మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం నిప్పులు చెరిగారు. ఏపీని సొంత ప్రయోజనాల కోసం కేంద్రంకు తాకట్టుపెట్టారంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించిన చంద్రబాబు మాట్లాడుతూ.. రైల్వే జోన్పై ఆనాడు అనేక మాటలు మాట్లడిన జగన్.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం విశాఖ రైల్వేజోన్ పరిశీలనలో లేదంటే ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. అంతేకాకుండా విశాఖపై ప్రేమ చూపించే వైసీపీ రైల్వే జోన్పై ఏం సమాధానం చెబుతారన్నారు. సమాధానం చెప్పలేని సీఎం ఏవిధంగా…
హైదరాబాద్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి మనవరాలి వివాహం కన్నులపండుగగా జరిగింది. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలోని జీఎంఆర్ ఎరినాలో వెంకయ్య కుమారుడు హర్షవర్ధన్-రాధ దంపతుల కుమార్తె నిహారిక వివాహం వైభవంగా నిర్వహించారు. హైదరాబాద్కు చెందిన రవితేజను వెంకయ్య మనవరాలు నిహారిక వివాహం చేసుకున్నారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహానికి తెలంగాణ సీఎం కేసీఆర్ దంపతులు, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, టీడీపీ అధినేత చంద్రబాబు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్రెడ్డి, ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు…
ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీల పొత్తుపై ఎప్పటికప్పుడూ కొత్త తరహా ప్రచారం జరుగుతూనే ఉంటుంది.. ఈ మూడు పార్టీలు ఎప్పుడైనా ఏకం కావొచ్చు అనే అంచనాలుంటాయి.. అయితే, ప్రస్తుతం ఏపీలో బీజేపీ-జనసేన పొత్తు కొనసాగుతుండగా.. టీడీపీ విడిగానే రాజకీయాలు చేస్తోంది.. ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో కొన్ని చోట్ల కలిసి పనిచేసిన సందర్భాలు కూడా లేకపోలేదు.. కానీ, ఇవాళ తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎమ్మెల్యే, పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల…
కుప్పం రివ్యూలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేసారు. రాష్ట్ర స్థాయిలో పార్టీలో కోవర్టులు తయారయ్యారు. పార్టీలోని కోవర్టులను ఏరిపారేస్తా. కుప్పం నుంచే పార్టీ ప్రక్షాళన ప్రారంభిస్తా అని చంద్రబాబు అన్నారు. ఇక నన్ను మెప్పించడం కాదు.. ప్రజల్లో పనిచేసిన వారికే గుర్తింపు. స్థానిక నేతల అతి విస్వాసం వల్లనే కుప్పంలో ఓటమి తప్పలేదు. కుప్పం స్థానిక నాయకత్వంలో మార్పులు చెయ్యాలన్న కార్యకర్తల సూచనలు అమల్లోకి తెస్తానన్న చంద్రబాబు… ఇకపై తరుచూ కుప్పంలో పర్యటిస్తానని.. కార్యకర్తలకు, నేతలు ఎక్కవ…
చంద్రబాబుపై మరోమారు ఫైర్ అయ్యారు ప్రభుత్వ సలహాదారు సజ్జల. చంద్రబాబు కుప్పంను కబ్జా చేసి కోటలాగా మార్చుకున్నాడని… కుప్పంలో చంద్రబాబును దారుణం ఓడించారని ఆగ్రహించారు. అమరావతి యాత్ర ప్రజల యాత్ర కాదు.. టీడీపీ నేతలే యాత్ర చేస్తున్నారని ఆగ్రహించారు. చంద్రబాబుకు ఎక్కడో చోట గొడవ కావాలి.. అదే ఆయన రాజకీయం అంటూ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు రావాలని చంద్రబాబు కోరుకుంటున్నారని ఆగ్రహించారు. అన్ని వర్గాలకు అభివృద్ధి, సంక్షేమంతో పాటు రాజకీయ పదవుల్లో కూడా…
