Bandi Sanjay : కాంగ్రెస్ పార్టీలో గల్లీ నుండి ఢిల్లీ వరకు అందరూ ముఖ్యమంత్రులే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. కరీంనగర్ లో చేల్లని రూపాయి హుస్నాబాద్ లో చెల్లుద్దని పొన్నం వచ్చాడా అని ఆయన అన్నారు. కేసీఆర్, కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేస్తే బీఆర్ఎస్ లో నలుగురు సీఎం పదవి కోసం కొట్లాడుతారని, కాంగ్రెస్ లో 70 మంది అభ్యర్థులకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టుబడి పెడుతున్నాడన్నారు. కాంగ్రెస్ పార్టీలో గల్లీ నుండి ఢిల్లీ వరకు అందరూ ముఖ్యమంత్రులే అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితుల పై లాఠీ చార్జి చేస్తే అర్ధరాత్రి ఢిల్లీ నుండి వచ్చి వారిని ఆసుపత్రిలో చేర్పించి అండగా నిలిచానన్నారు.
Also Read : Revanth Reddy : ల్యాండ్ పూలింగ్ తో పేదల భూములు లాక్కునే ప్రయత్నం చేశారు
Also Read
ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే సతీష్ కుమార్ కేసీఆర్ తో మాట్లాడి హుస్నాబాద్ కు ఎన్ని నిధులు తెచ్చాడో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కొంతమంది పోలీస్ ఆఫీసర్లు ప్రమోషన్ల కోసం కేసీఆర్ మోచేతి నీళ్లు తాగుతున్నారని, 30 వేల కోట్ల రూపాయలతో అయ్యే కాలేశ్వరం ప్రాజెక్టును లక్ష 30 వేల కోట్లకు పెంచి లక్ష కోట్లు దోచుకున్నారన్నారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని ఎవరైనా నిరుద్యోగుల కోసం కొట్లాడి జైలుకు పోయారా అని ఆయన వ్యాఖ్యానించారు. పొన్నం ప్రభాకర్ ఎప్పుడైనా జైలుకెళ్లాడా లాఠీ దెబ్బలు తిన్నాడా నేను లాఠీ దెబ్బలు తిన్నాను, జైలుకెళ్లానని, తిండికి లేని కేసీఆర్ కుటుంబానికి ఇవాళ లక్షల కోట్లు ఎలా వచ్చాయని బండి సంజయ్ ప్రశ్నించారు.
Also Read : CM KCR : 2014 వరకు చాలా జిల్లాల ప్రజలు ఉపాధి కోసం వలసలు వెళ్లేవారు..
తాజావార్తలు
-
Toxic: యష్ క్రేజ్.. ఇండియాలోనే మోస్ట్ అవైటెడ్ మూవీగా ‘టాక్సిక్’..
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!