బీజేపీ, బీఆర్ఎస్ మధ్య డిగ్రీ సర్టిఫికెట్ల వార్ జరుగుతుంది. ట్విటర్ వేదికగా ఒకరినొకరు విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. డిగ్రీ సర్టిఫికెట్ల వ్యవహారంలో ప్రధాని మోడీ టార్గెట్ చేస్తూ.. మంత్రి కేటీఆర్ట్వి ట్విటర్ వేదికగా వ్యంగాస్త్రం వేసిన విషయం తెలిసిందే.
కక్కుర్తి పడి ఇక్కడ ఎవరు లేరన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కునంనేని సంచలన వ్యాఖ్యాలు చేశారు. కమ్యూనిస్టుల గురించి బీఆర్ఎస్ నాయకులు పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దని కునంనేని అన్నారు. బీఆర్ఎస్ తో ఎన్నికల్లో కలుస్తామా లేదా అనేది చర్చ లేదన్నారు.
షర్మిల ఫోన్ చేశారని ఆమెతో కలిసి పని చేయడానికి మేము కూడా సిద్ధమే అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కానీ షర్మిలకు మోడీ.. ఆధాని దోపిడీ గుర్తుకు రాలేదని మండిపడ్డారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ కు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బహిరంగ లేఖ రాశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం పోలంపల్లి గ్రామంలో పాదయాత్రలో లేఖను సీఎల్పీ నేత విడుదల చేశారు.
కులం ఒకటి అయితే మరో కులం పేరు చెప్పుకొని వాళ్ళమాదిరిగా నేను రాజకీయాలు చెయ్యడం లేదని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మద్య ఓ నాయకుడు నాపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఆత్మీయ సమావేశాలకు సమాచారం ఇవ్వాలని, లేకపోతే పార్టీలో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనాపూర్ మండలం కేంద్రంలో సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో కడియం శ్రీహరి పాల్గొన్నారు.