తెలంగాణ రాష్ట్రంలో కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్ కోడ్ మారనుంది. ప్రస్తుతం టీఎస్ కోడ్తో రిజిస్ట్రేషన్ చేస్తుండగా ఇక టీజీగా మారబోతుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నేడో, రేపో గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది.
సోషల్ మీడియా ఎక్స్ (ట్విట్టర్)కు చెందిన కొన్ని అకౌంట్లను నిలిపివేయాలని కోరుతూ భారత సర్కార్ ఆదేశాలు జారీ చేసిందని ఆ సంస్థ పేర్కొనింది. ప్రత్యేకమైన అకౌంట్ల నుంచి జరిగే పోస్టులను కూడా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు ఎలాన్ మాస్క వెల్లడించారు.
బ్రతుకు దెరువు కోసం విదేశాలకు వెళ్లి, అక్కడ ఏజెంట్ చేతిలో మోసపోయిన 12 మంది భారతీయులను తిరిగి వెనక్కు తీసుకురావాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. గత ఏడాది హైదరాబాద్ లోని నాంపల్లి బజార్ ఘాట్ ప్రాంతానికి చెందిన మహమూద్ అస్ఫాన్ తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మొత్తం12 మంది లేబర్ పని కోసం గల్ఫ్ దేశానికి వెళ్లారు. అక్కడి నుండి స్థానిక ఏజెంట్ ఎక్కువ జీతం…
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న ‘శ్వేతపత్రం’కు ప్రతిగా కాంగ్రెస్ పార్టీ ‘బ్లాక్ పేపర్’ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ పదేళ్ల పాలనపై కాంగ్రెస్ 'బ్లాక్ పేపర్' ప్రస్తావనకు రానుందని సమాచారం.
తమ విభేదాలను పక్కనబెట్టి, షెడ్యూల్డ్ కులాల కోటాలో రిజర్వేషన్లు నిరుపేదలు, అత్యంత బలహీన వర్గాలకు రిజర్వేషన్లలో ఎక్కువ వాటాను అందజేస్తాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బుధవారం ఏకగ్రీవంగా సుప్రీంకోర్టుకు తెలిపాయి. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కల్పించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరించాల్సిన ఆవశ్యకత ఉందని కేంద్రం అభిప్రాయపడింది.
ఎన్నికల కమిషనర్ పదవికి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కమిటీ ఇవాళ సమావేశం కానుంది. ఫిబ్రవరి 14వ తేదీన ఎన్నికల కమిషనర్ అనుప్ చంద్ర పాండే పదవీ విరమణ చేయడంతో ముగ్గురు సభ్యుల ఎన్నికల కమిషన్లో ఒక స్థానం ఖాళీ కానుంది.
ఎస్సీ వర్గీకరణపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుంది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి దాఖలైన అన్ని పిటిషన్లను జత చేసింది. పంజాబ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను ప్రధాన పిటిషన్గా న్యాయస్థానం స్వీకరించి విచారణ చేస్తుంది.
బియ్యం ధరలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇవాళ (ఫిబ్రవరి 6) సాయంత్రం 4 గంటలకు భారత్ రైస్ను ప్రారంభించనట్లు కేంద్రం ప్రకటించింది. కిలో బియ్యాన్ని కేవలం 29 రూపాయలకే కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలోని కర్తవ్య పథ్లో ఆరంభించనున్నారు.
బియ్యం ధర తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. మంగళవారం (ఫిబ్రవరి 6) సాయంత్రం 4 గంటలకు కేంద్ర ప్రభుత్వం భారత్ రైస్ను ప్రారంభించనట్లు ప్రకటించింది. కిలో బియ్యాన్ని రూ.29కే కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలోని కర్తవ్య పథ్లో ప్రారంభించనున్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి భారత్ బ్రాండ్తో కూడిన భారత్ రైస్ విక్రయాలను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. భారత ఆహార సంస్థ (FCI) నుంచి సేకరించిన 5లక్షల టన్నుల…
ఫిబ్రవరి 1న పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.. అందులో దక్షిణ మధ్య రైల్వేకు కేంద్రం బడ్జెట్ కేటాయించింది. కాగా.. ఈ బడ్జెట్ లో కేంద్రం ఎంత ప్రకటించిందో సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు.