Madhu Yashki : సుప్రీం కోర్టు తీర్పుపై కేసీఆర్ భుజాలు తడుముకుంటుండు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సుప్రీం కోర్టు తీర్పు పై కేసీఆర్ భుజాలు తడుముకుంటుండని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ అన్నారు. టెక్నీకల్ పాయింట్స్ పై నే జడ్జిని మార్చి కొత్త జడ్జితో విచారణ చేయమన్నదని, బీఆర్ఎస్ నాయకులు తెలుసుకోవాలన్నారు మధుయాష్కీ. తప్పు చేయకుంటే విచారణ కమిషన్ ముందు హాజరుకావొచ్చుగా అని ఆయన వ్యాఖ్యానించారు. తప్పు చేయనప్పుడు ఎందుకు కల్వకుంట్ల కుటుంబంలో కలవరం అని ఆయన ప్రశ్నించారు. పది ఏండ్లలో 80 వేల కోట్ల అవినీతి చేశారని, గతంలోనే విద్యుత్ కొనుగోలు లో అవినీతి జరిగిందని చెప్పిన అని మధు యాష్కీ గుర్తు చేశారు. 138 కోట్లు కమిషన్ కేటీఆర్,హరీష్ రావులు తీసుకున్నారని చెప్పారన్నారు. తెలంగాణ రాకముందు మీ ఆస్తుల ఎంత అని, వచ్చాక ఆస్తులు ఎంత అని ఆయన అన్నారు. అన్ని బయటకు వచ్చి జైలుకు పోతారన్నారు. అభివృద్ధి పేరు పైన ,ప్రాజెక్టుల రి డిజైన్ పేరు మీద వేలాది కోట్లు దోచుకున్నారని, విచారణ ను అడ్డుకోవాలని కేసీఆర్ చూస్తున్నారన్నారు. సుప్రీం కోర్టు కేసీఆర్ అవినీతిని అడ్డుకోలేదన్నారు మధు యాష్కీ. కొత్త జడ్జి వచ్చి అవినీతిని బయటకు తీస్తాడని, గ్రీన్ ఛాలెంజ్ అని హడావిడి చేసే చెట్ల సంతోష్ పత్తా లేకుండా పోయిండన్నారు. వాళ్ళ ఆవిడా పేరుమీద నర్సరీ పెట్టి కోట్ల రూపాలను దోచుకున్నారని, దానిపై కూడా విచారణ చేపట్టాలన్నారు మధు యాష్కీ.
Also Read
తాజావార్తలు
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
-
OTR: రాఖీతో పొలిటికల్ బంధం బలపడుతుందా..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!