కేంద్ర ప్రభుత్వం రైతులను వేధిస్తుంది: కొప్పుల ఈశ్వర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు తెలంగాణపై కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమానికి మంత్రి ఈశ్వర్ హాజరయ్యారు. కరీంనగర్- రాయపట్నం రహదారిపై మంత్రి బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం మెయిన్ రోడ్డు నుంచి మల్లాపూర్ దాకా జరిగిన రైతుల ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో యాసంగి దొడ్డు ధాన్యం కొనుగోలు విషయంలో స్పష్టత ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం రైతులను వేధిస్తున్నదని దుయ్యబట్టారు.
గత ఆరేండ్లుగా సవ్యంగా దొడ్డు వడ్ల కొనుగోళ్లు జరుగ్గా, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయమని చేతులెత్తేయడం సరికాదని విమర్శించారు. యాసంగి ధాన్యం కొనుగోలుపై కేంద్రం తేల్చేదేకా రైతుల పక్షాన పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం దొడ్డు వడ్లు కొనమని ఓ వైపు స్పష్టం చేస్తుంటే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇతర నాయకులు యాసంగిలో వరి సాగు చేయాలని పక్కదారి పట్టించేలా మాట్లాడుతున్న మాటలను రైతులు నమ్మొద్దని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో స్పష్టతతో వ్యవహరించాలన్నారు.
Also Read
Read Also:
తాజావార్తలు
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
-
Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
-
Story Board: కులం ప్లస్ రాజకీయం.. ఏపీలో ఎప్పుడూ ఇదే కాంబినేషన్..!
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!