TRAI: జియో, ఎయిర్టెల్ కు కస్టమర్ల వెల్లువ.. చేజార్చుకున్న వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TRAI: టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఇటీవల ఏప్రిల్ 2023 నెల బ్రాడ్బ్యాండ్, టెలిఫోన్ చందాదారుల డేటాను విడుదల చేసింది. కస్టమర్ బేస్లో రిలయన్స్ జియో, ఎయిర్టెల్ అతిపెద్ద లాభాన్ని పొందాయి. వాటిలో 35 లక్షల మంది కొత్త కస్టమర్లు చేరారు. అదే సమయంలో వొడాఫోన్ ఐడియా 29.9 లక్షల మంది కస్టమర్లను కోల్పోయింది. భారతదేశపు అతిపెద్ద టెలికాం కంపెనీ రిలయన్స్ జియో ఏప్రిల్ నెలలో 33 లక్షల మంది కొత్త కస్టమర్లను జోడించడం ద్వారా టెలికాం రంగంలో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. అదే సమయంలో ఎయిర్టెల్ కేవలం 1.8 లక్షల మంది వినియోగదారులను మాత్రమే చేర్చుకుంది.
Read Also:Lifestyle : మగవాళ్ళు ఇది మీకోసమే.. ఈ టిప్స్ ఫాలో అయితే చాలు అమ్మాయిలు పడిపోతారు..
Also Read
- TVS Jupiter Dual Tone Spectral లాంచ్.. రూ.89,825కే.. అదిరిపోయే మైలేజ్, ఫీచర్లు..!
- MOTN Survey 2026: మళ్లీ బీజేపీదే అధికారం.. ఇప్పుడే ఎన్నికలు జరిగితే ఎన్డీయేకు 326 సీట్లు..
- Nepal Floods: వేళ్లన్నీ డ్రాగన్ వైపే.. విలయానికి చైనా నిర్మాణాలే కారణమా?
- Nepal Floods: నేపాల్కు మరో ముప్పు.. 72 గంటల్లో మరో సరస్సు బద్ధలయ్యే ఛాన్స్!
నెలాఖరుకు జియో సబ్స్క్రైబర్ బేస్ 44 కోట్లకు చేరుకోగా, భారతీ ఎయిర్టెల్ సబ్స్క్రైబర్ బేస్ స్వల్పంగా పెరిగి 37 కోట్లకు చేరుకుంది. అయితే, వోడాఫోన్ తన మొత్తం కస్టమర్ బేస్లో 29.9 లక్షల భారీ క్షీణతను చూసింది, మొత్తం కస్టమర్ల సంఖ్య 23.44 కోట్లకు చేరుకుంది. మొత్తం బ్రాడ్బ్యాండ్ సబ్స్క్రైబర్ల సంఖ్య 850.94 మిలియన్లుగా ఉందని, ఈ నెలలో మొత్తం 0.52శాతం వృద్ధిని నమోదు చేసుకున్నట్లు ట్రాయ్ డేటా పేర్కొంది. మొత్తంమీద మొదటి ఐదు సర్వీస్ ప్రొవైడర్లు ఏప్రిల్ చివరి నాటికి 98.39శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నారు.
Read Also:Balochistan Bomb Blast: పాకిస్థాన్లో బాంబు పేలుడు.. 34 మంది మృతి!
ఈ జాబితాలో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ 441.92 మిలియన్లు, భారతీ ఎయిర్టెల్ 244.37 మిలియన్లు, వొడాఫోన్ ఐడియా 123.58 మిలియన్లు, బీఎస్ఎన్ఎల్ 25.26 మిలియన్లు, అట్రియా కన్వర్జెన్స్ 2.14 మిలియన్లు ఉన్నాయి. సమాచార ప్రసారాల కోసం వైర్లైన్ విభాగంలో దాదాపు 9.7 లక్షల మంది సబ్స్క్రైబర్లు వృద్ధి చెంది 3.44శాతం వృద్ధిని నమోదు చేశారని, వైర్లెస్ విభాగంలో దాదాపు 7.96 లక్షల మంది సబ్స్క్రైబర్లు క్షీణించారు. ఈ నెలలో 0.07శాతం క్షీణత నమోదైందని డేటా వెల్లడించింది. టెలికాం రంగం నెలలో మొత్తం టెలిఫోన్ సబ్స్క్రైబర్లలో 0.02శాతం వృద్ధిని సాధించింది, వైర్లెస్ కూడా 0.07శాతం క్షీణతను నమోదు చేసింది. ప్రైవేట్ యాక్సెస్ సర్వీస్ ప్రొవైడర్లు వైర్లెస్ సబ్స్క్రైబర్లలో 90.80శాతం మార్కెట్ వాటాను కలిగి ఉండగా, రెండు పీఎస్యూ యాక్సెస్ సర్వీస్ ప్రొవైడర్లు అయిన బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ కేవలం 9.20శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయని ట్రాయ్ నివేదించింది.
తాజావార్తలు
-
TVS Jupiter Dual Tone Spectral లాంచ్.. రూ.89,825కే.. అదిరిపోయే మైలేజ్, ఫీచర్లు..!
-
MOTN Survey 2026: మళ్లీ బీజేపీదే అధికారం.. ఇప్పుడే ఎన్నికలు జరిగితే ఎన్డీయేకు 326 సీట్లు..
-
Nepal Floods: వేళ్లన్నీ డ్రాగన్ వైపే.. విలయానికి చైనా నిర్మాణాలే కారణమా?
-
Government Action : వనపర్తిలో బుల్డోజర్ యాక్షన్.. రూ.52 కోట్ల బకాయిలపై ఉక్కుపాదం
-
Nepal Floods: నేపాల్కు మరో ముప్పు.. 72 గంటల్లో మరో సరస్సు బద్ధలయ్యే ఛాన్స్!
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!