Cyclone Mandous: తీవ్ర వాయుగుండంగా మారిన మాండూస్.. చెన్నైని వణికిస్తున్న వర్షాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyclone Mandous: వాయుగుండంగా కొనసాగుతోంది మాండూస్ తుఫాన్. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలపై తుఫాన్ ప్రభావం పడింది. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. తుఫాన్ బలహీనపడినప్పటికి కోస్తాలో రేపు కూడా వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. తుఫాన్ తీవ్రత తగ్గడంతో పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలను ఉపసంహరించారు. మత్స్యకారులు, రైతులు మరో 36 గంటలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
అలా వచ్చి ఇలా వెళ్లిపోయిన మాండూస్.. రెండు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. దీనికి ఈదురుగాలులు తోడవ్వడంతో కొన్ని చోట్ల భారీ వృక్షాలు కూలిపోయాయి. వాహనాలపై చెట్లు పడిపోవడంతో వందల సంఖ్యతో ధ్వంసమయ్యాయి. రెస్క్యూ బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నాయి. తమిళనాడు, ఏపీ, తెలంగాణపై తుఫాన్ ప్రభావం అధికంగా కనిపిస్తోంది. వచ్చే 12 గంటల్లో బలహీనపడే అవకాశం ఉంది. తమిళనాడు, పుదుచ్చేరికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రాయలసీమలో కూడా అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఏపీలో కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
Also Read
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
- క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
ఇదిలా ఉండగా.. మాండూస్ తుఫాను బలహీనపడటంతో, చెన్నైలో ఆదివారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు రాజధాని నగరం, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో వచ్చే 48 గంటలపాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని, డిసెంబర్ 12 నుండి వర్షం క్రమంగా తగ్గుతుందని ఐఎండీ శనివారం సాయంత్రం తెలిపింది. ఈ తుఫాను ఉపసంహరణ కారణంగా చెన్నైతో పాటు ఈరోడ్, కృష్ణగిరి, ధర్మపురి, సేలం, నమక్కల్, కరూర్, నీలగిరి, కోయంబత్తూర్, తిరుపూర్, తేని, దిండిగల్, తెన్కాసి జిల్లాల్లో రానున్న 24 గంటలపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నగరంలో శనివారం అంతా కుండపోత వర్షం కురిసింది.
Rifle Competition : జాతీయ రైఫిల్ ఈవెంట్కు ఎంపికైన బీసీ గురుకుల పాఠశాల విద్యార్థిని
చెన్నై ఆయావరం తాలూకా కార్యాలయంలో 15 సెంటీమీటర్లు, పెరంబూరులో 14 సెంటీమీటర్లు, గుమ్మిడిపూండి, తాంబరం, మహాబలిపురం, ఎంజీఆర్ నగర్, అలందూరులో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అనేక వర్షాలకు సంబంధించిన సంఘటనలలో చెన్నైలో ఇప్పటివరకు ఐదుగురు వ్యక్తులు మరణించారు. మరో ఇద్దరు బ్రెయిన్ డెడ్గా ప్రకటించారు. వీరిలో సైదాపేటలో గోడ కూలిన ఘటనలో ఇద్దరు బ్రెయిన్ డెడ్ కాగా, మడిపాక్కం, శ్రీపెరంబుదూర్లో విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందారు. తోరైపాక్కంలో ఓ భవనం కూలిపోవడంతో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
అనేక ఇళ్లు మరియు ఇతర భవనాలు దెబ్బతిన్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాలలో చెట్లు నేలకూలాయి. 98 పశువులు ప్రాణాలు కోల్పోయాయి. దాదాపు 181 ఇళ్లు, గుడిసెలు దెబ్బతిన్నాయి. భారీ వర్షంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. మాండూస్ తుఫాను వల్ల ఎంత నష్టం వాటిల్లిందో ప్రభుత్వ అధికారులు అంచనా వేస్తున్నారని, అవసరమైతే కేంద్ర సహాయం కూడా తీసుకుంటామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు.
తాజావార్తలు
-
ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
-
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్గా..
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!