యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు తెలంగాణపై కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమానికి మంత్రి ఈశ్వర్ హాజరయ్యారు. కరీంనగర్- రాయపట్నం రహదారిపై మంత్రి బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం మెయిన్ రోడ్డు నుంచి మల్లాపూర్ దాకా జరిగిన రైతుల ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో యాసంగి దొడ్డు ధాన్యం కొనుగోలు విషయంలో స్పష్టత ఇవ్వకుండా…
సీనియర్ సిటిజన్లు బూస్టర్ డోస్ తీసుకునేందుకు అనుమతించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కేంద్రాన్ని కోరారు. ఒమైక్రాన్ వేరియంట్ కేసుల విషయంలో ప్రజలు ఆందోళన చెందవద్దని అన్నారు. బూస్టర్ డోసులిచ్చే ప్రక్రియను ప్రారంభించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఒక్కరోజే ఢిల్లీలో 107 కేసులు నమోదవడంతో .. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సోమవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గత కొద్ది రోజులుగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని, ఆదివారం ఒక్కరోజే 100 కేసులు నమోదైనట్టు ఆయన తెలిపారు. అయితే ఇవి…
చేనేత వస్త్ర పరిశ్రమ పైన జనవరి 1, 2022 నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జీఎస్టీ పన్ను పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు లేఖ రాశారు మంత్రి కేటీఆర్. ఇప్పటికే టెక్స్ టైల్ రంగం ముఖ్యంగా చేనేత రంగం గత రెండు ఏళ్లు గా కరోనా సంక్షోభం కారణంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నదని.. ఇలాంటి నేపథ్యంలో..…
తెలంగాణలో వరి ధాన్యం కొనుగోళ్ల అంశం ఇప్పుడిప్పుడే తేలేలా లేదు. ఓ వైపు యాసంగి సీజన్ ప్రారంభం అవుతుండటంతో రైతులు అయోమయంలో ఉన్నారు. ప్రభుత్వం వరి పంటను వేస్తే కొనమని ఇప్పటికే స్పష్టంగా తేల్చి చెప్పింది. దీంతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు.వానాకాలం ధాన్యం కొనుగోలు పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది కాగా మరోసారి వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం తో అమితుతమీ తేల్చుకోవడానికి రాష్ర్టప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగానే మంత్రుల బృందం మరోసారి ఢిల్లీకి వెళ్లింది.…
దేశంలో లింగ నిష్పత్తిలో మహిళలు అగ్రస్థానంలో ఉన్నారు. గతంలో మగవారు ఎక్కువగా ఉండగా ఆడవారు తక్కువగా ఉండేవారు. అందుకే మగాళ్లకు పిల్ల దొరకడం లేదని మన పెద్దవాళ్లు కామెంట్ చేసేవాళ్లు. అయితే ఇప్పుడు దేశంలో మగవాళ్ల కంటే ఆడవాళ్లే ఎక్కువగా ఉన్నారని శనివారం నాడు లోక్సభలో కేంద్రమంత్రి భారతి ప్రవీణ్ పవార్ వెల్లడించారు. దేశంలో మహిళలు, పురుషుల నిష్పత్తి 1020: 1000గా ఉందని జాతీయ ఆరోగ్య సర్వేలో స్పష్టమైందని తెలిపారు. దేశంలో 1020 మంది మహిళలు ఉంటే……
అగ్ని ప్రైమ్ క్షిపణిని ఇవాళ విజయవంతంగా పరీక్షించారు. ఒడిశాలోని బాలాసోర్ వద్ద ఈ మిస్సైల్ను పరీక్షించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అగ్ని-పీ మిస్సైల్ కొత్త జనరేషన్కు చెందిన అడ్వాన్స్డ్ వేరియంట్. అగ్ని ప్రైమ్ క్యానిస్టర్ మిస్సైల్. దీని సామర్థ్యం 1000 నుంచి 2000 కిలోమీటర్ల దూరం. అగ్ని ప్రైమ్కు అణ్వాయుధాలు మోసుకువెళ్లే సామర్థ్యం ఉందని తెలిపారు. Read Also: చెన్నై-బెంగళూరు హైవేను దిగ్భంధించిన మహిళా కార్మికులు అగ్ని క్లాస్కు చెందిన ఈ మిస్సైల్లో అనేక కొత్త ఫీచర్లను…
ధాన్యం ఎగుమతిపై కేంద్రానికి ప్రణాళిక లేదని ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.ధాన్యం తీసుకోకుండా కేంద్రం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని కొంటామని కేంద్ర ప్రభుత్వం తక్షణమే పార్లమెంట్లో ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. Read Also: సోషల్మీడియా సాయంతో ఆర్టీసీ సమస్యలకు చెక్ ధాన్యం తీసుకోకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం పై నెపం నెట్టివేయాలని కేంద్రం చూస్తోందని ఆయన…
ఒమిక్రాన్ వేరింయంట్తో ప్రపంచం ఉలిక్కిపడింది. ఇప్పటికే ఐరోపాదేశాల్లో కేసుల సంఖ్య గణనీయంగా పెరగడంతో పాటు కొన్ని దేశాలు లాక్డౌన్ దిశగా వెళ్తున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్పై జాగ్రత్తగా ఉండాలని కేంద్రం ఆదేశాలు జారీ చేస్తూ ఒక విషయాన్ని ఉటంకిస్తూ రాష్ర్ట ప్రభుత్వాలను హెచ్చరించింది.బ్రిటన్లాంటి పరిస్థితి మన దేశంలో తలెత్తితే మన జనాభా ప్రకారం రోజుకు 14లక్షల ఒమిక్రాన్ కేసుల నమోదు అవుతాయని కేంద్రం పేర్కొంది. Read Also: బెయిల్ మంజూరుకు కారణాలు అవసరం లేదు బ్రిటన్లోని కరోనా వ్యాక్సిన్…
దేశ వ్యాప్తంగా నిర్వహించే సెంట్రల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీ-టెట్) పరీక్షను వాయిదా వేశారు. ఆన్ లైన్ ద్వారా నిర్వహించే ఈ పరీక్షలు గురువారం ప్రారంభం అయ్యాయి. అయితే ఆన్లైన్లో సాంకేతిక సమస్య కారణంగా పరీక్షలను వాయిదా వేసినట్టు ప్రకటించారు. దేశంలో వివిధ నగరాల్లో నిర్వహించే ఈ పరీక్షలు జనవరి 13 వరకు జరగనున్నాయి. మొదటి రోజు పేపర్ -2 పరీక్షలో సర్వర్ సమస్య తలెత్తింది. సాయంత్రం 4 గంటలైనా సమస్య పరిష్కారం కాకపోవడంతో పరీక్షను వాయిదా వేశారు.…
తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. లోక్సభలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు స్పందిస్తూ.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వానిదే అని స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర జలశక్తి సలహా మండలి అనుమతి ఉందని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వమే సొంత వనరులతో ఈ ప్రాజెక్టును నిర్మించిందని…. ఇప్పటివరకు 83.7 శాతం ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని కేంద్రం ప్రకటించింది. Read Also: ఎన్నికల…