ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడుతూ.. ఎన్నికల వరకూ చంద్రబాబు జైల్లో ఉండాలనేది జగన్ తాపత్రయం.. అందుకే హడావుడిగా రేపు జగన్ ఢిల్లీ వెళ్తున్నారు అని ఆయన ఆరోపించారు.
చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై వాదనలు పూర్తైన తర్వాత ఏసీబీ కోర్టు గంట పాటు కేసును వాయిదా వేసింది. మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత ప్రభుత్వం తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టులో వాదనలు వినిపించనున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోటు’ కేసు సంచలనం సృష్టిచింది. అయితే, నేడు సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణకు రానుంది. జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సుందరేష్ ల ధర్మాసనం విచారణ చేపట్టనుంది.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ వేశారు.. ఆ పిటిషన్లపై నేడు విచారణ జరుగనుంది. ఫైబర్ నెట్ స్కాంలో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్, స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ల మీద ఉన్నత న్యాయస్థానం విచారణ జరుపనుంది.
టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని టీడీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. గాంధీ జయంతి రోజున ఢిల్లీ నుంచి గల్లీ దాకా టీడీపీ నేతలు సత్యమేవ జయతే దీక్ష పేరుతో ఒక్క రోజు నిరాహార దీక్షకు పూనుకున్నారు.
ఇన్నేళ్లకు భువనేశ్వరికి తండ్రి గుర్తుకు రావడం ఆశ్చర్య మేస్తోందని తెలుగు అకాడమీ ఛైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. తల్లిదండ్రుల మీద గౌరవం ఉంటే నీ భర్త చేసిన లక్షల కోట్ల అవినీతి బయట పెట్టాలని ఆమె అన్నారు.