Cyclone Mandous: తీవ్ర వాయుగుండంగా మారిన మాండూస్.. చెన్నైని వణికిస్తున్న వర్షాలు
Cyclone Mandous: వాయుగుండంగా కొనసాగుతోంది మాండూస్ తుఫాన్. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలపై తుఫాన్ ప్రభావం పడింది. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. తుఫాన్ బలహీనపడినప్పటికి కోస్తాలో రేపు కూడా వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. తుఫాన్ తీవ్రత తగ్గడంతో పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలను ఉపసంహరించారు. మత్స్యకారులు, రైతులు మరో 36 గంటలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
అలా వచ్చి ఇలా వెళ్లిపోయిన మాండూస్.. రెండు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. దీనికి ఈదురుగాలులు తోడవ్వడంతో కొన్ని చోట్ల భారీ వృక్షాలు కూలిపోయాయి. వాహనాలపై చెట్లు పడిపోవడంతో వందల సంఖ్యతో ధ్వంసమయ్యాయి. రెస్క్యూ బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నాయి. తమిళనాడు, ఏపీ, తెలంగాణపై తుఫాన్ ప్రభావం అధికంగా కనిపిస్తోంది. వచ్చే 12 గంటల్లో బలహీనపడే అవకాశం ఉంది. తమిళనాడు, పుదుచ్చేరికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రాయలసీమలో కూడా అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఏపీలో కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
Also Read
- వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
- KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
- Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
- CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు
ఇదిలా ఉండగా.. మాండూస్ తుఫాను బలహీనపడటంతో, చెన్నైలో ఆదివారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు రాజధాని నగరం, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో వచ్చే 48 గంటలపాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని, డిసెంబర్ 12 నుండి వర్షం క్రమంగా తగ్గుతుందని ఐఎండీ శనివారం సాయంత్రం తెలిపింది. ఈ తుఫాను ఉపసంహరణ కారణంగా చెన్నైతో పాటు ఈరోడ్, కృష్ణగిరి, ధర్మపురి, సేలం, నమక్కల్, కరూర్, నీలగిరి, కోయంబత్తూర్, తిరుపూర్, తేని, దిండిగల్, తెన్కాసి జిల్లాల్లో రానున్న 24 గంటలపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నగరంలో శనివారం అంతా కుండపోత వర్షం కురిసింది.
Rifle Competition : జాతీయ రైఫిల్ ఈవెంట్కు ఎంపికైన బీసీ గురుకుల పాఠశాల విద్యార్థిని
చెన్నై ఆయావరం తాలూకా కార్యాలయంలో 15 సెంటీమీటర్లు, పెరంబూరులో 14 సెంటీమీటర్లు, గుమ్మిడిపూండి, తాంబరం, మహాబలిపురం, ఎంజీఆర్ నగర్, అలందూరులో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అనేక వర్షాలకు సంబంధించిన సంఘటనలలో చెన్నైలో ఇప్పటివరకు ఐదుగురు వ్యక్తులు మరణించారు. మరో ఇద్దరు బ్రెయిన్ డెడ్గా ప్రకటించారు. వీరిలో సైదాపేటలో గోడ కూలిన ఘటనలో ఇద్దరు బ్రెయిన్ డెడ్ కాగా, మడిపాక్కం, శ్రీపెరంబుదూర్లో విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందారు. తోరైపాక్కంలో ఓ భవనం కూలిపోవడంతో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
అనేక ఇళ్లు మరియు ఇతర భవనాలు దెబ్బతిన్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాలలో చెట్లు నేలకూలాయి. 98 పశువులు ప్రాణాలు కోల్పోయాయి. దాదాపు 181 ఇళ్లు, గుడిసెలు దెబ్బతిన్నాయి. భారీ వర్షంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. మాండూస్ తుఫాను వల్ల ఎంత నష్టం వాటిల్లిందో ప్రభుత్వ అధికారులు అంచనా వేస్తున్నారని, అవసరమైతే కేంద్ర సహాయం కూడా తీసుకుంటామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు.
తాజావార్తలు
-
Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
-
వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
-
Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
-
KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
-
Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!