ఆయన అసలు ఎవరికి అందుబాటు ఉండరని తెలిపారు. మహిళలు, యువకులు, రైతాంగం కాంగ్రెస్ వైపే ఉన్నారన్నారు. తుక్కుగూడ జన జాతర బహిరంగ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం మోగించిందన్నారు. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందన్నారు. కార్యకర్తలందరూ సమిష్టిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. తన 30 రోజులు కష్టపడితే చేవెళ్ల పార్లమెంట్ ప్రజల కోసం అహర్నిశలు పని చేస్తానన్నారు.
Read Also: Chiranjeevi: తేజ సజ్జ చేశాడు.. ఇక నేను చేయనక్కర్లేదు..చిరు ఆసక్తికర వ్యాఖ్య లు
Also Read
- Rajat Patidar: ధోనీ, రోహిత్కు కూడా సాధ్యం కాని రికార్డు.. స్వర్ణ అక్షరాలతో చరిత్రను సృష్టించిన ఆర్సీబి కెప్టెన్.!
- RCB Fans Celebrations: అర్థరాత్రి RCB ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. పోలీసుల లాఠీచార్జ్.!
- IPL 2026 Awards Winners List: వైభవ్ సూర్యవంశీ హవా.. ఐపీఎల్ 2026లో అవార్డ్స్ గెలుచుకున్న స్టార్ ప్లేయర్స్ వీరే..!
- Anushka Sharma: విరాట్ ఫినిష్ ఆఫ్ ఇట్స్ స్టైల్.. అనుష్క శర్మ రియాక్షన్ మాములుగా లేదుగా.!
కాగా, తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రంజిత్ రెడ్డి వివాదరహితుడని చెప్పారు. ఇక్కడి బీజేపీ ఎంపీ అభ్యర్థి ప్రజలలో లేరన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించి ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పి చైర్ పర్సన్ తీగల అనితా హరినాథ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శారద, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ కేఎల్ఆర్, సీనియర్ నాయకుడు దేప భాస్కర్ రెడ్డి, బడంగ్ పేట్ మేయర్ పారిజాత నర్సింహ రెడ్డి, ఏనుగు జంగారెడ్డి, కందుకూరు జడ్పీటీసీ బొక్క జంగారెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ తరఫున కదనం చేసేది బూతు స్థాయి కార్యకర్తలే… ఈ ఎన్నికల్లో పార్టీ గెలవాలంటే… మీ కష్టం, మీ పోరాటం అనివార్యం.
అందుకే మిమ్మల్ని కలిసి… గెలుపు ఆవశ్యకత వివరించేందుకే ఈ సమావేశం.
చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి… pic.twitter.com/aNFq1QgFK7
— Dr Ranjith Reddy (@DrRanjithReddy) April 12, 2024
తాజావార్తలు
-
US airstrikes on Iran: కొనసాగుతున్న ఉద్రిక్తతలు.. ఇరాన్ రాడార్, డ్రోన్ స్థావరాలపై అమెరికా దాడులు..
-
Sobhita dhulipala : ప్రళయానంతర ప్రపంచంలో కథ… ‘వెట్టువం’పై అంచనాలు పెంచిన శోభిత కామెంట్స్
-
Supreme Court: సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తుల నియామకం.. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన
-
Rajat Patidar: ఆర్సీబీ కెప్టెన్గా ట్రోఫీ గెలుస్తానని ఎప్పుడూ అనుకోలేదు.. ఇదంతా విధి రాసిందే!
-
Shubman Gill: కచ్చితంగా గెలుస్తామనుకున్నాం.. కానీ అక్కడే మ్యాచ్ మా చేతుల్లో నుంచి జారిపోయింది!
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!