ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. 12 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో అవసరాల కోసం మభ్యపెట్టడం, మోసం చేయడం, అబద్దాలు చెప్పడం.. దైవభక్తి ఉన్న వైఎస్ జగన్ ఎన్నడూ చేయలేదన్నారు.
జాబు రావాలంటే బాబు రావాలని అబద్ధాలు చెబుతున్నారు అంటూ కేఏ పాల్ అన్నారు. 60 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎలా ఇస్తారు.. చంద్రబాబుకు బిల్ క్లింటన్, బిల్గేట్స్ ను నేనే పరిచయం చేశా.. రైతులకు రుణమాఫీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు.. కాంగ్రెస్ మేనిఫెస్టోను కాపీ కొట్టి మహిళలకు ఉచిత బస్సు వైద్యం వీటన్నిటి గురించి వాగ్దానాలు చేస్తున్నారు.
సజ్జల మాట్లాడుతూ.. కోట్లాది మంది హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి.. మన కాళ్ళపై మనం నిలబడే విధంగా ప్రజల జీవితాల్లో పూర్తి మార్పు తీసుకుని రావటం అంత తేలిక కాదు.. దీన్ని చేసి చూపించిన వ్యక్తులు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి.. ఇప్పుడు ఆయన కుమారుడు జగన్ కే సాధ్యం అని ఆయన చెప్పారు.
విశాఖపట్నంలో యువగళం విజయోత్సవ సభ కేవలం సీఎం జగన్ ని తిట్టటానికే ప్రాధాన్యత ఇచ్చారు అని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. పాదయాత్రలోని అనుభవాలను, ప్రజల సమస్యలను కనీసం సభలో చెప్పలేదు.. సీనియర్ అని చెప్పుకున్న చంద్రబాబు.. ఇటు పవన్ ని తీసుకు రావటానికి పడిన పాట్లు అందరూ గమనించారు.
ఏపీలో ఎన్నికల రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇరు పార్టీల నేతల ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలను సంధించుకుంటున్నారు. తాజాగా టీడీపీపై తీవ్రంగా వ్యాఖ్యానించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.
నారా లోకేష్ పాదయాత్ర ఆపసోపాలు పడుతూ ముగిసిందని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. లోకేష్ పాదయాత్ర ఏ ప్రభావం లేని యాత్ర అని.. పాదయాత్ర తర్వాత కూడా లోకేష్లో ఏం మార్పులేదన్నారు. లోకేష్ యాత్ర వల్ల ఒళ్ళు తగ్గింది తప్ప బుర్ర పెరగలేదని అన్నారు. లోకేష్ సభకు కాస్ట్ లీ యాంకర్లు వస్తున్నారని.. మీసం తిప్పి హాస్యం చేయటంలో బాలయ్యను మించిన వారు లేరన్నారు.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఉచిత ఇసుక విధానం కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిలు కోసం ఏపీ హైకోర్టులో దాఖలు చేశారు. దీంట్లో భాగంగా ఈ పిటిషన్ సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ హైకోర్టులో రిప్లై వాదనలు వినిపించారు.
విశాఖపట్నంలోని పోలిపల్లిలో టీడీజీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర యువగళం ముగింపు బహిరంగ సభలో టీడీపీ- జనసేన పార్టీలు ఉమ్మడిగా ఎన్నికల శంఖారావం పురిస్తామని ఆంధ్ర ప్రదేశ్ తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు.
నేడు ఆంధ్ర ప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటీషన్లపై విచారణ జరగనుంది. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత ఈ కేసుల విచారణ ప్రారంభం అవుతుంది. ఇసుక పాలసీలో అనేక అక్రమాలు జరిగాయని.. దాంతో ఏపీ ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడిందని చంద్రబాబుపై సీఐడీ అధికారులు కేసు ఫైల్ చేశారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైసీపీ సామాజిక బస్సు యాత్రలో భాగంగా మంత్రి జోగి రమేష్ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. జగన్ను ఎదుర్కోవటానికి ఒక టీడీపీ, ఒక చంద్రబాబు సరిపోరట.. అందుకే ఈ పొత్తులు నిర్ణయం అంటూ మంత్రి ఎద్దేవా చేశారు.