Botsa Satyanarayana: 2014లో పెళ్లి.. విడాకులు తీసుకొని మళ్లీ కలిశారు.. టీడీపీ-జనసేనపై మంత్రి సెటైర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa Satyanarayana: 2014లో పెళ్లి అయ్యింది.. విడాకులు తీసుకున్నారు.. ఇప్పుడు మళ్లీ కలిశారు అంటూ టీడీపీ-జనసేన పొత్తులపై సెటైర్లు వేశారు మంత్రి బొత్స సత్యనారాయణ.. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు ఉత్తరాంధ్రాకు ఏమి చేశారు..? అని నిలదీసిన ఆయన.. ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా?రాజరికం అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. అసలు పుంగనూరులో గొడవ ఎందుకు జరిగింది? అని నిలదీశారు. టీడీపీ-జనసేన ప్రభుత్వం వస్తుందని కలలు కనమనండి అని సూచించారు. దొంగలముఠా మరల వస్తుంది.. ప్రజలు నమ్మొద్దు.. విశాఖ రాజధానికి ఎన్నో అడ్డంకులు కలిగిస్తున్నారని మండిపడ్డారు. ఇక, లోకేష్ యువగళం పాదయాత్ర పై మంత్రి బొత్స హాట్ కామెంట్స్ చేశారు.. రాజకీయాల్లో కావాల్సింది రెడ్ బుక్ కాదు.. బ్లూ బుక్ కావాలని హితవుపలికారు. ఏమి చేసినా చట్టబద్ధంగా ఉండాలి.. ఎక్కడ యువగళం పాదయాత్రను అడ్డుకోలేదన్నారు. పిల్లాడు లోకేష్ ఏమి మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదు అని దుయ్యబట్టారు. 2014లో చంద్రబాబు మేనిఫెస్టో అసలు అమలు చేశారా? అని ప్రశ్నించారు.
దయచేసి విధుల్లోకి రండి..
దయచేసి విధుల్లోకి రండి అంటూ అంగన్వాడీలకు విజ్ఞప్తి చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ.. వైసీపీ ప్రభుత్వం మీకు వ్యతిరేకం కాదు. మీ డిమాండ్లపై సీఎం జగన్ మోహన్ రెడ్డి సానుకూలంగా ఉన్నారు. ముఖ్యమంత్రి మహిళా పక్షపాతన్న ఆయన.. గుజరాత్ రాష్ట్రంలో తప్ప దేశంలో ఏ రాష్ట్రంలో అంగన్వాడీలకు గ్రాట్యువీటి లేదు. గ్రాట్యువీటిలో కేంద్ర ప్రభుత్వానిది 50 శాతం వాటా. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నాం. అంగన్వాడీలకు ఇచ్చే ఫైనల్ సెటిల్మెంట్ ను పెంచుతున్నాం.. ఈ నిర్ణయం ఈ నిమిషం నుంచే అమలులోకి తెస్తున్నాం అని ప్రకటించారు. వారు 11 డిమాండ్లు ఇచ్చారు.. అందులో కొన్ని కేంద్రంతో ముడిపడిన అంశాలు.. వాటిపై కేంద్రం నుంచి వివరాలు కోరాం వారు స్పందించిన వెంటనే నిర్ణయం తీసుకుంటాం అన్నారు. అంగన్వాడీలకు భీమా 100 శాతం అమలు చేస్తాం.. దీనిపై ప్రత్యేకమైన నిర్ణయం తీసుకుంటామన్నారు. అంగన్వాడీల పదవి విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతున్నాం అని వెల్లడించారు మంత్రి బొత్స.
Also Read
- NPS Premature Exit: NPS ఖాతా నుంచి మొత్తం డబ్బు విత్డ్రా.. కేవలం 5 నిమిషాలే..! ఎవరికి అవకాశం?
- Hyderabad: పరారీలో "గోల్డ్ మ్యాన్" .. ఇంటికి తాళం వేసి రాత్రికి రాత్రే జంప్..
- Mohanlal: 'ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
- Shoaib Akhtar: ఉగ్రవాదులతో క్రికెటర్కి సంబంధం ఏంటి? అదీ 26/11 ముంబై, పహల్గామ్ దాడుల సూత్రధారుతో..
2017 నుంచి ఇప్పటి వరకూ ఉన్న టీఏ, డీఏలు పెండింగ్లో ఉన్నాయి.. ఇప్పటి నుంచి ఆ అలవెన్స్ లు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం అన్నారు మంత్రి బొత్స.. అంగన్వాడీలు వాడుతున్న యాప్స్ ను కుదిస్తాం.. ఒకటి లేదా రెండు యాప్స్ లో అన్ని అంశాలు తీసుకొస్తాం అన్నారు. తెలంగాణ కంటే ఎక్కువ అంగన్వాడీ జీతం ఇస్తాం అన్నాం.. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే చేశామని గుర్తుచేశారు. కానీ, వారు ఎప్పుడు పెంచితే అప్పుడు పెంచుతామని చెప్పలేదన్నారు. ఎన్నికల తరువాత జీతం పెంచే విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు మంత్రి బొత్స సత్యనారాయణ.
తాజావార్తలు
-
Prithviraj Sukumaran: మోహన్లాల్ను తాతను చేసిన పృథ్వీరాజ్.. అసలు కథ ఇదే!
-
NPS Premature Exit: NPS ఖాతా నుంచి మొత్తం డబ్బు విత్డ్రా.. కేవలం 5 నిమిషాలే..! ఎవరికి అవకాశం?
-
NP50 : నివిన్ పౌలి 50 ‘విజయం’.. ప్రేమమ్ కాంబో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో
-
ESIC Scheme: డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లకు గుడ్న్యూస్.. గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా సహా పలు ప్రయోజనాలు!
-
Explainer: చరిత్రలోనే అత్యంత క్రూరమైన ఉగ్రవాద దాడి..41ఏళ్ల తర్వాత బయటపడ్డ కనిష్క విమాన పేలుడు నిజం!
ట్రెండింగ్
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..