Nitish Kumar: ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోనున్నట్లు బీహార్ సీఎం నితీష్ కుమార్ అధికారిక ప్రకటన చేశారు. గత కొన్ని రోజులుగా ఆయన రాజ్యసభకు వెళ్తారనే ప్రచారం ఉంది. తాజాగా గురువారం ఆయన ఈ ప్రచారం నిజమే అని నిర్ధారించారు.
‘‘గత రెండు దశాబ్దాలకు పైగా మీరు నాపై ఉంచిన విశ్వాసం, మద్దతు నిరంతరం కొనసాగుతోంది. అదే బలంతో మేము బిహార్ రాష్ట్రానికి, మీ అందరికీ సంపూర్ణ నిబద్ధతతో సేవ చేయగలిగాం. మీ విశ్వాసం, మద్దతు వల్లే బిహార్ ఈరోజు అభివృద్ధి మరియు గౌరవానికి కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది. ఇందుకు నేను గతంలో కూడా మీ అందరికీ పలుమార్లు కృతజ్ఞతలు తెలిపాను. నా పార్లమెంటరీ జీవితాన్ని ప్రారంభించినప్పటి నుంచే ఒక కోరిక నా మనసులో ఉంది. బిహార్ శాసన మండలి (విధాన మండల) రెండు సభలతో పాటు, పార్లమెంట్లోని రెండు సభల సభ్యుడిగా కూడా ఉండాలని ఆశించాను. ఆ క్రమంలో ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో రాజ్యసభ సభ్యుడిగా మారాలని కోరుకుంటున్నాను. మీతో నా ఈ అనుబంధం భవిష్యత్తులో కూడా అలాగే కొనసాగుతుందని నేను పూర్తి నిజాయితీతో హామీ ఇస్తున్నాను. మీ అందరితో కలిసి అభివృద్ధి చెందిన బిహార్ నిర్మాణం అనే సంకల్పం అలాగే కొనసాగుతుంది. కొత్తగా ఏర్పడే ప్రభుత్వానికి నా పూర్తి సహకారం మరియు మార్గదర్శనం ఉంటుంది.’’ అని ఆయన అధికారిక ప్రకటన చేశారు.
రాజ్యసభ సభ్యుడిగా నితీష్ కుమార్ వెళ్లిన తర్వాత, రాష్ట్రంలో కొత్త సీఎంగా బీజేపీ నేత ఉండబోతున్నారు. మరోవైపు, నితీష్ కుమారుడు నిశాంత్ డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం ఉంది. బీహార్ కొత్త సీఎంగా సామ్రాట్ చౌదరి బాధ్యతలు చేపట్టవచ్చని తెలుస్తోంది.