Cyclone Mandous: తీవ్ర వాయుగుండంగా మారిన మాండూస్.. చెన్నైని వణికిస్తున్న వర్షాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyclone Mandous: వాయుగుండంగా కొనసాగుతోంది మాండూస్ తుఫాన్. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలపై తుఫాన్ ప్రభావం పడింది. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. తుఫాన్ బలహీనపడినప్పటికి కోస్తాలో రేపు కూడా వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. తుఫాన్ తీవ్రత తగ్గడంతో పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలను ఉపసంహరించారు. మత్స్యకారులు, రైతులు మరో 36 గంటలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
అలా వచ్చి ఇలా వెళ్లిపోయిన మాండూస్.. రెండు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. దీనికి ఈదురుగాలులు తోడవ్వడంతో కొన్ని చోట్ల భారీ వృక్షాలు కూలిపోయాయి. వాహనాలపై చెట్లు పడిపోవడంతో వందల సంఖ్యతో ధ్వంసమయ్యాయి. రెస్క్యూ బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నాయి. తమిళనాడు, ఏపీ, తెలంగాణపై తుఫాన్ ప్రభావం అధికంగా కనిపిస్తోంది. వచ్చే 12 గంటల్లో బలహీనపడే అవకాశం ఉంది. తమిళనాడు, పుదుచ్చేరికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రాయలసీమలో కూడా అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఏపీలో కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ఇదిలా ఉండగా.. మాండూస్ తుఫాను బలహీనపడటంతో, చెన్నైలో ఆదివారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు రాజధాని నగరం, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో వచ్చే 48 గంటలపాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని, డిసెంబర్ 12 నుండి వర్షం క్రమంగా తగ్గుతుందని ఐఎండీ శనివారం సాయంత్రం తెలిపింది. ఈ తుఫాను ఉపసంహరణ కారణంగా చెన్నైతో పాటు ఈరోడ్, కృష్ణగిరి, ధర్మపురి, సేలం, నమక్కల్, కరూర్, నీలగిరి, కోయంబత్తూర్, తిరుపూర్, తేని, దిండిగల్, తెన్కాసి జిల్లాల్లో రానున్న 24 గంటలపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నగరంలో శనివారం అంతా కుండపోత వర్షం కురిసింది.
Rifle Competition : జాతీయ రైఫిల్ ఈవెంట్కు ఎంపికైన బీసీ గురుకుల పాఠశాల విద్యార్థిని
చెన్నై ఆయావరం తాలూకా కార్యాలయంలో 15 సెంటీమీటర్లు, పెరంబూరులో 14 సెంటీమీటర్లు, గుమ్మిడిపూండి, తాంబరం, మహాబలిపురం, ఎంజీఆర్ నగర్, అలందూరులో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అనేక వర్షాలకు సంబంధించిన సంఘటనలలో చెన్నైలో ఇప్పటివరకు ఐదుగురు వ్యక్తులు మరణించారు. మరో ఇద్దరు బ్రెయిన్ డెడ్గా ప్రకటించారు. వీరిలో సైదాపేటలో గోడ కూలిన ఘటనలో ఇద్దరు బ్రెయిన్ డెడ్ కాగా, మడిపాక్కం, శ్రీపెరంబుదూర్లో విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందారు. తోరైపాక్కంలో ఓ భవనం కూలిపోవడంతో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
అనేక ఇళ్లు మరియు ఇతర భవనాలు దెబ్బతిన్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాలలో చెట్లు నేలకూలాయి. 98 పశువులు ప్రాణాలు కోల్పోయాయి. దాదాపు 181 ఇళ్లు, గుడిసెలు దెబ్బతిన్నాయి. భారీ వర్షంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. మాండూస్ తుఫాను వల్ల ఎంత నష్టం వాటిల్లిందో ప్రభుత్వ అధికారులు అంచనా వేస్తున్నారని, అవసరమైతే కేంద్ర సహాయం కూడా తీసుకుంటామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు.
తాజావార్తలు
-
Billa Ranga Baasha : 2209 ప్రపంచంలో కిచ్చా సుదీప్ యాక్షన్.. ‘బిల్లా రంగ బాష’ నుంచి బిగ్ అప్డేట్!
-
Rajasthan ATS: జైష్ స్లీపర్ సెల్ అనుమానిత మహిళ అరెస్టు.. ఆన్లైన్లో పాకిస్తానీ ఉగ్రవాదిని వివాహం చేసుకున్నట్లు వెల్లడి
-
Astrology: స్నేహానికి ఎక్కువ విలువ ఇచ్చే 4 రాశులు వీరేనా? ఫ్రెండ్ కోసం ఎంత దూరమైనా వెళ్తారట!
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!