స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పోలీసు పతకాలను ప్రదానం చేసిన ఫెడరల్ ప్రోబ్ ఏజెన్సీకి చెందిన 18 మంది అధికారుల్లో ఇంటర్పోల్తో సంబంధం ఉన్న ఇద్దరు సీబీఐ అధికారులు కూడా ఉన్నారు. ఆరుగురు అధికారులకు విశిష్ట సేవలకు గాను రాష్ట్రపతి పోలీసు పతకాలు, 12 మందికి మెరిటోరియస్ సర్వీస్ కోసం పోలీసు పతకాలు లభించాయని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. సుపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) ప్రదీప్ కుమార్ కె,…
ఎన్ఎండిసి స్టీల్ లిమిటెడ్ (ఎన్ఎస్ఎల్) కార్యకలాపాలు ప్రారంభించిన ఏడాదిలో ఒక మిలియన్ టన్ను (ఎంఎన్టి) లిక్విడ్ స్టీల్ ఉత్పత్తితో మైలురాయిని సాధించింది. భారతదేశపు ప్రభుత్వ రంగ ఉక్కు తయారీకి సరికొత్త ప్రవేశంగా, NSL అధిక-నాణ్యత ఉక్కు ఉత్పత్తులను అందించగల సామర్థ్యాన్ని ప్రదర్శించింది , పరిశ్రమలో కొత్త బెంచ్మార్క్లను నెలకొల్పడం ద్వారా బలీయమైన ప్లేయర్గా స్థిరపడిందని కంపెనీ పత్రికా ప్రకటన గురువారం తెలిపింది. ఆగస్ట్ 12, 2023న, NSL ఛత్తీస్గఢ్లోని నగర్నార్లోని అధునాతన 3 MTPA స్టీల్ ప్లాంట్లో…
తెలంగాణ ప్రజలకు స్వాతంత్ర సాయుధ యోధులకు అమరవీరులకు నివాళులు.. ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.. తెలంగాణ వచ్చిన సందర్భంలో స్వాతంత్ర దినోత్సవం రోజున సీతారామ ప్రాజెక్టు ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ప్రారంభం చేయడం సంతోషకరమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి హోదాలో బిజీ కొత్తూరు సీతారామ పంప్ హౌస్ నా చేతుల మీదుగా ప్రారంభించడం నా జన్మ ధన్యమైందన్నారు. ప్రాజెక్టు నిర్దిష్ట లక్ష్యంగా ఉన్న ఆయకట్ట భూములకు ఎంత ఖర్చైనా…
తొందర్లోనే స్టేషన్ ఘనపూర్ లో ఉప ఎన్నిక రాబోతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. స్టేషన్ ఘనపూర్ లో బీఆర్ఎస్ తరుపున రాజయ్య భారీ మెజారిటీతో గెలవబోతున్నారని, కేసీఆర్ కూడా పార్లమెంట్ ఎన్నికల సమయంలో చెప్పారన్నారు. హై కోర్ట్ లో కేసు తీర్పు రిజర్వ్ లో ఉందని, ఈ తీర్పు మనకు అనుకూలంగా వస్తుంది అని ఆశిస్తున్నామన్నారు కేటీఆర్. పార్టీ మారిన ఎమ్మెల్యే లపై వేటు పడడం ఖాయమని, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప…
రేపు జరగబోయే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశామని హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. నగరవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నామని, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు 4 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గ్రే హౌండ్స్, ఆక్టోపస్ టీమ్స్ కూడా బందోబస్తు లో ఉంటారన్నారు. రేపు ఉదయం 10 గంటల నుంచి 11.30 వరకు గోల్కొండ కోటలో ప్రభుత్వం తరఫున అధికారిక వేడుకలు జరుగనున్నాయన్నారు. ఇదిలా…
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలకేంద్రంలో సూక్ష్మ కళాకారుడు గుండుపిన్నుతో చాక్ పీస్ పై 78 జాతీయ జెండాలను తయారుచేసి దేశభక్తిని చాటాడు. గిరిజన గురుకుల బాలుర కళాశాలకు చెందిన చిత్రకళా ఉపాధ్యాయుడు, సూక్ష్మ కళాకారుడు ఆడెపు రజనీకాంత్ 78వ స్వాతంత్యం దినోత్సవాన్ని పురస్కరించుకుని 8 సెంటీమీటర్ల ఎత్తు 1 సెంటి మీటర్ వెడల్పు గల చాక్ పీస్ పై 4 మిల్లీ మీటర్ల ఎత్తు ఉన్న 78 ఔతీయ జెండాలను సుమారు 3 గంటల పాటు…
ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి బృందం విదేశీ పర్యటన విజయవంతమైంది. పెట్టుబడుల లక్ష్య సాధనలో సరికొత్త రికార్డు నమోదైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణకు భారీగా పెట్టుబడులు వెల్లువెత్తాయి. అమెరికా పర్యటనలో రూ.31502 కోట్ల పెట్టుబడులు రాగా.. చివరి రెండు రోజుల దక్షిణ కొరియా పర్యటనలోనూ అదే స్పందన వెల్లువెత్తింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు దక్షిణ కొరియాకు చెందిన ప్రపంచస్థాయి కంపెనీలు ముందుకు వచ్చాయి. రూ.4500 కోట్ల పెట్టుబడులకు అక్కడి కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి.…
తెలంగాణలో జరగనున్న రాజ్యసభ ఉపఎన్నికకు తమ అభ్యర్థిగా సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీని కాంగ్రెస్ బుధవారం నామినేట్ చేసింది. బీఆర్ఎస్ ఎంపీ కె. కేశవరావు రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరడంతో ఆ స్థానం ఖాళీ అయింది. అయితే.. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్ మను సింఘ్వీ అధికారికంగా ప్రకటించింది ఏఐసీసీ. మరో రెండేళ్ల పదవీకాలం మిగిలి ఉన్నందున, సింఘ్వీకి సీటు కోసం తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ తన బలంపై ఆధారపడే అవకాశం ఉంది.…
కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఐటీ మంత్రి శ్రీధర్బాబు, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అమెరికా, దక్షిణ కొరియా పది రోజుల పర్యటన తర్వాత ఈరోజే తిరిగి వచ్చామన్నారు. అమెరికా, కొరియాలో మేం కలిసిన ప్రతి ఒక్క వ్యాపారవేత్త, కార్పోరేట్ లీడర్స్ తెలంగాణ, హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు సానుకూలంగా ఉన్నారని చెప్పడానికి…
తమ డిపోలను ప్రైవేట్పరం చేస్తున్నారని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) యాజమాన్యం స్పష్టం చేసింది. సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించేలా కొందరు చేస్తోన్న ఈ దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ఈవీ పాలసీ ప్రకారమే పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి సంస్థ తీసుకువస్తోందని పేర్కొంది. డిపోల్లో ఎలక్ట్రిక్ బస్సులతో సహా అన్ని బస్సుల ఆపరేషన్స్ నిర్వహణ పూర్తిగా టీజీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలోనే జరుగుతుందని, అందులో ఎలాంటి…