Rahul Gandhi: ‘‘భారత్ రాజ్యం’’పై నోరుజారిన రాహుల్ గాంధీ.. మరో కేసు నమోదు..
- ‘‘భారత రాజ్యంపై పోరాటం’’ నోరుజారిన రాహుల్ గాంధీ..
- రాహుల్ వ్యాఖ్యలపై కేసు నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: కాంగ్రెస్ అధినేత, లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ మరోసారి నోరుజారారు. ఇటీవల కాంగ్రెస్ కొత్త కార్యాలయంలో మాట్లాడుతూ.. ‘‘ భారత రాజ్యంపై పోరాటం’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశంలోని ప్రతి సంస్థను స్వాధీనం చేసుకున్నాయి. ఇప్పుడు మేము బీజేపీ, ఆర్ఎస్ఎస్, భారత రాజ్యంపై పోరాడుతున్నాము’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై గౌహతిలోని పాన్ బజార్ పోలీస్ స్టేష్లో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
Read Also: Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ని పొడిచింది బంగ్లాదేశ్ వ్యక్తి.. పోలీసులకు ఎలా చిక్కాడంటే..?
Also Read
- Sonam wangchuk: సోనమ్ వాంగ్చుక్ హెల్త్ బులెటిన్ విడుదల.. చికిత్సకు నిరాకరణ..
- Amit Shah: 'చికెన్ నెక్' కారిడార్ భద్రతపై అమిత్ షా హై లెవల్ రివ్యూ..
- Abhijit Deepke: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. అభిజిత్ దీప్కేపై ఇంక్ దాడి..
- NEET Ranker: కన్నీటి నుంచి పుట్టిన సంకల్పం.. తండ్రి మరణాన్ని స్ఫూర్తిగా మార్చుకుని 'నీట్'లో ర్యాంక్..
జనవరి 15న ఢిల్లీలోని కోట్లా రోడ్లో కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా రాహుల్ గాంధీ ఈ ప్రకటన చేశారు. భారతదేశ సార్వభౌమాధికారాన్ని, ఐక్యతను, సమగ్రతను ప్రమాదంలో పడే చర్యలు అని బీఎన్ఎస్ సెక్షన్లు 152, 197(1)d కింద FIR నమోదు చేయబడింది. మోంజిత్ చెటియా రాహుల్ గాంధీపై కేసు పెట్టారు. ఆయన వాక్ స్వేచ్ఛ హద్దులు దాటిందని, జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తోందని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలు దేశ అధికారాన్ని చట్టవిరుద్ధం చేయడానికి ప్రయత్నించాయని, అశాంతి, వేర్పాటువాద భావాలను రేకెత్తించే కథనాన్ని సృష్టిస్తున్నాయిన చెటియా ఫిర్యాదులో పేర్కొన్నారు.
‘‘తన పోరాటం భారత రాజ్యంపై అంటూ భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రకటన చేయడం ద్వారా నిందితుడు ఉద్దేశపూర్వకంగా ప్రజల్లో విధ్వంస కార్యకలాపాలను, తిరుగుబాటును రెచ్చగొట్టాడు.’’ అని పేర్కొన్నారు. పదే పదే ఎన్నికల్లో ఓడిపోతూ నిరాశతో రాహుల్ గాంధీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెటియా అన్నారు. ప్రతిపక్ష నేతగా ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసాన్ని కాపాడాల్సిన రాహుల్ గాంధీ, దీనికి బదులుగా అబద్ధాలను వ్యాప్తి చేయడానికి, తిరుగుబాటును రెచ్చగొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. భారతదేశ ఐక్యత, సార్వభౌమత్వాన్ని ప్రమాదంలో పడేశారని అన్నారు.
తాజావార్తలు
-
Committee Kurrollu: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’కు అరుదైన గౌరవం
-
Kiran Abbavaram: ‘చెన్నై లవ్ స్టోరీ’పై కిరణ్ ధీమా.. నా కొడుకు అలా పిలిస్తే చాలు అంటూ కామెంట్స్!
-
Sonam wangchuk: సోనమ్ వాంగ్చుక్ హెల్త్ బులెటిన్ విడుదల.. చికిత్సకు నిరాకరణ..
-
Adluri Laxman : కేటీఆర్ సరూర్ నగర్ సభలో మాట్లాడించింది పెయిడ్ ఆర్టిస్టులతోనే
-
Kiran Abbavaram: “మా అమ్మ ఆరు ఏళ్లు నాకు దూరంగా ఉంది” కిరణ్ అబ్బవరం ఎమోషనల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!