Chennai: చికెన్ ఫ్రైడ్ రైస్ గొడవ.. యజమానిపై వేడినూనె పోసిన తాగుబోతులు
5 drunk men pour hot oil on hotel owner: చెన్నై సమీపంలో ఓ హోటల్ యజమాని, అతని కొడుకు, సిబ్బందిపై ఐదుగురు తాగుబోతులు దాడిచేశారు. అంతటితో ఆగకుండా వేడి నూనెను వారిపై పోశారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రగాయాల పాలయ్యారు. మద్యం మత్తులో ఉన్న నిందితులు ఈ ఘటనకు పాల్పడ్డారు. ప్రస్తుతం నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన చెన్నై శివారులోని సెలైయూర్ సమీపంలోని మాడంబాక్కంలో జరిగింది.
Read Also: Vemula Prashanth Reddy: దేశం మొత్తం కేసీఆర్ను పొగుడుతోంది.. అసలు బీజేపీ ఏం చేసింది..?
Also Read
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
- Viral: ‘మీసాల పిల్ల’ అంటూ ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ప్రశంసల హోరు..
- Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
వివరాల్లోకి వెళితే.. అజిత్, కార్తిక్ అనే ఇద్దరు వ్యక్తులు ఉదయం 10.30 గంటలకు 4 చికెన్ ప్రైడ్ రైస్ ప్యాకెట్లు కావాలని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఆర్డర్ ఇచ్చారు. అయితే డెలివరీ సమయంలో ఇద్దరూ డబ్బులు చెల్లించేందుకు నిరాకరించడంతో గొడవ జరిగింది. తర్వాత చెల్లిస్తామని ఇద్దరు చెప్పారు. అయితే డబ్బులు ఇస్తేనే ఆర్డర్ ఇస్తానని యజమాని చెప్పాడు.
ఈ ఘటన అనంతరం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో మద్యం తాగి వచ్చిన ఇద్దరు వ్యక్తులు, మరో నలుగురు స్నేహితులతో కలిసి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పై దాడికి పాల్పడ్డారు. యజమాని, అతని కొడుకు, సిబ్బందిని తిడుతూ దాడి చేశారు. ఇరు వర్గాల మధ్య గొడవ తీవ్ర రూపం దాల్చడంతో మద్యం మత్తులో ఉన్న వ్యక్తి, స్టవ్ పై ఉన్న వేడి నూనెను కౌంటర్ వద్ద ఉన్న యజమాని, అతని కొడుకు, ఇతర సిబ్బందిపై పోశాడు. ఈ దాడి తర్వాత నిందితులంతా అక్కడ నుంచి పరారయ్యారు. ఘటన తర్వాత పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిని జయమణి (59), అతని కుమారుడు మణికందన్ (29), నేపాల్ కు చెందిన ఉద్యోగి నెమ్రాజ్ (29)లను రక్షించి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో మాడంబాక్కంకకు చెందిన నిందితులు అజిత్, కార్తీక్ అలియాస్ హరిహరన్, ప్రవీణ్ అలియాస్ జాగో, శివ, విక్కీ సహా ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం అధికారులు గాలిస్తున్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
-
RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Producing States in India: భారత్లో ‘పెట్రోల్’ బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
-
CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!