cultivate ganja using LED lights: సాధారణంగా ఏ మొక్క అయిన సూర్యకాంతి సహాయంతో పెరుగుతుంది. కానీ ఈ కేటుగాళ్లు మాత్రం ఏకంగా గంజాయిని ఎల్ఈడీ లైట్ల సాయంతో పెంచారు. వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం. నలుగురు వ్యక్తులు అద్దెకు ఉంటున్న అపార్ట్మెంట్ లో ఏకంగా కృత్రిమంగా గంజాయిని సాగు చేశారు. సహజ సూర్యకాంతిని ఎల్ఈడీ లైట్లలో భర్తీ చేశారు. దీన్ని పెంచడానికి ప్రత్యేకంగా ఓ ఎయిర్ కండీషనర్ ను వాతావరణ నియంత్రణ కోసం ఉపయోగించారు.…
ప్రభు సీనియర్ నటుడు. తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం కూడా అక్కర్లేదు. అంజలి అంజలి అంటూ ప్రేక్షకులను అలరించి అమితంగా ఆకట్టుకున్న సీనియర్ హీరో. తమిళ హీరో అయినప్పటికీ డబ్బింగ్ చిత్రాల్లో నటించడంతోపాటు తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించడంతో తెలుగు వారికి కూడా సుపరిచితుడు.
Renault, Nissan Vehicles: ఇటీవలే ఒక్కటైన రెండు కార్ల తయారీ సంస్థలు రెనాల్ట్ మరియు నిస్సాన్.. తమ ఫస్ట్ జాయింట్ ప్రాజెక్ట్ వివరాలను వెల్లడించాయి. ఇండియాలో చేపట్టనున్న విస్తరణ ప్రణాళికను కూడా ప్రకటించాయి. ఇందులో భాగంగా 600 మిలియన్ డాలర్ల పెట్టుబడితో చెన్నైలోని మ్యానిఫ్యాక్షరింగ్ ప్లాంట్ని డీకార్బనైజ్ చేయనున్నాయి. కొత్త మోడల్ కార్ల తయారీ ద్వారా దాదాపు 2 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వనున్నాయి. ఈ రెండు సంస్థలు కలిసి ఆరు కొత్త వాహనాలను ఉత్పత్తి చేయనున్నాయి.
ప్రముఖ నేపథ్య గాయని, అలనాటి మేటి సింగర్ వాణీ జయరాం అనుమానాస్పద స్థితిలో మృతి భారతీయ చలనచిత్ర పరిశ్రమను షాక్కు గురిచేసింది. శనివారం నాడు వాణీ జయరాం చనిపోయినట్లు వార్తలు రావడంతో చెన్నై నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
చెన్నై ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. మరో 15 మందికి తీవ్రమైన గాయాలయ్యాయి. చెన్నై ఆరక్కోణం సమీపంలో నిలిమి గ్రామంలో ద్రౌపది దేవి ఉత్సవాల్లో ఈఘటన చోటుచేసుకుంది.
5 drunk men pour hot oil on hotel owner: చెన్నై సమీపంలో ఓ హోటల్ యజమాని, అతని కొడుకు, సిబ్బందిపై ఐదుగురు తాగుబోతులు దాడిచేశారు. అంతటితో ఆగకుండా వేడి నూనెను వారిపై పోశారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రగాయాల పాలయ్యారు. మద్యం మత్తులో ఉన్న నిందితులు ఈ ఘటనకు పాల్పడ్డారు. ప్రస్తుతం నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన చెన్నై శివారులోని సెలైయూర్ సమీపంలోని మాడంబాక్కంలో జరిగింది.
రోడ్లపై గుంతలు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. గుంతలను తప్పించుకునే ప్రయత్నంలో చాలా మంది కిందపడి లేదా ఇతర వాహనాలను ఢీకొట్టి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా మంగళవారం చెన్నైలో 22 ఏళ్ల ఓ సాఫ్ట్వేర్ యువతి రోడ్డుపై గుంతను తప్పించుకునే క్రమంలో ట్రక్కును ఢీకొట్టింది.
Shocking Add: ప్రస్తుతం కాలంలో ప్రమోషన్స్ అనేవి ఎంత ముఖ్యమో ప్రత్యేకముగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ వసువు ధర రూపాయే కావొచ్చు.. కానీ అది మార్కెట్ లోకి అడుగుపెట్టి ప్రజల దృష్టికి తీసుకెళ్లాలంటే లక్షల్లో ప్రమోషన్స్ చేయాలి.
తిరుమల తిరుపతి దేవస్థాన ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి కన్నుమూశాడు.. దీంతో, పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో విషాదం నెలకొంది.. తన పెళ్లి శుభలేఖలు పంచడానికి చెన్నై వెళ్లిన చంద్రమౌళి.. తన బంధువుల ఇంట్లో గుండెపోటుకు గురైన విషయం విదితమే కాగా.. ఆ తర్వాత ఆయనను చెన్నైలోని కావేరి ఆస్పత్రికి తరలించారు.. అయితే, మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన చంద్రమౌళి.. ఇవాళ ఉదయం కన్నుమూశారు.. దీంతో, ధర్మారెడ్డి కుటుంబంలో విషాదం నెలకొంది.. చేతికి ఎదిగిన కొడుకు..…