HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
- మరో 4 చెరువుల అభివృద్ధి పనులకు శ్రీకారం
- వాకింగ్ ట్రాక్లు, బోటింగ్తో కొత్త రూపు
- పూడికతీతపై రంగనాథ్ కఠిన ఆదేశాలు
- రెండో విడతలో 14 చెరువుల ఆధునీకరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HYDRAA : నగరంలో వరదల కట్టడి, భూగర్భ జలాల పెంపే లక్ష్యంగా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA) చెరువుల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రూ. 107 కోట్ల భారీ వ్యయంతో మరో నాలుగు ప్రముఖ చెరువుల అభివృద్ధి పనులను హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్ అధికారికంగా ప్రారంభించారు. ఇబ్రహీంపట్నంలోని పెద్ద చెరువు, కాముని చెరువుల వద్ద ఆయన స్వయంగా భూమి పూజ చేసి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
నాలుగు చెరువులకు సరికొత్త రూపు.. పర్యాటక కేంద్రాలుగా మార్పు
హైడ్రా చేపట్టిన ఈ పునరుద్ధరణ జాబితాలో ఇబ్రహీం పెద్ద చెరువు, భగీరథమ్మ చెరువు, కాముని చెరువు, కాప్రా చెరువులు ఉన్నాయి. మొత్తం 311 ఎకరాల భారీ విస్తీర్ణంలో ఉన్న ఈ నాలుగు చెరువులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేలా పక్కా ప్రణాళికను సిద్ధం చేశారు. వీటిని కేవలం జలాశయాలుగానే కాకుండా, స్థానికులకు ఆహ్లాదాన్ని పంచే అద్భుతమైన పర్యాటక కేంద్రాలుగా మార్చనున్నారు. ఇందులో భాగంగా చెరువుల చుట్టూ వాకింగ్ ట్రాక్లు (పాత్వేలు), ఓపెన్ జిమ్లు, పిల్లల కోసం ప్రత్యేక ప్లే ఏరియాలను ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు పెద్ద చెరువుల్లో పర్యాటక శాఖ (Tourism Department) సహకారంతో త్వరలోనే బోటింగ్ వ్యవస్థను కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
పూడికతీతపై కమిషనర్ కఠిన ఆదేశాలు.. రెండు విడతల్లో పనులు
చెరువుల పునరుద్ధరణలో భాగంగా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు పూడికను పూర్తిగా తొలగించాలని, నీరు వచ్చే ఇన్లెట్లు, వెళ్లే ఔట్లెట్లను శాస్త్రీయంగా అభివృద్ధి చేయాలని కాంట్రాక్టర్లకు కమిషనర్ రంగనాథ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నగరంలో చెరువుల సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న హైడ్రా.. ఇప్పటికే మొదటి విడతలో 6 చెరువుల అభివృద్ధిని విజయవంతంగా చేపట్టగా, ఇప్పుడు రెండో విడతలో భాగంగా మొత్తం 14 చెరువులను ఆధునీకరించేందుకు విస్తృతమైన చర్యలు తీసుకుంటోంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!