KTR: వాళ్లు.. చేవెళ్ల, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో గెలవడం అసాధ్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగ బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన ఎంపీ రంజిత్ రెడ్డిపైన ఆయన ఘాటైన కామెంట్స్ చేశారు. రంజిత్ రెడ్డి ఎవరో కూడా ఇక్కడి ప్రజలకు తెలియదు.. కానీ, మన పార్టీ సీటు ఇచ్చి గెలిపించుకున్న తర్వాతనే ప్రపంచానికి తెలిసిందన్నారు. 2019లో రాజకీయాలకు కొత్త అయినా పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి ఆయనను గెలిపించారు.. రంజిత్ రెడ్డికి రాజకీయంగా పార్టీలో అత్యధిక ప్రాధాన్యత కూడా ఇచ్చాం.. నియోజక వర్గంలో స్వేచ్చ ఇచ్చాం.. ఈ ఎన్నికల్లో పోటీ చేయనని పార్టీ ముందు అవశక్యతను వ్యక్త్యం చేసి.. రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని చెప్పి.. కేవలం అధికారం, ఆస్తుల కోసమే రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు అంటూ కేటీఆర్ విమర్శించారు.
Read Also: NIA Rides: రామేశ్వరం కేఫ్ పేలుళ్ల కేసుపై అనేక చోట్ల ఏకకాలంలో దాడులు చేసిన ఎన్ఐఏ..!
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
పార్టీ సీనియర్ నాయకురాలు రంజిత్ రెడ్డి తన సోదరి అని చెప్పుకున్న ఎమ్మెల్సీ కవిత పైన కేంద్ర ప్రభుత్వ సంస్థలు సోదాల పేరుతో దాడి చేసి.. అరెస్టు చేసిన రోజే.. ఆయన నవ్వుకుంటూ బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్ లో చేరిన స్వార్థపరుడు అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులే కాదు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు కూడా రంజిత్ రెడ్డికి పార్టీ ఏం తక్కువ చేసిందో చెప్పాలన్నారు. గత ఎన్నికలకు ముందు అప్పటి మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి కూడా పార్టీ కంటే.. తానే ఎక్కువ అనుకొని వేరే పార్టీలోకి వెళితే ఫలితం ఏమైందో అందరికీ తెలుసు అని ఆయన చెప్పుకొచ్చారు. ఒక పార్టీ కంటే తానే పెద్ద అనే అహంకారం ఉన్న వ్యక్తులు రాజకీయాల్లో ఎక్కువ రోజులు ఉండలేరంటూ విమర్శించారు.
Read Also: AP High Court: గ్రూప్-1 పరీక్ష రద్దు పిటిషన్.. విచారణ 18కి వాయిదా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రంజిత్ రెడ్డి కలిసిపోయినంత మాత్రనా.. కాంగ్రెస్- బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో కలిసి పోతారు అనుకుంటే అది వారి రాజకీయ అజ్ఞానానికి నిదర్శనం అని కేటీఆర్ అన్నారు. ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన అయోమయం నెలకొంది.. చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీకి కనీసం అభ్యర్థి కూడా దొరకలేదు.. సొంతంగా అభ్యర్థి లేని కాంగ్రెస్ పార్టీ, చేవెళ్ల, మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో గెలవడం అసాధ్యం అని చెప్పారు. చేవెళ్ల నియోజకవర్గంలో ఏప్రిల్ 13వ తేదీన కేసీఆర్ బహిరంగ సభ ఉంటుంది అని కేటీఆర్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!