బండి సంజయ్ ప్రారంభించిన ఈ యాత్ర ఎవరినో ముఖ్యమంత్రిని చేయడానికో, బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికో కాదు.. తెలంగాణలో ఉన్న.. దళితులు, రైతులు, బడుగు బలహీన వర్గాలు, యువతను అభివృద్ధి పథంలో నడపడానికి. ఈ యాత్ర హైదరాబాద్ నిజాంను దింపే యాత్ర. కేసీఆర్ కుటుంబ పాలన నుంచి విముక్తి చేయడానికి ఈ యాత్ర.
తెలంగాణలో అవినీతిపాలన ప్రజా సంగ్రామ యాత్రలో బయటపడింది. ఎక్కడకు పోయినా.. టీఆర్ఎస్ పార్టీ వల్ల నష్టపోయిన ప్రజలు బయటకు వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ రావాలే.. మోడీ రావాలే.. పువ్వు గుర్తుకే ఓటు వేస్తం అంటూ.. ఎన్నో వినతుల ఇచ్చారు. ఈ ప్రజా సంగ్రామ యాత్రను ముందుండి నడిపించిన ప్రతి కార్యకర్తకు ధన్యావాదాలు..
తెలంగాణలో రానున్న రోజుల్లో బీజేపీ జెండా పాతుడే.. అసెంబ్లీపై విజయపతాకం అమిత్ షా ఎగురవేస్తరు. తెలంగాణాను కేసీఆర్ కుటుంబానికి రాసిచ్చినమా.. ఇదేం నిజాం పరిపాలననా.. ఇక్కడికి ఎవరూ రాకూడదా.. ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. 1200 మంది ఆత్మబలిదానాలతో వచ్చిన తెలంగాణకు రావాలంటే కేసీఆర్ కుటుంబ పరిష్మన్ తీసుకోవాలా.. తెలంగాణపై కల్వకుంట్ల కుటుంబానికి ఎంత హక్కు ఉందో.. ప్రతి తెలంగాణ బిడ్డకు అంతే హక్కు ఉంది.
ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి టీఆర్ఎస్ భయం నెలకొంది. వారు చేయించుకున్న సర్వేల్లో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని, బీజేపీ అధికారం రానుందని ఫలితాలు రావడంతో తండ్రి, కొడుకులు ఫ్రస్టేషన్లో ఉన్నరు. కేసీఆర్ అయితే ఫ్రస్టేషన్లో ఫాంహౌస్ నుంచి బయటకు వస్తలేరు.
టీఆర్ఎస్ నాయకులు సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతున్నారు. బీజేపీ రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాలు ఉత్తర ప్రదేశ్ నుంచి గోవా వరకు ఎన్నో ఉన్నాయి. చిన్న రాష్ట్రం గోవాలో రూ.2,500 పింఛన్ ఇస్తున్న ఘనత బీజేపీ. ఇది కళ్లుండి చూడలేని నాయకులు టీఆర్ఎస్ వాళ్లు.
తెలంగాణ బీజేపీ చీఫ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముందు ముందు అన్ని జిల్లాలో కొనసాగుతుంది. తెలంగాణ గడ్డమీద కేసీఆర్ అంటే గౌరవం ఉండేది. కానీ.. ఇవాళ తెలంగాణ గడ్డమీద ప్రజల చేత అసహ్యించుకోబడ్డ నాయకుడు కేసీఆర్.
శంషాబాద్లోని నొవాటెల్ హోటల్లో తెలంగాణ బీజేపీ కోర్ కమిటీతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భేటీ ముగిసింది. సమావేశం అనంతరం.. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ వాళ్లు వేసిన ప్రశ్నలకు మేము సమాధానం ఇస్తామని, అమిత్ షా లాంటి పెద్దవాళ్లు సమాధానం చెప్పేంత స్టేటస్ టీఆర్ఎస్ వాళ్లకు లేదన్నారు.
శంషాబాద్లోని నొవాటెల్ హోటల్లో తెలంగాణ బీజేపీ కోర్ కమిటీతో అమిత్ షా భేటీ ముగిసింది. అయితే.. కాసేపట్లో తుక్కుగూడ సభకు అమిత్ షా వెళ్లనున్నారు.
శంషాబాద్లోని నొవాటెల్ హోటల్కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేరుకున్నారు. అక్కడ బీజేపీ కోర్ కమిటీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ బీజేపీ సంస్థాగతంగా ఏవిధంగా బలోపేతం చేయాలనే అంశం సంబంధించి నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తోంది.
శంషాబాద్ నోవాటెల్ హోటల్ కు కేంద్ర హొంమంత్రి అమిత్ షా చేరుకున్నారు. మరికాసేపట్లో బీజేపీ తెలంగాణ కోర్ కమిటీ నేతలతో అమిత్ షా భేటీ కానున్నారు.