Rahul Gandhi: కాంగ్రెస్ అధినేత, లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ మరోసారి నోరుజారారు. ఇటీవల కాంగ్రెస్ కొత్త కార్యాలయంలో మాట్లాడుతూ.. ‘‘ భారత రాజ్యంపై పోరాటం’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశంలోని ప్రతి సంస్థను స్వాధీనం చేసుకున్నాయి. ఇప్పుడు మేము బీజేపీ, ఆర్ఎస్ఎస్, భారత రాజ్యంపై పోరాడుతున్నాము’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై గౌహతిలోని పాన్ బజార్ పోలీస్ స్టేష్లో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది.