Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Union Minister Amit Shah Telangana Tour Live Updates

Live Updates: అమిత్‌ షా పర్యటన మినిట్ టు మినిట్

Published Date :May 14, 2022 , 3:05 pm
By Gogikar Sai Krishna
Live Updates: అమిత్‌ షా పర్యటన మినిట్ టు మినిట్
  • Follow Us :
  • google news
  • dailyhunt

The liveblog has ended.
  • 14 May 2022 08:19 PM (IST)

    ఇది ఎవరినో ముఖ్యమంత్రిని చేసే యాత్ర కాదు : అమిత్‌ షా

    బండి సంజయ్‌ ప్రారంభించిన ఈ యాత్ర ఎవరినో ముఖ్యమంత్రిని చేయడానికో, బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికో కాదు.. తెలంగాణలో ఉన్న.. దళితులు, రైతులు, బడుగు బలహీన వర్గాలు, యువతను అభివృద్ధి పథంలో నడపడానికి. ఈ యాత్ర హైదరాబాద్‌ నిజాంను దింపే యాత్ర. కేసీఆర్‌ కుటుంబ పాలన నుంచి విముక్తి చేయడానికి ఈ యాత్ర.

  • 14 May 2022 08:02 PM (IST)

    పంచభూతాలను మింగే పార్టీ టీఆర్‌ఎస్‌ : బండి సంజయ్

    తెలంగాణలో అవినీతిపాలన ప్రజా సంగ్రామ యాత్రలో బయటపడింది. ఎక్కడకు పోయినా.. టీఆర్‌ఎస్‌ పార్టీ వల్ల నష్టపోయిన ప్రజలు బయటకు వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ రావాలే.. మోడీ రావాలే.. పువ్వు గుర్తుకే ఓటు వేస్తం అంటూ.. ఎన్నో వినతుల ఇచ్చారు. ఈ ప్రజా సంగ్రామ యాత్రను ముందుండి నడిపించిన ప్రతి కార్యకర్తకు ధన్యావాదాలు..

  • 14 May 2022 07:50 PM (IST)

    రానున్న రోజుల్లో బరాబర్‌ జెండా పాతుడే : కిషన్‌రెడ్డి

    తెలంగాణలో రానున్న రోజుల్లో బీజేపీ జెండా పాతుడే.. అసెంబ్లీపై విజయపతాకం అమిత్‌ షా ఎగురవేస్తరు. తెలంగాణాను కేసీఆర్‌ కుటుంబానికి రాసిచ్చినమా.. ఇదేం నిజాం పరిపాలననా.. ఇక్కడికి ఎవరూ రాకూడదా.. ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. 1200 మంది ఆత్మబలిదానాలతో వచ్చిన తెలంగాణకు రావాలంటే కేసీఆర్‌ కుటుంబ పరిష్మన్‌ తీసుకోవాలా.. తెలంగాణపై కల్వకుంట్ల కుటుంబానికి ఎంత హక్కు ఉందో.. ప్రతి తెలంగాణ బిడ్డకు అంతే హక్కు ఉంది.

  • 14 May 2022 07:40 PM (IST)

    తండ్రి కొడుకులు ఫ్రస్టేషన్‌లో ఉన్నరు : డీకే అరుణ

    ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి టీఆర్‌ఎస్‌ భయం నెలకొంది. వారు చేయించుకున్న సర్వేల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఓడిపోతుందని, బీజేపీ అధికారం రానుందని ఫలితాలు రావడంతో తండ్రి, కొడుకులు ఫ్రస్టేషన్‌లో ఉన్నరు. కేసీఆర్‌ అయితే ఫ్రస్టేషన్‌లో ఫాంహౌస్‌ నుంచి బయటకు వస్తలేరు.

  • 14 May 2022 07:25 PM (IST)

    కళ్లుండి చూడలేని నాయకులు టీఆర్‌ఎస్‌ వాళ్లు : లక్ష్మణ్‌

     

    టీఆర్‌ఎస్‌ నాయకులు సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతున్నారు. బీజేపీ రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాలు ఉత్తర ప్రదేశ్‌ నుంచి గోవా వరకు ఎన్నో ఉన్నాయి. చిన్న రాష్ట్రం గోవాలో రూ.2,500 పింఛన్‌ ఇస్తున్న ఘనత బీజేపీ. ఇది కళ్లుండి చూడలేని నాయకులు టీఆర్‌ఎస్‌ వాళ్లు.

  • 14 May 2022 06:43 PM (IST)

    ప్రజలు అసహ్యించుకుంటున్న నాయకుడు కేసీఆర్‌ : ఈటల

    తెలంగాణ బీజేపీ చీఫ్‌ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముందు ముందు అన్ని జిల్లాలో కొనసాగుతుంది. తెలంగాణ గడ్డమీద కేసీఆర్‌ అంటే గౌరవం ఉండేది. కానీ.. ఇవాళ తెలంగాణ గడ్డమీద ప్రజల చేత అసహ్యించుకోబడ్డ నాయకుడు కేసీఆర్.

  • 14 May 2022 05:35 PM (IST)

    వాళ్లకు అంత స్టేటస్‌ లేదు : డీకే అరుణ

    శంషాబాద్‌లోని నొవాటెల్‌ హోటల్‌లో తెలంగాణ బీజేపీ కోర్‌ కమిటీతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా భేటీ ముగిసింది. సమావేశం అనంతరం.. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ వాళ్లు వేసిన ప్రశ్నలకు మేము సమాధానం ఇస్తామని, అమిత్‌ షా లాంటి పెద్దవాళ్లు సమాధానం చెప్పేంత స్టేటస్‌ టీఆర్ఎస్‌ వాళ్లకు లేదన్నారు.

  • 14 May 2022 05:30 PM (IST)

    కాసేపట్లో తుక్కుగూడ సభకు అమిత్‌ షా

    శంషాబాద్‌లోని నొవాటెల్‌ హోటల్‌లో తెలంగాణ బీజేపీ కోర్‌ కమిటీతో అమిత్‌ షా భేటీ ముగిసింది. అయితే.. కాసేపట్లో తుక్కుగూడ సభకు అమిత్‌ షా వెళ్లనున్నారు.

  • 14 May 2022 05:28 PM (IST)

    బీజేపీ కోర్‌ కమిటీ సభ్యులతో అమిత్‌ షా సమావేశం

    శంషాబాద్‌లోని నొవాటెల్‌ హోటల్‌కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేరుకున్నారు. అక్కడ బీజేపీ కోర్‌ కమిటీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ బీజేపీ సంస్థాగతంగా ఏవిధంగా బలోపేతం చేయాలనే అంశం సంబంధించి నేతలకు అమిత్‌ షా దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తోంది.

  • 14 May 2022 05:09 PM (IST)

    నోవాటెల్ హోటల్ కు చేరుకున్న అమిత్ షా

    శంషాబాద్ నోవాటెల్ హోటల్ కు కేంద్ర హొంమంత్రి అమిత్ షా చేరుకున్నారు.  మరికాసేపట్లో బీజేపీ తెలంగాణ కోర్ కమిటీ నేతలతో అమిత్ షా భేటీ కానున్నారు.

  • 14 May 2022 04:50 PM (IST)

    నేషనల్‌ సైబర్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ను ప్రారంభించిన అమిత్‌ షా

    హైదరాబాద్‌ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సీఎఫ్‌ఎస్‌ఎల్‌ క్యాంపస్‌ను సందర్శించారు. అక్కడ నేషనల్‌ సైబర్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ను ప్రారంభించారు. ఆ తరువాత సీఎఫ్‌ఎస్‌ఎల్‌ క్యాంపస్‌ కలియతిరుగూ.. అన్ని విభాగాలు పరిశీలించి.. శాస్త్రవేత్తలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

  • 14 May 2022 03:19 PM (IST)

    బీజేపీ కోర్‌ కమిటీ నేతలతో అమిత్‌ షా భేటీ

    కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరకున్నారు. సీఎఫ్‌ఎస్‌ఎల్‌ క్యాంపస్‌లో నేషనల్‌ సైబర్‌ ఫోరెన్సిక్‌ ల్యాబొరేటరీని అమిత్‌ షా ప్రారంభించనున్నారు. ఆ తర్వాత తెలంగాణ బీజేపీ కోర్‌ కమిటీ నేతలతో అమిత్‌ షా భేటీ కానున్నారు. ఆ సమావేశం ముగిశాఖ తుక్కుగూడ సభలో అమిత్‌ షా పాల్గొననున్నారు.

  • 14 May 2022 03:07 PM (IST)

    హైదరాబాద్‌కు చేరుకున్న అమిత్‌ షా

    తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర రెండో దశ ముగింపు సభలో పాల్గొనేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా హైదరాబాద్‌కు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఆయన బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.

  • 14 May 2022 01:54 PM (IST)

    హైదరాబాద్‌ కు అమిత్ షా.. తుక్కుగూడ సభతో బీజేపీ సమరశంఖం

    మధ్యాహ్నం 2.45కు బేగంపేటకు అమిత్ షా

    మధ్యాహ్నం రెండున్నర గంటలకు బేగంపేట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా. అమిత్ షా కు స్వాగతం పలకనున్నారు 20 మంది బీజేపీ నేతలు. 15 నిముషాల పాటు విమానం ఆలస్యం.

    హైదరాబాద్‌లోని CFSL క్యాంపస్‌లో ‘నేషనల్ సైబర్ ఫోరెన్సిక్ లాబొరేటరీ’ ని ప్రారంభించేందుకు నేడు తెలంగాణకు రావడం ఉత్సాహంగా ఉంది. తుక్కుగూడ బహిరంగ సభలోనూ ప్రసంగించనున్నాను.

    — Amit Shah (@AmitShah) May 14, 2022

    ఎమ్మెల్సీ కవిత ట్వీట్ల తూటాలు

    తెలంగాణ పర్యటనకు వస్తున్న కేంద్ర మంత్రి అమిత్ షాపై ట్విట్టర్ వేదిక‌గా ఎమ్మెల్సీ కవిత ప్రశ్నల వర్షం కురిపించారు. రూ. 3000 కోట్లకు పైగా ఉన్న ఫైనాన్స్ కమీషన్ గ్రాంట్ల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు? అంటూ ప్ర‌శ్నించారు. బ్యాక్‌వర్డ్ రీజియన్ గ్రాంట్ రూ. 1350 కోట్లు, GST పరిహారం రూ. 2247 కోట్ల సంగతేంటి? అని ఆమె ప్ర‌శ్నించారు. బీజేపీ హయాంలో విపరీతంగా పెరిగిన ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, మతపరమైన అల్లర్లపై మీ సమాధానం ఏమిటి? అని ట్విట‌ర్ వేదిక‌గా అమిత్ షా పై ఎమ్మెల్సీ కవిత ప్ర‌శ్నల‌తో ముంచెత్తారు.

    భారత్‌ను అత్యంత ఖరీదైన ఇంధనం మరియు LPGని విక్రయించడంలో అగ్రగామి దేశంగా మార్చడంపై మీ సమాధానం ఏమిటి? అన్నారు. అమిత్ షా జీ, ఈ రోజు మీరు తెలంగాణ ప్రజలను కలిసినప్పుడు గత 8 సంవత్సరాలలో తెలంగాణకు ఒక్క IIT, IIM, IISER, IIIT, NID, మెడికల్ కాలేజీ లేదా నవోదయ పాఠశాలలు ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు విఫలమైందో తెలంగాణ బిడ్డలకు వివరించండి అంటూ కవిత ఎద్దేవా చేశారు.

    తెలంగాణలో ఎన్నికల ఫీవర్

    తెలంగాణలో ఎన్నికల ఫీవర్ మొదలయిందా? వేసవి వేడికి తోడు ఎన్నికల వేడి కూడా తెలంగాణ నేతల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నేతల పాదయాత్రలు, జాతీయ నేతలతో పర్యటనలతో రాష్ట్ర రాజకీయం రసవత్తరంగా మారుతోందని చెప్పాలి. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించారు. వరంగల్ డిక్లరేషన్ అంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎన్నికల శంఖారావం దాదాపుగా పూరించారని చెప్పాలి. తాజాగా కేంద్రహోంమంత్రి అమిత్ షా కూడా ఇవాళ హైదరాబాద్‌కు వస్తున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు అమిత్ షా. ఇవాళ సాయంత్రం తుక్కుగూడలో జరిగే బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగిస్తారు. ఈ సభ ద్వారా ఎన్నికల శంఖారావం పూరిస్తారని... టీఆర్ఎస్‌పై యుద్ధం ప్రకటించే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

    తుక్కుగూడ సభకు బీజేపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. అప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. తెలంగాణ నలుమూలల నుంచి కార్యకర్తలు హైదరాబాద్‌కు వస్తున్నారు. ఇటీవలే వరంగల్‌లో రాహుల్ గాంధీ భారీ బహిరంగ సభ నిర్వహించారు. అంతకు మించి జనసమీకరణ చేయాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు తగ్గట్లే ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు, ఎమ్మెల్యేలు సభ ఏర్పాట్లను పరిశీలించారు. హైదరాబాద్‌లో అమిత్ షా పర్యటనకు సంబంధించి కేంద్ర హోంశాఖ షెడ్యూల్ విడుదల చేసింది.

    అమిత్ షా షెడ్యూల్:

    12:10 - న్యూఢిల్లీలోని కృష్ణ మీనన్ మార్గ్ నుంచి కేంద్రహోంమంత్రి అమిత్ షా బయల్దేరతారు

    12:30 - పాలెం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు బయల్దేరతారు

    2:30 - హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు

    2:55 - రామాంతపూర్‌లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి చేరుకుంటారు

    3.00-4:00 - CFSLలోనే సుమారు గంట సమయం పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

    5:00 - రోడ్డుమార్గంలో శంషాబాద్‌లోని నోవాటెల్‌ హోటల్‌కు చేరుకుంటారు. సాయంత్రం 6 గంటల వరకు అక్కడే ఉంటారు.

    6:25 - రింగ్ రోడ్డు మీదుగా తుక్కుగూడకు చేరుకుంటారు

    6:30-8:00 - తుక్కుగూడలో ప్రజా సంగ్రామయాత్ర బహిరంగ సభలో పాల్గొంటారు.

    8:20 - శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ చేరుకొని.. విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు.

    అమిత్ షా పర్యటనపై బీజేపీ నేతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ పర్యటనలోనే ఆపరేషన్ ఆకర్ష్ వేగవంతం చేయనున్నారు. అందులో భాగంగా చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీలో చేరతారని సమాచారం. ఆయనతో పాటు మరికొందరు నేతలు కూడా కాషాయ కండువా కప్పుకుంటారని అంటున్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. గద్వాల్ జిల్లాలోని అలంపూర్‌లోని జోగులాంబ దేవి ఆలయంలో ప్రార్థనలు చేసిన తర్వాత తన పాదయాత్రను ప్రారంభించారు. టీఆర్ఎస్ వైఫల్యాలు, ప్రజల ఇబ్బందులను ఆయన పాదయాత్రలో స్వయంగా తెలుసుకుంటున్నారు. ఈ పాదయాత్ర నేటితో మహేశ్వరంలో ముగుస్తుంది. ఈ సందర్భంగానే బీజేపీ నేతలు బహిరంగ సభను ఏర్పాటు చేసి హోంమంత్రి అమిత్ షాను ఆహ్వానించారు.

     

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amit Shah Telangana Tour
  • bjp
  • breaking news
  • Live Updates
  • Union minister Amit Shah

ట్రెండింగ్‌

  • Virendra Sehwag-MS Dhoni: ఎంఎస్ ధోనీ అదృష్టంతో జన్మించాడు.. సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • IND vs WI Super 8: ఈడెన్‌ గార్డెన్స్‌లో ‘కింగ్’.. అయినా భారత్‌ను వెంటాడుతున్న ఆ సమస్య!

  • Korralu Upma Benefits : కొర్రల ఉప్మా.. షుగర్ ఉన్నవారికి ఒక వరం.. నరాల బలహీనతకు చెక్..

  • Chaganti Koteswara Rao: “ఇంతకంటే అడుక్కు తినడం మంచిది”.. అలాంటి యూట్యూబర్స్‌పై చాగంటి ఫైర్..

  • 100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68/IP69 రేటింగ్ తో Huawei Mate 80 Pro గ్లోబల్ లాంచ్‌..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions