Chennai: చికెన్ ఫ్రైడ్ రైస్ గొడవ.. యజమానిపై వేడినూనె పోసిన తాగుబోతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
5 drunk men pour hot oil on hotel owner: చెన్నై సమీపంలో ఓ హోటల్ యజమాని, అతని కొడుకు, సిబ్బందిపై ఐదుగురు తాగుబోతులు దాడిచేశారు. అంతటితో ఆగకుండా వేడి నూనెను వారిపై పోశారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రగాయాల పాలయ్యారు. మద్యం మత్తులో ఉన్న నిందితులు ఈ ఘటనకు పాల్పడ్డారు. ప్రస్తుతం నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన చెన్నై శివారులోని సెలైయూర్ సమీపంలోని మాడంబాక్కంలో జరిగింది.
Read Also: Vemula Prashanth Reddy: దేశం మొత్తం కేసీఆర్ను పొగుడుతోంది.. అసలు బీజేపీ ఏం చేసింది..?
Also Read
- BRICS Summit 2026: BRICSకి 20 ఏళ్లు.. ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన భారత్.. వీటి ప్రత్యేకత ఇదే
- Vijay Ajith Kumar: అజిత్ లే మాన్స్ రేస్కు త్రిషా కృష్ణన్.. విజయ్తో కలిసి కనిపించడంతో ఫ్యాన్స్లో చర్చ
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
- BRICS Summit 2026: మోడీ-జిన్పింగ్ భేటీ.. బ్రిక్స్ ఉమ్మడి ప్రకటన.. సదస్సు తొలి రోజు 10 కీలక విషయాలు
వివరాల్లోకి వెళితే.. అజిత్, కార్తిక్ అనే ఇద్దరు వ్యక్తులు ఉదయం 10.30 గంటలకు 4 చికెన్ ప్రైడ్ రైస్ ప్యాకెట్లు కావాలని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఆర్డర్ ఇచ్చారు. అయితే డెలివరీ సమయంలో ఇద్దరూ డబ్బులు చెల్లించేందుకు నిరాకరించడంతో గొడవ జరిగింది. తర్వాత చెల్లిస్తామని ఇద్దరు చెప్పారు. అయితే డబ్బులు ఇస్తేనే ఆర్డర్ ఇస్తానని యజమాని చెప్పాడు.
ఈ ఘటన అనంతరం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో మద్యం తాగి వచ్చిన ఇద్దరు వ్యక్తులు, మరో నలుగురు స్నేహితులతో కలిసి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పై దాడికి పాల్పడ్డారు. యజమాని, అతని కొడుకు, సిబ్బందిని తిడుతూ దాడి చేశారు. ఇరు వర్గాల మధ్య గొడవ తీవ్ర రూపం దాల్చడంతో మద్యం మత్తులో ఉన్న వ్యక్తి, స్టవ్ పై ఉన్న వేడి నూనెను కౌంటర్ వద్ద ఉన్న యజమాని, అతని కొడుకు, ఇతర సిబ్బందిపై పోశాడు. ఈ దాడి తర్వాత నిందితులంతా అక్కడ నుంచి పరారయ్యారు. ఘటన తర్వాత పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిని జయమణి (59), అతని కుమారుడు మణికందన్ (29), నేపాల్ కు చెందిన ఉద్యోగి నెమ్రాజ్ (29)లను రక్షించి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో మాడంబాక్కంకకు చెందిన నిందితులు అజిత్, కార్తీక్ అలియాస్ హరిహరన్, ప్రవీణ్ అలియాస్ జాగో, శివ, విక్కీ సహా ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం అధికారులు గాలిస్తున్నారు.
తాజావార్తలు
-
BRICS Summit 2026: BRICSకి 20 ఏళ్లు.. ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన భారత్.. వీటి ప్రత్యేకత ఇదే
-
Samantha: బేబీ బంప్తో సమంత కొత్త ఫోటోలు.. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న సామ్!
-
Vivo X Fold 6: వివో X Fold 6 త్వరలో మార్కెట్లోకి.. Geekbenchలో లిస్టింగ్.. 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీ
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Idol Cleaning Tips : గణేష్ చతుర్థికి ఇంట్లోనే విగ్రహాలకు ఇలా కొత్త మెరుపు
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!