2022: కొత్త ఏడాదిలో భారీగా పెరగనున్న ధరలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2022 ఏడాది రాకముందే సామాన్యుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. కొత్త ఏడాదిలో సిమెంట్ ధర మరింత పెరగనుంది. ప్రస్తుతం రూ.385 వరకు పలుకుతున్న 50 కిలోల సిమెంట్ బస్తా ధర మరో రూ.20 పెరగనుందని క్రిసిల్ అంచనా వేసింది. ఇదే జరిగితే గతంలో ఎన్నడూ లేని విధంగా బస్తా సిమెంట్ ధర రూ.400 దాటనుంది. సిమెంట్ తయారీ ధరలో ప్రధాన ముడి పదార్థాలైన బొగ్గు, పెట్కోక్ల ధరలు ఇటీవల విపరీతంగా పెరగడంతో త్వరలో సిమెంట్ బస్తాల ధరలు పెరగనున్నట్లు క్రిసిల్ వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే సిమెంట్ తయారీకి వాడే బొగ్గు ధర 120 శాతం పెరిగిందని.. అటు పెట్కోక్ ధర 80 శాతం వరకు పెరిగిందని కంపెనీలు చెప్తున్నాయి. వీటికి తోడు రవాణా ఛార్జీలు కూడా 5 నుంచి 10 శాతం పెరగడంతో ధరలు పెంచడం తప్ప మరో మార్గం లేదని కంపెనీలు అభిప్రాయపడుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టు, అక్టోబర్ నెలల్లో సిమెంట్ కంపెనీలు బస్తా ధరను బ్రాండ్ ఆధారంగా రూ.20 నుంచి రూ.30 వరకు పెంచిన సంగతి తెలిసిందే.
Read Also: ఇండియా వైపు మైక్రోసాఫ్ట్ చూపులు… భారీగా పెట్టుబడులు
Also Read
- Karnataka: ఘోర విషాదం.. గుడికెళ్లి వస్తుండగా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
- Supreme Court: సుప్రీం కోర్టు పొదుపు మంత్రం.. ఇకపై వర్చువల్ విచారణకు ఆదేశం
- Bhojshala Case: "భోజ్శాల హిందువులదే".. ఆలయం ఎలా మసీదుగా మారింది, చరిత్ర ఏం చెబుతోంది.?
- PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
మరోవైపు వచ్చే ఏడాది కార్ల ధరలు కూడా భారీగా పెరగనున్నాయి. జనవరి 1 నుంచి కార్ల ధరలు పెంచాలని మారుతీ, ఆడి, మెర్సిడెస్ కంపెనీలు నిర్ణయించాయి. కార్ల తయారీకి ఉపయోగించే మెటీరియల్ ఖర్చులు పెరిగిపోవడంతో పలు కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఇక ధరల పెంపు మోడల్ను బట్టి ఉంటుందని మారుతీ సుజుకీ తెలిపింది. జనవరి 1 నుంచి అన్ని మోడళ్ల కార్ల రేటును 3 శాతం పెంచుతున్నట్లు ఆడీ వెల్లడించింది. అటు జనవరి 1 నుంచి అన్ని మోడళ్ల కార్లను 1-2 శాతం వరకు పెంచుతామని మెర్సిడీస్ బెంజ్ ప్రకటించింది. గత ఏడాదిగా తయారీపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతున్న నేపథ్యంలో అదనపు వ్యయాల భారంలో కొంత భాగాన్ని వాహనాల రేట్ల పెంపు రూపంలో కంపెనీలు కస్టమర్లపై వేస్తున్నాయి.
తాజావార్తలు
-
West Bengal: సువేందు దూకుడు.. ఆర్జీకర్ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్..
-
Karnataka: ఘోర విషాదం.. గుడికెళ్లి వస్తుండగా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
-
T20 Captain: భారత టీ20 కెప్టెన్గా కొత్త సారథి.. సంజూ శాంసన్కు అవకాశం..?
-
JioStar vs Zee: కోర్టుకెక్కిన బాలీవుడ్ సినిమాల వివాదం.. రూ.250 కోట్ల నష్టపరిహారం?
-
Supreme Court: సుప్రీం కోర్టు పొదుపు మంత్రం.. ఇకపై వర్చువల్ విచారణకు ఆదేశం
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!