జనగామ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య ప్రజా ప్రతినిధులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు తన వెంట ఉన్న వారు లింగాల గణపురం మండలం కేంద్రంలో జరిగిన షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో హాజరు కాకపోవడం వారిపై ఆయన పరోక్షంగా చురకలాంటించారు.
BRS Party: తెలంగాణ ఉద్యమకారుడు, గాయకుడు సాయిచంద్ కుటుంబానికి బీఆర్ఎస్ ఆర్థిక సాయం చేసింది. ఇటీవల గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందడంతో సాయిచంద్ కుటుంబాన్ని ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ రూ. 1.50 కోట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో నూటికి నూరు శాతం గెలిచి మరోసారి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది బీఆర్ఎస్ పార్టీయేనని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలు చెప్పేవి అన్నీ అబద్ధాలేనని ఆయన పేర్కొన్నారు.
శివసేన (యూబీటి) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఆదివారం అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ)ను అమీబాతో పోల్చారు. బీజేపీ నేతృత్వంలోని ఫ్రంట్కు ఖచ్చితమైన ఆకారం, పరిమాణం లేదని అన్నారు.
తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని తన అనుచరులకు రవీందర్ రావు చెప్పుకొచ్చారు. మేం అందరం.. సీఎం కేసీఆర్ కోసం పనిచేస్తున్నాం.. కానీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కోసం పనిచేయబోమని ఎమ్మెల్సీ రవీందర్ రావు వర్గీయులు అంటున్నారు. తాము శంకర్ నాయక్తో కలిసి తిరిగినా జనం ఓట్లు వేయరని వారు పేర్కొన్నారు. శంకర్ నాయక్ను నియోజకవర్గ ప్రజలు నమ్మడం లేదని.. ఆయన తప్పకుండా ఈ సారి ఎన్నికల్లో ఓడిపోతారని ఎమ్మెల్సీ అనుచరులు చెప్పారు.
తెలంగాణలో బీఆర్ఎస్ సర్కారు వైఫల్యాలపై, మోసపూరిత పాలనపై పోరాటం చేస్తున్న బీజేపీ శ్రేణులపై దాడులకు, లాఠీచార్జ్ లకు పాల్పడుతూ అణచివేయాలని చూస్తోంది అని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. ప్రజాస్వామ్యబద్దంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు చేస్తున్న పోరాటాలను అణచివేయాలని చూడటం దుర్మార్గ చర్యే అని ఆయన వ్యాఖ్యనించారు.
కాంగ్రెస్ వాళ్లు ధరణి తీసేస్తాం అంటున్నారు.. ధరణి తీసేస్తే రైతుల అధికారం పోతుంది అని ఆయన చెప్పుకొచ్చారు. ధరణి ఉంటే మీ భూమిని సీఎం కూడా మార్చలేడు.. తీసేస్తే అధికారుల దగ్గర పోతుంది.. ధరణి పోతే పెద్ద పాము మింగినట్టు అయితదని కేసీఆర్ చెప్పారు.
MLC Kavitha: మహిళా రిజర్వేషన్ తన వ్యక్తిగత ఎజెండా కాదని ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత అన్నారు. దేశంలోని మహిళలందరూ చట్టసభల్లో రిజర్వేషన్లు కోరుకుంటున్నారని అన్నారు.
కూనంనేని మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నిర్ణయంతో మాకేం నష్టం లేదు.. నష్టపోయేది కేసీఆరే.. బీజేపీతో కేసీఆర్కి సఖ్యత వచ్చింది.. మునుగోడులో బీజేపీ ప్రమాదమని చెప్పిన కేసీఆర్కి.. ఇప్పుడు బీజేపీతో మిత్రుత్వం ఎక్కడ కుదిరింది? బీజేపీకి దగ్గరైతే.. కనీస మిత్ర ధర్మం ఉండాలి కదా? దీనికి కేసీఆర్ సమాధానం చెప్పాలి అని అడిగారు.