Botsa Satyanarayana: 2014లో పెళ్లి.. విడాకులు తీసుకొని మళ్లీ కలిశారు.. టీడీపీ-జనసేనపై మంత్రి సెటైర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa Satyanarayana: 2014లో పెళ్లి అయ్యింది.. విడాకులు తీసుకున్నారు.. ఇప్పుడు మళ్లీ కలిశారు అంటూ టీడీపీ-జనసేన పొత్తులపై సెటైర్లు వేశారు మంత్రి బొత్స సత్యనారాయణ.. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు ఉత్తరాంధ్రాకు ఏమి చేశారు..? అని నిలదీసిన ఆయన.. ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా?రాజరికం అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. అసలు పుంగనూరులో గొడవ ఎందుకు జరిగింది? అని నిలదీశారు. టీడీపీ-జనసేన ప్రభుత్వం వస్తుందని కలలు కనమనండి అని సూచించారు. దొంగలముఠా మరల వస్తుంది.. ప్రజలు నమ్మొద్దు.. విశాఖ రాజధానికి ఎన్నో అడ్డంకులు కలిగిస్తున్నారని మండిపడ్డారు. ఇక, లోకేష్ యువగళం పాదయాత్ర పై మంత్రి బొత్స హాట్ కామెంట్స్ చేశారు.. రాజకీయాల్లో కావాల్సింది రెడ్ బుక్ కాదు.. బ్లూ బుక్ కావాలని హితవుపలికారు. ఏమి చేసినా చట్టబద్ధంగా ఉండాలి.. ఎక్కడ యువగళం పాదయాత్రను అడ్డుకోలేదన్నారు. పిల్లాడు లోకేష్ ఏమి మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదు అని దుయ్యబట్టారు. 2014లో చంద్రబాబు మేనిఫెస్టో అసలు అమలు చేశారా? అని ప్రశ్నించారు.
దయచేసి విధుల్లోకి రండి..
దయచేసి విధుల్లోకి రండి అంటూ అంగన్వాడీలకు విజ్ఞప్తి చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ.. వైసీపీ ప్రభుత్వం మీకు వ్యతిరేకం కాదు. మీ డిమాండ్లపై సీఎం జగన్ మోహన్ రెడ్డి సానుకూలంగా ఉన్నారు. ముఖ్యమంత్రి మహిళా పక్షపాతన్న ఆయన.. గుజరాత్ రాష్ట్రంలో తప్ప దేశంలో ఏ రాష్ట్రంలో అంగన్వాడీలకు గ్రాట్యువీటి లేదు. గ్రాట్యువీటిలో కేంద్ర ప్రభుత్వానిది 50 శాతం వాటా. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నాం. అంగన్వాడీలకు ఇచ్చే ఫైనల్ సెటిల్మెంట్ ను పెంచుతున్నాం.. ఈ నిర్ణయం ఈ నిమిషం నుంచే అమలులోకి తెస్తున్నాం అని ప్రకటించారు. వారు 11 డిమాండ్లు ఇచ్చారు.. అందులో కొన్ని కేంద్రంతో ముడిపడిన అంశాలు.. వాటిపై కేంద్రం నుంచి వివరాలు కోరాం వారు స్పందించిన వెంటనే నిర్ణయం తీసుకుంటాం అన్నారు. అంగన్వాడీలకు భీమా 100 శాతం అమలు చేస్తాం.. దీనిపై ప్రత్యేకమైన నిర్ణయం తీసుకుంటామన్నారు. అంగన్వాడీల పదవి విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతున్నాం అని వెల్లడించారు మంత్రి బొత్స.
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
2017 నుంచి ఇప్పటి వరకూ ఉన్న టీఏ, డీఏలు పెండింగ్లో ఉన్నాయి.. ఇప్పటి నుంచి ఆ అలవెన్స్ లు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం అన్నారు మంత్రి బొత్స.. అంగన్వాడీలు వాడుతున్న యాప్స్ ను కుదిస్తాం.. ఒకటి లేదా రెండు యాప్స్ లో అన్ని అంశాలు తీసుకొస్తాం అన్నారు. తెలంగాణ కంటే ఎక్కువ అంగన్వాడీ జీతం ఇస్తాం అన్నాం.. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే చేశామని గుర్తుచేశారు. కానీ, వారు ఎప్పుడు పెంచితే అప్పుడు పెంచుతామని చెప్పలేదన్నారు. ఎన్నికల తరువాత జీతం పెంచే విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు మంత్రి బొత్స సత్యనారాయణ.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?