వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రలు ఆపండి! కార్పొరేట్ మిత్రులకు కట్టబెట్టే పన్నాగాలు మానండి! అంటూ కేంద్ర ప్రభుత్వానికి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు.
భద్రాచలం వెళ్తే సీఎం పదవి పోతుందని కేసీఆర్ వెళ్లడం లేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ మూఢ విశ్వాసాలు ఈసారి ఎన్నికలు గట్టెక్కించలేవని తెలిపారు.
బీఆర్ఎస్ పై ప్రతిపక్షాలు పోరాడేందుకు సిద్ధమవుతున్నాయి. బీజేపీ, తెలంగాణ కాంగ్రెస్, వైఎస్ఆర్ పార్టీలు మూడుకూడా ముకుమ్ముడి బీఆర్ఎస్ పై దాడి చేసేందుకు ప్లాన్ సిద్దం చేసుకుంటున్నారు.
నిజామాబాద్ జిల్లాలో BJP, BRS మధ్య ఫ్లెక్సీ వార్ కొనసాగుతోంది. బీఆర్ఎస్, బీజేపీలు ఒకరిపై మరొకరు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేస్తూ నగరంలో హల్చల్ సృష్టిస్తున్నాయి.
నేడు ఎమ్మెల్సీ కవిత జగిత్యాల పర్యటనకు వెళ్లనున్నారు. ఈడీ విచారణ తరువాత తొలిసారిగాని ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పర్యటించనున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొననున్నారు.
మంచిర్యాలలో పీపుల్స్ మార్చ్ సందర్భంగా భట్టి విక్రమార్క వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. లిక్కర్ స్కాం పై భట్టి విక్రమార్క హాట్ కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. ఢిల్లీ తరహాలో తెలంగాణ లో లిక్కర్ స్కాం జరుగుతుందని మండిపడ్డారు. లోతుగా విచారణ చేపట్టితే బయట పడుతుందని అన్నారు.