చెన్నై ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. మరో 15 మందికి తీవ్రమైన గాయాలయ్యాయి. చెన్నై ఆరక్కోణం సమీపంలో నిలిమి గ్రామంలో ద్రౌపది దేవి ఉత్సవాల్లో ఈఘటన చోటుచేసుకుంది.
5 drunk men pour hot oil on hotel owner: చెన్నై సమీపంలో ఓ హోటల్ యజమాని, అతని కొడుకు, సిబ్బందిపై ఐదుగురు తాగుబోతులు దాడిచేశారు. అంతటితో ఆగకుండా వేడి నూనెను వారిపై పోశారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రగాయాల పాలయ్యారు. మద్యం మత్తులో ఉన్న నిందితులు ఈ ఘటనకు పాల్పడ్డారు. ప్రస్తుతం నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన చెన్నై శివారులోని సెలైయూర్ సమీపంలోని మాడంబాక్కంలో జరిగింది.
రోడ్లపై గుంతలు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. గుంతలను తప్పించుకునే ప్రయత్నంలో చాలా మంది కిందపడి లేదా ఇతర వాహనాలను ఢీకొట్టి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా మంగళవారం చెన్నైలో 22 ఏళ్ల ఓ సాఫ్ట్వేర్ యువతి రోడ్డుపై గుంతను తప్పించుకునే క్రమంలో ట్రక్కును ఢీకొట్టింది.
Shocking Add: ప్రస్తుతం కాలంలో ప్రమోషన్స్ అనేవి ఎంత ముఖ్యమో ప్రత్యేకముగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ వసువు ధర రూపాయే కావొచ్చు.. కానీ అది మార్కెట్ లోకి అడుగుపెట్టి ప్రజల దృష్టికి తీసుకెళ్లాలంటే లక్షల్లో ప్రమోషన్స్ చేయాలి.
తిరుమల తిరుపతి దేవస్థాన ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి కన్నుమూశాడు.. దీంతో, పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో విషాదం నెలకొంది.. తన పెళ్లి శుభలేఖలు పంచడానికి చెన్నై వెళ్లిన చంద్రమౌళి.. తన బంధువుల ఇంట్లో గుండెపోటుకు గురైన విషయం విదితమే కాగా.. ఆ తర్వాత ఆయనను చెన్నైలోని కావేరి ఆస్పత్రికి తరలించారు.. అయితే, మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన చంద్రమౌళి.. ఇవాళ ఉదయం కన్నుమూశారు.. దీంతో, ధర్మారెడ్డి కుటుంబంలో విషాదం నెలకొంది.. చేతికి ఎదిగిన కొడుకు..…
ప్రముఖ తమిళ నటుడు శరత్ కుమార్ తీవ్ర అస్వస్థతకు డయేరియాతో డీహైడ్రేషన్ కు గురైన ఆయన ప్రస్తుతం చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. భార్య రాధిక, కుమార్తె వరలక్ష్మీ ఆస్పత్రికి చేరుకున్నారు. దీని సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
వాయుగుండంగా కొనసాగుతోంది మాండూస్ తుఫాన్. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలపై తుఫాన్ ప్రభావం పడింది. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి
Madras High Court Bans Mobile Phones In Temples Across Tamil Nadu: దేవాలయాల్లో మొబైల్ ఫోన్లను బ్యాన్ చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది మద్రాస్ హైకోర్టు. తమిళనాడు వ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాల్లో మొబైల్ ఫోన్లపై నిషేధాన్ని విధించింది. దేవాలయాల పవిత్రతను కాపాడేందుకు తమిళనాడులోని అన్ని దేవాలయాల్లో మొబైల్ ఫోన్లను నిషేధించాలని మద్రాస్ హైకోర్టు మదురై బేంచ్ హిందూ రిలిజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్ శాఖను ఆదేశించింది.
ఫేమస్ అవుదామని స్టంట్స్ చేసి ప్రాణాలు పోగొట్టుకున్నారు ఇద్దరు ప్రాణ స్నేహితులు. చెన్నై పెరియార్నగర్లో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కరుణానిధి 3వ వీధికి చెందిన ప్రవీణ్, ఆరి. ఒకటో తరగతి నుంచి స్నేహితులు. యూట్యూబ్లో బైక్ అడ్వెంచర్ వీడియోలు చూసే ప్రవీణ్.. ఫేమస్ అవ్వాలనుకున్నారు. అందుకోసం బైక్ కొన్నాడు. విన్యాసాలు రికార్డ్ చేయడానికి హెల్మెట్కు కెమెరా పెట్టాడు ప్రవీణ్. స్నేహితుడు ఆరితో కలిసి వేలంచ్చెరి హైవే వైపు 114 కిలోమీటర్ల స్పీడ్లో బైక్పై…