BSNL: బిఎస్ఎన్ఎల్ అధికారులపై 25 చోట్ల సిబిఐ దాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BSNL: ప్రభుత్వరంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ను మోసం చేసి ఒక ప్రైవేటు కాంట్రాక్టర్కు మేలు చేయాలని చూసిన బీఎస్ఎన్ఎల్ అధికారులపై సీబీఐ దాడులు నిర్వహించింది. మాజీ జనరల్ మేనేజర్తో సహా 21 మంది అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో సీబీఐ దేశ వ్యాప్తంగా 25 చోట్ల సోదాలు నిర్వహించిందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL)ని మోసం చేసేందుకు నిందితులు ఒక కాంట్రాక్టర్తో కలిసి కుట్ర పన్నారని ప్రీమియర్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఆరోపించింది.
Read also: Draupadi Murmu: దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యేషన్ పరేడ్.. హాజరైన రాష్ట్రపతి
Also Read
- West Bengal: సెప్టెంబర్ 1 నుంచి బెంగాల్లో కొత్త రూల్.. మాతృ భాషకు పట్టం కట్టిన సీఎం సువేందు అధికారి!
- Abhijeet Dipke: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే అరెస్ట్..
- India First Dengue Vaccine: శుభవార్త.. భారత్లో తొలి డెంగ్యూ వ్యాక్సిన్కు ఆమోదం.. ఎవరికి? ఎన్ని డోసులు? పూర్తి వివరాలు
- SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
జోర్హాట్, సిబ్సాగర్, గౌహతి మరియు ఇతర ప్రాంతాలలో మాజీ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మరియు చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్తో సహా బిఎస్ఎన్ఎల్ అస్సాం సర్కిల్ అధికారులపై సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వారు తెలిపారు. ఎఫ్ఐఆర్లో ఓ ప్రైవేట్ వ్యక్తి పేరు కూడా ఉన్నట్టు అధికారులు తెలిపారు. నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్(ఓఎఫ్సీ) కేబుల్ను ఓపెన్ ట్రెంచింగ్ పద్ధతిలో కిలోమీటరుకు రూ. 90,000 చొప్పున వేయడానికి కాంట్రాక్టర్కు వర్క్ ఆర్డర్ ఇచ్చారని సీబీఐ ప్రతినిధి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Read also: Gold Bond: రూ. 5,926కి గోల్డ్ బాండ్ ఇస్తున్న ప్రభుత్వం.. సోమవారం నుంచి షురూ
కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాత కాంట్రాక్టర్ ప్రైవేట్ భూమి యజమాని నుండి ఎటువంటి హక్కు లేకుండా వివిధ అభ్యర్ధనలు చేశాడు, ఓపెన్ ట్రెంచింగ్ పద్ధతిని క్షితిజ సమాంతర దిశాత్మక డ్రిల్లింగ్ పద్ధతికి మార్చడానికి ప్రతిపాదించాడు. అందుకు కిమీకి రూ. 2.30 లక్షలు ఇచ్చినప్పటికీ…నియమాలను పాటించకుండా.. టెండర్ నిబంధనను ఉల్లంఘించడంతో BSNLకి రూ. 22 కోట్ల (సుమారు) నష్టం వాటిల్లిందని అధికారి తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత, అస్సాం, బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా మరియు హర్యానాలోని బీఎస్ఎన్ఎల్ అధికారుల కార్యాలయాలతోపాటు నివాసాలతో సహా 25 ప్రదేశాలలో సీబీఐ శుక్రవారం సోదాలు నిర్వహించిందని ఆయన చెప్పారు.
తాజావార్తలు
-
Rain Alert: ఏపీలో భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు..
-
Monalisa: ‘నా జీవితం ప్రమాదంలో ఉంది’.. కుంభమేళా ఫేమ్ మోనాలిసా!
-
Covid Cases In AP: ఏపీలో ఆగని కరోనా కేసులు.. బాపట్లలో ఒకరికి కరోనా పాజిటివ్..
-
NBK సినిమాలో ఐశ్వర్య రాజేశ్? ఇప్పటి వరకు చేయని పాత్రలో క్రేజీ బ్యూటీ!
-
Tollywood : ఏం నమ్మి బడ్జెట్ పెడుతున్నారు ?
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!