Nallapareddy Prasanna Kumar Reddy: చంద్రబాబుకు ఆ శాపం తగిలింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nallapareddy Prasanna Kumar Reddy: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.. ముఖ్యమంత్రిగా ఉంటూ దోపిడీ చేసి సంపాదించి కోటీశ్వరుడు అయిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. సీబీ సీఐడీ చేతిలో చిక్కి రాజమండ్రి జైలులో కూర్చున్నాడు.. నేను తప్పు చేసినా.. మా నాయకుడు తప్పు చేసినా చట్టం తన పని తాను చేసుకుని పోతుందని స్పష్టం చేశారు. అయితే, మనం ఏ పార్టీ అయినా ఎన్టీ రామారావుని గౌరవించాల్సిందే.. కానీ, వైస్రాయ్ హోటల్ వద్ద భగవంతుడికి సమానమైన ఎన్టీ రామారావు మీద చెప్పులు వేయించి మానసికంగా ఎన్టీ రామారావు చనిపోయే దానికి కారకుడు అయ్యాడు చంద్రబాబు.. నమ్మి ఆడబిడ్డని ఇచ్చి అల్లుడ్ని చేసుకుంటే పదవి వ్యామోహంతో ఆయనకే మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Mama Mascheendra: ఇండియన్ సినీ హిస్టరీలోనే ‘‘మామా మశ్చీంద్ర’’ ప్రయోగం
Also Read
ఎన్టీ రామారావు మీద చెప్పులు వేయించి.. ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి చంద్రబాబుకు కష్టకాలం మొదలైందన్నారు నల్లపరెడ్డి.. మనం కోరుకోకూడదు గాని భయంకరమైన చావు చావాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.. ఎన్టీ రామారావు మీద చెప్పులు వేయించినందుకు… ఈరోజు చంద్రబాబు కోసం ఎన్టీఆర్ కొడుకులు.. కోడళ్లు, కూతుర్లు అందరూ రోడ్లు మీదకు వచ్చారు.. ఎన్టీ రామారావు కుటుంబానికి సంబంధించిన కొడుకులు.. కూతుర్లు, కోడళ్లని అడుగుతున్నా.. ఆ రోజు వైస్రాయ్ హోటల్ వద్ద ఎన్టీ రామారావు మీద చెప్పులు వేశారు కదా మీరందరూ ఎందుకు చంద్రబాబుకి కొమ్ముకాచారు అంటూ నిలదీశారు. చంద్రబాబుని అరెస్ట్ చేస్తే మీ కుటుంబం అంతా రోడ్లమీదకు వచ్చి నానా రభస చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. అప్పట్లో అన్ని జిల్లాల్లో చంద్రబాబు నాయుడుకి పలువురు ఎమ్మెల్యేలు అమ్ముడు పోయారు.. చివరి వరకూ ఎన్టీరామారావు దగ్గరే నేనున్నాను.. నాతో పాటు దాదాపు 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.. చెప్పు లేసిన తర్వాత ఎన్టీ రామారావు ఇంటికి వచ్చాడు. సోపా మీద తల వాల్చేసి ఈరోజుతో ఎన్టీ రామారావు చనిపోయాడని కన్నీళ్లు పెట్టుకున్నాడు.. అందరం ఏడ్చామని గుర్తుచేసుకున్నారు. అంతటి మహానుభావుడిని. ఏడిపించినందుకు చంద్రబాబుకు శాపం తగిలిందన్నారు. ఇక, ఆరు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయని పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడులు కలిసి రంగంలో దిగాలని నిర్ణయం తీసుకున్నారు.. వారు ఇద్రదూ తోడుదొంగలు అంటూ ఆరోపించారు కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!