KTR: వాళ్లు.. చేవెళ్ల, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో గెలవడం అసాధ్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగ బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన ఎంపీ రంజిత్ రెడ్డిపైన ఆయన ఘాటైన కామెంట్స్ చేశారు. రంజిత్ రెడ్డి ఎవరో కూడా ఇక్కడి ప్రజలకు తెలియదు.. కానీ, మన పార్టీ సీటు ఇచ్చి గెలిపించుకున్న తర్వాతనే ప్రపంచానికి తెలిసిందన్నారు. 2019లో రాజకీయాలకు కొత్త అయినా పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి ఆయనను గెలిపించారు.. రంజిత్ రెడ్డికి రాజకీయంగా పార్టీలో అత్యధిక ప్రాధాన్యత కూడా ఇచ్చాం.. నియోజక వర్గంలో స్వేచ్చ ఇచ్చాం.. ఈ ఎన్నికల్లో పోటీ చేయనని పార్టీ ముందు అవశక్యతను వ్యక్త్యం చేసి.. రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని చెప్పి.. కేవలం అధికారం, ఆస్తుల కోసమే రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు అంటూ కేటీఆర్ విమర్శించారు.
Read Also: NIA Rides: రామేశ్వరం కేఫ్ పేలుళ్ల కేసుపై అనేక చోట్ల ఏకకాలంలో దాడులు చేసిన ఎన్ఐఏ..!
Also Read
- Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
- Independence Day 2026: ఇంతకీ ఇది 80వ స్వాతంత్య్ర దినోత్సవమా? లేక 79వదా? ఫుల్ క్లారిటీ ఇదిగో..
- Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
- Karur Stampede: ప్రభుత్వ ఉద్యోగాలపై కీలక తీర్పు.. కరూర్ బాధితులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట
పార్టీ సీనియర్ నాయకురాలు రంజిత్ రెడ్డి తన సోదరి అని చెప్పుకున్న ఎమ్మెల్సీ కవిత పైన కేంద్ర ప్రభుత్వ సంస్థలు సోదాల పేరుతో దాడి చేసి.. అరెస్టు చేసిన రోజే.. ఆయన నవ్వుకుంటూ బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్ లో చేరిన స్వార్థపరుడు అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులే కాదు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు కూడా రంజిత్ రెడ్డికి పార్టీ ఏం తక్కువ చేసిందో చెప్పాలన్నారు. గత ఎన్నికలకు ముందు అప్పటి మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి కూడా పార్టీ కంటే.. తానే ఎక్కువ అనుకొని వేరే పార్టీలోకి వెళితే ఫలితం ఏమైందో అందరికీ తెలుసు అని ఆయన చెప్పుకొచ్చారు. ఒక పార్టీ కంటే తానే పెద్ద అనే అహంకారం ఉన్న వ్యక్తులు రాజకీయాల్లో ఎక్కువ రోజులు ఉండలేరంటూ విమర్శించారు.
Read Also: AP High Court: గ్రూప్-1 పరీక్ష రద్దు పిటిషన్.. విచారణ 18కి వాయిదా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రంజిత్ రెడ్డి కలిసిపోయినంత మాత్రనా.. కాంగ్రెస్- బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో కలిసి పోతారు అనుకుంటే అది వారి రాజకీయ అజ్ఞానానికి నిదర్శనం అని కేటీఆర్ అన్నారు. ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన అయోమయం నెలకొంది.. చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీకి కనీసం అభ్యర్థి కూడా దొరకలేదు.. సొంతంగా అభ్యర్థి లేని కాంగ్రెస్ పార్టీ, చేవెళ్ల, మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో గెలవడం అసాధ్యం అని చెప్పారు. చేవెళ్ల నియోజకవర్గంలో ఏప్రిల్ 13వ తేదీన కేసీఆర్ బహిరంగ సభ ఉంటుంది అని కేటీఆర్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
IND vs SL: తొలి టెస్టు టీమ్లో బిగ్ సర్ప్రైజ్.. సీనియర్కు నో ప్లేస్, కొత్త కుర్రాడు అరంగేట్రం!
-
Independence Day 2026: ఇంతకీ ఇది 80వ స్వాతంత్య్ర దినోత్సవమా? లేక 79వదా? ఫుల్ క్లారిటీ ఇదిగో..
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Karur Stampede: ప్రభుత్వ ఉద్యోగాలపై కీలక తీర్పు.. కరూర్ బాధితులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట
ట్రెండింగ్
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!
-
Indoor Plants: ఒక్క గ్లాస్ నీటితో ఇంట్లో గ్రీన్ డెకరేషన్.. ఈ మొక్కలను ఇలా పెంచండి!
-
Termite-Proof Furniture: చెదల బెడదకు చెక్.. చెక్కకు బదులుగా ఈ మెటీరియల్స్ ఎంచుకోండంతే.!
-
Hardik Pandya Trade: చెన్నై, కోల్కతా కాదు.. హార్దిక్ ఆ జట్టులోకే వెళ్తాడు.. ఏ తప్పేముంది!
-
IND vs SL 1st Test: తుది జట్టులో చోటు ఉండదు.. స్టార్ బ్యాటర్కు హెడ్ కోచ్ గంభీర్ వార్నింగ్!