ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నిజాంపేట వినాయకనగర్లో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజాంపేట వినాయక నగర్లో ఉన్న జ్యూయల్ గ్రాండ్ అపార్ట్మెంట్లో ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం వచ్చిందని తెలిపారు. లలిత (56) దివ్య (32) శివ కార్తికేయ (వన్ అండ్ ఆఫ్ ఇయర్) ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే.. లలిత, శివ అక్కడికి అక్కడే మృతి చెందగా.. దివ్య పరిస్థితి…
మరోసారి టీఆర్ఎస్ ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ నేతల ఆస్తులు విచ్చల విడిగా పెరుగుతున్నాయని, తెలంగాణ కోసం పోరాడిన పేదొడు పేదొడిగానే మిగిలిపోయాడంటూ ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీకి ఎకరాకు పైగా భూమి కేటాయిస్తూ ప్రభుత్వం జీవో ఇవ్వడం దుర్మార్గమని, వంద కోట్ల విలువైన భూమిని ఎలా టీఆర్ఎస్ పార్టీకి కేటాయిస్తారని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ భవన్కు కూత వేటు దూరంలో మళ్ళీ అదే పార్టీకి ఎకరాకు పైగా భూమి ఎందుకు…
నడిరోడ్డుపై రెండు వర్గాలకు చెందిన హిజ్రాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఘటన రాజేంద్ర నగర్లోని హసన్ నగర్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లాల్ దర్వాజా నుండి రాజేంద్రనగర్ ప్రాంతానికి వచ్చి డబ్బులు వసూల్ చేస్తున్నారు ఓ వర్గం హిజ్రాలు. దీంతో.. మా ఏరియా లో మీరు ఏలా డబ్బులు వసూలు చేస్తారంటూ మరో వర్గం హిజ్రాలు నిలదీశారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య మాట మాట పెరిగి వాగ్వాదం చోటుచేసుంది. ఈ క్రమంలోనే ఓ…
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే ఈ నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులకు ఎస్ఎస్సీ బోర్డు గుడ్న్యూస్ చెప్పింది. బుధవారం ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్ మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు గురువారం నుంచి హాల్ టికెట్లు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు పాఠశాలలకు హాల్ టికెట్లు పంపినట్లు ఆయన తెలిపారు. అయితే.. పాఠశాలల ప్రధానోపాధ్యాయుల నుంచి విద్యార్థులు హాల్ టికెట్లు పొందవచ్చనీ, అలాగే www.bse.telangana.gov.in…
సిద్దిపేటలో రంగనాయక్ సాగర్ వద్ద ఇరిగేషన్ అధికారుల రాష్ట్రస్థాయి ఉన్నత అధికారుల సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశంలో స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ-ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి డాక్టర్ రజత్ కుమార్, ఈఎన్సీ జనరల్ మురళీధర్, ఈఎన్సీ ఇరిగేషన్ గజ్వేల్ హరిరామ్, ఈఎన్సీ ఇరిగేషన్ రామగుండం ఎన్. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మురళీధర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు అయ్యాక ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని, తెలంగాణ ఏర్పాటు అయ్యాక ప్రతి ఆయకట్టకు నీరు అందించామని, కాళేశ్వరం…
వర్షం వచ్చందంటే చాలు హైదరాబాద్లో మురికి కాలువలు పొంగిపొర్లుతుంటాయి. దీంతో మురికి నీరు ఇండ్లలోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురిసిన చిన్నపాటి వర్షానికే ఇండ్లలోకి నీరు చేరడంతో ప్రజలు జీహెచ్ఎంసీపై మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. జీహెచ్ఎంసీ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ కు హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. వరద నీటి రిటైనింగ్ వాల్ నిర్మాణంలో అధికారులు, కాంట్రాక్టర్లు జాప్యం, నిర్లక్ష్యంగా వ్యవహరించారని యాకుత్ పురా స్థానికులు హెచ్ఆర్సీలో ఫిర్యాదు…
యుక్తవయసులో బైక్అంటే అందరికీ ఇష్టమే.. బైక్పై స్నేహితులకు ఎక్కించుకొని షికారు కొట్టాలనే సహజం. అయితే 18 సంవత్సరాలు నిండిన తరువాతే బైక్ డ్రైవింగ్, కారు డ్రైవింగ్కు అర్హులు. అయితే.. ఈ విషయాన్ని పక్కన పెట్టి కొందరు యువకులు డ్రైవింగ్ చేస్తూ ప్రాణాల పొగొట్టుకుంటున్నారు. అలాంటి ఘటనే ఇది.. మహమ్మద్ అనే పదో తరగతి విద్యార్థి తన స్నేహితులతో కలిసి బైక్పై వెళుతున్నాడు. ఆ బైక్ను కూడా ఇంట్లో వాళ్లకు తెలియకుండా బయటకు తీసుకువచ్చాడు. అయితే.. మహమ్మద్ నడుపుండగా..…
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2022-2023 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో కొత్తగా మరో 20 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. అంతేకాకుండా మరో 37 చోట్ల ఇంటర్ విద్యను ప్రవేశపెట్టనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ సూత్రప్రాయంగా ఆమోదం తెలపడంతో పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 475 కేజీబీవీలు ఉండగా.. కొత్తగా ఏర్పడిన మండలాల్లో మరో 26 మంజూరు చేయాలని రాష్ట్ర…
కేంద్ర ప్రభుత్వంపై మరోసారి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్రావు విమర్శలు గుప్పించారు. మంత్రి హరీష్రావు బుధవారం మాట్లాడుతూ.. బీజేపీ ఎందుకోసం యాత్రలు చేస్తోందని ప్రశ్నించారు. సిగ్గు లేకుండా బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గ్యాస్ సిలిండర్ ధరలు పెంచారు, పెట్రోల్ ధరలు పెంచారు, నిత్యావసర సరుకుల ధరలు పెంచారు. ఏమి సాధించారని పాదయాత్ర చేస్తున్నారని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. ఏం చెప్పాలని పాదయాత్ర చేస్తున్నారని మంత్రి హరీష్రావు ప్రశ్నించారు. మోడీ నిర్ణయాలు పేదల…
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. అయితే ఇటీవల ఆకాల వర్షం కారణంగా కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకువచ్చిన వరి ధాన్యం తడిసి ముద్దైంది. దీంతో ఆరుగాలం శ్రమించిన రైతన్నకు నిరాశే మిగిలింది. అయితే.. తాజాగా మరోసారి తెలంగాణకు వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ధాన్యం సేకరణపై అధికారులతో మంత్రి హరీష్ రావు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బందులు రావొద్దని అధికారులకు సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో…