Minister KTR: గువ్వల బాలరాజు పై దాడి జరిగినట్టు తెలిసిందని, దాడులు సరికావని, మొన్న ప్రభాకర్ రెడ్డి పై కత్తితో దాడి... ఇప్పుడు బాలరాజు పై రాళ్ళ దాడి చేశారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.
Palvai Shravanthi: దివంగత రాజ్యసభ సభ్యుడు పాలవాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాలవాయి స్రవంతి భారత్ పార్టీలో చేరారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆమెకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Nagarkurnool:కర్నూలు జిల్లా అచ్చంపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రచారం నిర్వహిస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై రాళ్ల దాడి జరిగింది. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రికి తరలించారు.
ఇంటింటికీ వెళ్లి ప్రతి ఒక్కరినీ పలుకరిస్తూ.. సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థిస్తూ ఓటర్లను ఆకట్టుకున్నారు. అంబర్ పేటలో గత ఐదేళ్లలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు నీరాజనం పడుతున్నారు.
తెలంగాణలో నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఏ పార్టీ నుంచి ఎవరెవరు పోటీ చేస్తున్నారో లెక్క తేలింది. మూడు పార్టీలు కూడా బడుగుల ప్రతినిధి తామేనని చెప్పుకునే ప్రయత్నం చేశాయి. ఇంతకీ ఏ పార్టీ ఏ సామాజిక వర్గానికి ఎన్ని సీట్లిందో తెలుసా?. ఎన్నికల్లో గెలవాలంటే ఏ ఒక్క వర్గమో ఓటేస్తే సరిపోదు. అందరి మద్దతు కావాల్సిందే. అందుకే అన్ని పార్టీలు కులాలను, వర్గాలను అక్కున చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
వేములవాడ రాజకీయాలు వేడెక్కాయి. వేములవాడలో బీజేపీ అభ్యర్థిగా ప్రకటించిన తులా ఉమకు టికెట్ ఇచ్చి బీఫామ్ ఇవ్వకపోవడంతో అక్కడ రాజకీయం రసవత్తరంగా మారింది. వేములవాడ బరి నుంచి వికాస్ రావు బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగడంతో తుల ఉమ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
Asaduddin Owaisi: రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పెళ్లి అంటూ బీజేపీ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. దీంట్లో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీని పెళ్లి పెద్దగా, ఖాజీగా అభివర్ణించింది. ఈ పోస్టర్పై అసదుద్దీన్ స్పందించారు. బీజేపీపై సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను అందరికి పెళ్లి కొడుకునా.. లేక సోదరుడినా..? ’’ అంటూ ప్రశ్నించారు.
పాలేరులో బలమైన నాయకుడు పొంగులేటి వచ్చారు ఇవ్వలేం అన్నారు.. ఏ సీటు ఇస్తారో చెప్పండి అంటే సమాధానం ఇవ్వలేదు.. వైరా, మిర్యాలగూడకి అంగీకారం కుదిరింది.. తర్వాత వైరా లేదు మిర్యాలగూడ ఒక్కటే ఇస్తామన్నారు.. కురదు అని చెప్పామని తమ్మినేని వీరభద్రం అన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టం ముగిసింది. నిన్నటితో నామినేషన్ల ప్రక్రియకు ముగింపు పలికారు. ఇక, ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు భారీ సంఖ్యలో స్వతంత్రులు నామినేషన్లు దాఖలు చేశారు.
కాంగ్రెస్ అధిష్టానం విడుదల చేసిన తుది జాబితాలో సూర్యాపేట కాంగ్రెస్ అభ్యర్థిగా రామ్ రెడ్డి దామోదర్ రెడ్డిని ప్రకటించింది. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. సూర్యాపేట కాంగ్రెస్ టికెట్ ఆశించిన పటేల్ రమేష్ రెడ్డితో అధిష్టానం మాట్లాడుతుందని ఆయన తెలిపారు. ఇన్నాళ్లు కాంగ్రెస్ అభివృద్ధి కోసం రమేష్ రెడ్డి కష్టపడి పనిచేశారన్నారు. రమేష్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం సముచిత స్థానం ఇవ్వాలని కోరానని తెలిపారు. రమేష్ రెడ్డితో వివాదం లేకుండా ఇద్దరం కలిసి పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు.