Aishwarya Rajinikanth: స్టార్ హీరో ధనుష్ భార్య, సూపర్ స్టార్ రజినీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య రాజినీకాంత్ ఇంట్లో దొంగతనం జరిగిన సంగతి తెలిసిందే. చెన్నైలో పోయెస్ గార్డెన్ లో ఉన్న ఆమె ఇంటి నుంచి 100 సవర్ల బంగారు ఆభరణాలు, 30 గ్రాముల వజ్రాభరణాలు, 4 కిలోల వెండి, ఆస్తి పత్రాలు దొంగతనానికి గురయ్యాయి. ఇది ఇంటి దొంగల పనిగా పోలీసులు తేల్చారు. ఇంట్లో పనిచేస్తున్న పనిమనిషి ఈశ్వరి, డ్రైవర్ వెంకటేశన్ ను పోలీసులు అరెస్ట్…
Today (13-03-23) Business Headlines: దేశంలో తొలి స్టోర్ హైదరాబాద్లో: చిన్న పిల్లల ఆట బొమ్మల సంస్థ టాయ్స్ ఆర్ ఆజ్.. ఇండియాలో తొలి స్టోర్ని హైదరాబాద్లో ప్రారంభించింది. ఏస్ టర్టిల్ అనే ఇ-రిటైల్ కంపెనీ దీన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ విక్రయ కేంద్రంలో అన్ని బ్రాండ్ల బొమ్మలూ దొరుకుతాయని కంపెనీ తెలిపింది. భారతదేశంలో బొమ్మల పరిశ్రమ టర్నోవర్ వచ్చే ఏడాది నాటికి రెండు బిలియన్ డాలర్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో టాయ్స్ ఆర్…
ఎంఎస్ ధోనీ ఫ్యాన్ చేసిన పని సర్వత్రా చర్చనీయాంశమైంది. తన పెళ్లి శుభలేఖపై ధోని ఫొటో ప్రింట్ చేయించి.. అతడిపై తనకున్న అభినాన్ని వినూత్నంగా చాటుకున్నా ఫ్యాన్.
Danger to Chennai and Kolkata: పెరుగున్న వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్, కాలుష్యం భూమిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఓజోన్ లేయర్ దెబ్బతినడంతో పాటు భూమిపై హిమనీనదాలు వేగంగా కరిగిపోతున్నాయి. దీంతో సముద్రమట్టాలు పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో గ్లోబల్ వార్మింగ్ కారణంగా సముద్రమట్టాలు పెరుగుతాయని, దీని వల్ల తీర ప్రాంతాల్లో ఉన్న నగరాలకు ముప్పు ఏర్పడుతుందని ఓ అధ్యయనం వెల్లడించింది.
cultivate ganja using LED lights: సాధారణంగా ఏ మొక్క అయిన సూర్యకాంతి సహాయంతో పెరుగుతుంది. కానీ ఈ కేటుగాళ్లు మాత్రం ఏకంగా గంజాయిని ఎల్ఈడీ లైట్ల సాయంతో పెంచారు. వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం. నలుగురు వ్యక్తులు అద్దెకు ఉంటున్న అపార్ట్మెంట్ లో ఏకంగా కృత్రిమంగా గంజాయిని సాగు చేశారు. సహజ సూర్యకాంతిని ఎల్ఈడీ లైట్లలో భర్తీ చేశారు. దీన్ని పెంచడానికి ప్రత్యేకంగా ఓ ఎయిర్ కండీషనర్ ను వాతావరణ నియంత్రణ కోసం ఉపయోగించారు.…
ప్రభు సీనియర్ నటుడు. తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం కూడా అక్కర్లేదు. అంజలి అంజలి అంటూ ప్రేక్షకులను అలరించి అమితంగా ఆకట్టుకున్న సీనియర్ హీరో. తమిళ హీరో అయినప్పటికీ డబ్బింగ్ చిత్రాల్లో నటించడంతోపాటు తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించడంతో తెలుగు వారికి కూడా సుపరిచితుడు.
Renault, Nissan Vehicles: ఇటీవలే ఒక్కటైన రెండు కార్ల తయారీ సంస్థలు రెనాల్ట్ మరియు నిస్సాన్.. తమ ఫస్ట్ జాయింట్ ప్రాజెక్ట్ వివరాలను వెల్లడించాయి. ఇండియాలో చేపట్టనున్న విస్తరణ ప్రణాళికను కూడా ప్రకటించాయి. ఇందులో భాగంగా 600 మిలియన్ డాలర్ల పెట్టుబడితో చెన్నైలోని మ్యానిఫ్యాక్షరింగ్ ప్లాంట్ని డీకార్బనైజ్ చేయనున్నాయి. కొత్త మోడల్ కార్ల తయారీ ద్వారా దాదాపు 2 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వనున్నాయి. ఈ రెండు సంస్థలు కలిసి ఆరు కొత్త వాహనాలను ఉత్పత్తి చేయనున్నాయి.
ప్రముఖ నేపథ్య గాయని, అలనాటి మేటి సింగర్ వాణీ జయరాం అనుమానాస్పద స్థితిలో మృతి భారతీయ చలనచిత్ర పరిశ్రమను షాక్కు గురిచేసింది. శనివారం నాడు వాణీ జయరాం చనిపోయినట్లు వార్తలు రావడంతో చెన్నై నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.