కుప్పం అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట.. టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గం కావడంతో అందరూ ఆ ప్రాంతాన్ని ప్రత్యేకంగా చూస్తారు.. ఒక్కప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా టీడీపీదే తన ఆధిపత్యాన్ని ప్రదర్శించేది.. అయితే, ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో కుప్పం మున్సిపాల్టీ కాస్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడిపోయింది.. ఏకంగా చంద్రబాబు, లోకేష్, ఇతర నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం నిర్వహించినా.. అధికార వైసీపీ ఎత్తుల ముందు చిత్తైపోయారు..…
బాహుబలి సైన్యంలా వెళ్లారు. తీరా యుద్ధంలో చతికిల పడ్డారు. 20వార్డులకు రెండుచోట్లే గెలిచారు. ఈ ఫలితాలతో ఆ జిల్లా నేతలకు అధినేత నుంచి అక్షింతలు పడ్డాయట. డైలాగ్ కొంచెం తేడా కావొచ్చేమో కానీ.. తమ్ముళ్లకు సీరియస్గానే తలంటారట. టీడీపీలో చర్చగా మారిన ఆ పోస్టుమార్టం ఏంటి? లెట్స్ వాచ్..! పెనుకొండ పురపోరులో పాతికమంది టీడీపీ నేతల ప్రచారం..! రాష్ట్రంలో ఇటీవల జరిగిన మినీ మున్సిపల్ పోరు పొలిటికల్ హీట్ క్రియేట్ చేసింది. కుప్పం తరువాత అంత హైప్…
చంద్రబాబు పై మరోసారి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఎందుకు వెక్కి వెక్కిఏడ్చారని..నిజమైన నాయకుడు ఏడవరంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఔట్ డేటెడ్ పొలిటీషియన్ అని… లోకేష్ రాజకీయాలకు పనికిరాడంటూ చురకలు అంటించారు. ధీరుడికి మాత్రమే రాజ్యం ఏలే హక్కు ఉంటుందని.. చంద్రబాబుకు కుటుంబం ప్రధానం కాదు, ముఖ్యమంత్రి పదవే ప్రధానమన్నారు. కుప్పంలోనే చంద్రబాబుకు దిక్కులేదని… ఇక అధికారంలోకి వచ్చే అవకాశం లేదని తెలిపారు. ఓటీఎస్ పథకంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుత రాజకీయాలు మారిపోయాయని……
టీడీపీ సీనియర్ నేత… గోరంట్ల బుచ్చ చౌదరికి బొత్స సత్య నారాయణ సవాల్ విసిరారు. తాను అబద్దాలు ఆడుతున్నానని బుచ్చయ్య చౌదరి అంటున్నారని… ధైర్యం ఉంటే చర్చకు రావాలని బహిరంగ సవాల్ విసిరారు. ఎవరి వాదం ఏంటో చెబుదామని… రా…ఇద్దరం రాజీనామా చేద్దామని పేర్కొన్నారు బొత్స సత్య నారాయణ. ఇంత వయసు ఉండి అర్ధం లేకుండా మాట్లాడితే ఎలా? అని ఫైర్ అయ్యారు. చంద్రబాబు గురువింద గింజలాంటి వ్యక్తి అని.. ఆయన ఏం మాట్లాడతాడో ఎవరికీ తెలియదని…
టీడీపీ అధినేత చంద్రబాబు డా.బీఆర్ అంబేద్కర్ వర్థంతి సందర్బంగా నివాళులు అర్పించారు. అంతేకాకుండా రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికీ హక్కులు ఉన్నాయంటూ వైసీపీ ప్రభుత్వ ఆ హక్కులను కాలరాస్తుందని తీవ్రంగా విమర్శించారు. అంతేకాకుండా ఓటీఎస్ పేరుతో ప్రజలకు వైసీపీ ప్రభుత్వం ఉరి వేస్తోందని చంద్రబాబు ఆరోపించారు. అయితే ఈ నేపథ్యంలో చంద్రబాబు మాటలకు కౌంటర్ గా వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.