కేంద్ర ప్రభుత్వం మరో ప్రభుత్వ రంగ సంస్థను మూసివేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. టెలికాం ఆపరేటర్ సంస్థ అయిన మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (MTNL)ని మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రధాని మోడీ వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. తెలంగాణకు లక్ష కోట్లు ఇచ్చామని మోడీ చెప్తున్నారని.. ఆయన అబ్బ సొత్తు ఇచ్చారా అని నారాయణ ప్రశ్నించారు. గంగమ్మ జాతరకు బలిచ్చే మేకను పోషించినట్టు రైల్వేని ఆధునికీకరిస్తున్నారని.. ఆ తర్వాత అవి అమ్మేస్తారని ఆయన ఆరోపించారు.
BSNL :ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఎయిర్టెల్, జియో కాకుండా తక్కువ ధరకు ఎక్కువ వ్యాలిడిటీతో ప్రభుత్వ రంగ సంస్థ BSNL సరికొత్త ప్లాన్లను అందజేస్తోంది. తక్కువ ధరలో ఎక్కువ వ్యాలిడిటీతో వచ్చే ఇలాంటి ప్లాన్లు కూడా వీటిలో చాలా ఉన్నాయి.
BSNL New Plan: ఇటీవల కాలంలో మొబైల్ ప్లాన్ల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. రోజుకు 2 జీబీ డేటా, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ ప్లాన్ కావాలంటే ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు నెలకు రూ.300 బిల్లు వేస్తున్నారు. దీంతో మూడు నెలలకు రూ.900, ఆరు నెలలకు రూ.1500 ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ మాత్రం మంచి ఆఫర్ ప్రకటించింది. స్మార్ట్ ఫోన్లో డేటా లేనిదే నడవని ఈరోజుల్లో కేవలం రూ.997కే…
5జీ సేవలను ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోడీ… మొదటగా మెట్రో నగరాల్లో ప్రారంభం కానున్న 5జీ సేవలు ఆ తర్వాత క్రమంగా ఇతర నగరాలు.. పట్టణాలు ఇలా విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.. రిలయన్స్ జియో, ఎయిర్టెల్, అదానీ గ్రూప్ కూడా రంగంలోకి దిగిపోయి.. 5 జీ సేవల పనిలో మునిగిపోయాయి.. ఇప్పుడు ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత సంచార నిగమ్ లిమిడెట్ (బీఎస్ఎన్ఎల్) కూడా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యింది… తన వినియోగదారులకు గుడ్న్యూస్…
ఇప్పటికే దేశంలోనే అతిపెద్ద టెలికం సంస్థగా ఉన్న రిలయన్స్ జియో.. మరోసారి సత్తా చాటింది.. ఆ మధ్య కొత్త కస్టమర్లను యాడ్ చేసుకోవడం అటుంచితే.. ఉన్నవారినే కోల్పోయిన సందర్భాలున్నాయి.. అయినా.. నెంబర్ వన్గా కొనసాగుతూ వచ్చింది ఆ సంస్థ.. తాజాగా.. మళ్లీ కొత్త కస్టమర్లను యాడ్ చేసుకుంటూ దూకుడు చూపిస్తోంది.. జూన్ నెలకుగాను టెలికం సంస్థల యూజర్ల డేటాను టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసింది.. జియో మరోసారి అదరగొట్టింది. టెలికం రంగంలోని మిగతా…
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)పై కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం.. బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణకు ఉద్దేశించిన రూ. 1.64 లక్షల కోట్ల ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇదే సమయంలో భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ (బీబీఎన్ఎల్) మరియు బీఎస్ఎన్ఎల్ విలీనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఈ విలీనంతో, బీఎస్ఎన్ఎల్ దేశంలోని 1.85 లక్షల గ్రామ పంచాయతీల్లో యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (USOF) ఉపయోగించి 5.67 లక్షల కిలోమీటర్ల…
trai releases may month telecom companies subscribers data: ట్రాయ్ విడుదల చేసిన తాజా డేటా ప్రకారం మే నెలలో రిలయన్స్ జియో రికార్డు స్థాయిలో కొత్త కస్టమర్లను చేర్చుకుంది. మే నెలలో జియో నెట్వర్క్ను కొత్తగా 31 లక్షల మంది ఎంచుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా జియో సబ్స్క్రైబర్ల సంఖ్య 40.87 కోట్లకు చేరిందని ట్రాయ్ తెలిపింది. ఇదే నెలలో ఎయిర్టెల్లో 10.27 లక్షల మంది చేరడంతో యూజర్ల సంఖ్య 36.21 కోట్లకు చేరింది. వొడాఫోన్…
దేశంలో మొబైల్ వాడేవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో తమకు నచ్చిన, అందుబాటులో ఉండే నెట్వర్క్ను మొబైల్ యూజర్లు ఎంచుకుంటున్నారు. ఈ తరుణంలో ఇప్పటికే మార్కెట్లో బాగా పోటీపడుతున్న జియో, ఎయిర్టెల్కు తోడుగా ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా పలు ఆఫర్లను అందుబాటులోకి తెస్తోంది. అందులో భాగంగా కేవలం రూ.100 కన్నా తక్కువగా ఉండే మూడు ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. రూ.87 ప్లాన్: బీఎస్ఎన్ఎల్ తెచ్చిన రూ.100లోపు ప్లాన్లలో ఇది తక్కువ. ఎంతోమంది యూజర్లకు ఈ…