Ranjith Reddy: ఎర్రటి ఎండలోనూ ప్రజల చెంతకు.. ప్రచారంలో జోరు పెంచిన రంజిత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ranjith Reddy: చేవెళ్ళ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి జోరు పెంచారు. టికెట్ ప్రకటించిందే ఆలస్యంగా పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి ఊరు, వాడ తిరుగుతున్నారు. ఇప్పటివరకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు చుట్టేయగా.. దాదాపు ప్రతి నియోజకవర్గంలో బూతు కమిటీల మీటింగ్.. ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ ముందుకు వెళుతున్నారు. శుక్రవారం తాండూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డితోపాటు బషీరాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో రంజిత్ రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఉదయం 8 గంటలకు బషీరాబాద్ మండలంలోని ఏకాంబరేశ్వర స్వామి వారి దేవస్థానంలో పూజలు నిర్వహించిన తర్వాత స్ట్రీట్ కార్నర్ మీటింగులలో పాల్గొన్నారు. బషీరాబాద్ మండల కేంద్రంలోని మైల్వర్,ఏక్మమై దామర్చేడ్, నవల్గ, గొట్టిగ కుర్థు కాశీంపూర్, మంతటి గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించగా… కాంగ్రెస్ కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.
Read Also: Revanth Reddy: భద్రాద్రి రామయ్య సాక్షిగా హామీ ఇస్తున్నా.. ఆగస్టు 15 లోగా రుణమాఫీ చేస్తా..
Also Read
ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి రంజిత్ రెడ్డి ప్రసంగించారు. రానున్న రోజుల్లో జరిగే పార్లమెంటు ఎన్నికలలో ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక సైనికుడిలా పని చేయాలని… కాంగ్రెస్ పార్టీ విజయంలో భాగస్వామ్యం కావాలని స్పష్టం చేశారు. కార్యకర్తలు ఇంటింటా తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని తెలపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలుస్తుందని… ఆ వెంటనే అర్హులైన ప్రతి ఒక్కరి ఇంటికి ఆరు గ్యారంటీలు తీసుకువస్తుందని చెప్పారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని గుర్తు చేయాలన్నారు. కాగా, ఎన్నికల కోడ్ అయిపోయిన వెంటనే రైతులకు రుణమాఫీ జరుగుతుందని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రజల కోసం నిత్యం అందుబాటులో ఉంటూ కష్టపడుతూ చేవెళ్ల నియోజకవర్గం ప్రగతి బాటలు వేస్తామన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు శోభ, ఎంపీపీ అరుణ ప్రసాద్ రెడ్డి, జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు,సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!