పెండింగ్లో ఉన్న రైతుల రుణాలను త్వరలో మాఫీ చేయాలని బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. లేని యెడల నిర్మల్ జిల్లా కేంద్రంగా ఈ నెల 23న రైతులతో పెద్ద ఎత్తున ధర్నాకు దిగుతామని ఆయన వెల్లడించారు. ఈ రైతు ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి, ప్రభుత్వ మేడలు వంచుతాం ఏలేటి మహేశ్వర్ అన్నారు. రైతు భరోసాకు ఇవ్వాల్సిన నిధులనే రుణమాఫీకి డైవర్ట్ చేశారు, ఇప్పటికే రెండు పంటలకు రైతు భరోసా సాయం ఇవ్వకుండా…
హైదరాబాద్ నారాయణగూడ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో సుల్తాన్ బజార్ ఏసీపీ శంకర్ మాట్లాడుతూ… బషీర్ బాగ్ చంద్ర నగర్ కు చెందిన మర్రి సాయి లక్ష్మణ్ గత 8 ఏళ్లుగా బషీర్ బాగ్ లోని శ్రీ సిద్ది వినాయక్ జెవెల్లెర్స్ అండ్ ఎక్స్ పోర్ట్స్ ప్రేవేట్ లిమిటెడ్ లో స్టాక్ ఇంచార్జ్ గా పని చేస్తున్నాడు. గత రెండు నెలల క్రితం సాయి లక్ష్మణ్ డ్యూటీ కు రాకుండా , ఫోన్ చేసిన…
రాజన్న సిరిసిల్ల పట్టణంలోని శ్రీ మార్కండేయ దేవాలయంలో శ్రీ చండీ యాగంలో కేంద్ర సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్ని లక్షల మంది రైతులు తీసుకున్న రుణమాఫీ 40 వేల కోట్ల రూపాయలు మాఫీ చేస్తాం అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం 26 వేల కోట్ల బడ్జెట్ కేటాయించి 16 వేల కోట్ల రుణమాఫీ చేసిందన్నారు. రేవంత్ రెడ్డి రైతుల పట్ల ఎంత చిత్తశుద్ధి…
రాజన్న సిరిసిల్ల పట్టణం శాంతి నగర్ బైపాస్ రోడ్డులో సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహనికి పూల మాల వేసి నివాళులు అర్పించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాజ్యాధికారం కొరకు పాటుపడిన మహానుభావుడు పాపన్న గౌడ్ అని ఆయన కొనియాడారు. భారత దేశానికి స్వాతంత్రం, తెలంగాణలో ఉన్న నిరంకుశ పాలనకు చరమగీతం పాడింది పాపన్ననే అని ఆయన వ్యాఖ్యానించారు. సర్వాయి పాపన్న ఆశయాలను కొనసాగించాలన్న సంకల్పంతో…
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేడు పర్యటించారు. ఈ సందర్భంగా పరకాల నియోజకవర్గ రివ్యూ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధానగా ముఖ్యమైన అంశాలు విశ్లేషించుకున్నామని, పరకాలకు సంబంధించిన విషయంపై హైదరాబాదులో మాట్లాడనున్నామన్నారు. టెక్స్ టైల్ పార్క్ ఈ ప్రాంత ప్రజలు ఎంతో ఉపయోగ పడుతుందని, టెక్స్ టైల్ పార్క్ విషయంలో గత ప్రభుత్వాలు మాటలకే పరిమితం చేసిందన్నారు మంత్రి పొంగులేటి. గతంలో వరంగల్…
కామారెడ్డి క్లాసిక్ ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ సన్మాన సభ. ఈ సభలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కార్ పాల్గొన్నారు. ఎంపీగా మొదటిసారి కామారెడ్డికి వచ్చిన సురేష్ షెట్కార్ను షబ్బీర్ అలీ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ఆడవాళ్ళకు బ్రేక్ డాన్స్ చేయిస్తా అన్న వారికి బుద్ధి చెబుతామన్నారు. మా అక్క చెల్లెళ్ళ గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోమని ఆయన వ్యాఖ్యానించారు. 200 యూనిట్స్ కరెంటు కొన్ని…
ఉప్పల్ శిల్పారామంలో రాఖీ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే.. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ.. మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మాట్లాడుతూ.. నన్ను రక్షించు అని చెబుతూ సోదరుడికి రాఖీ కడుతుంది సోదరి అని, దేశాన్ని రక్షించడానికి సోదరులంతా రక్షగా ఉండాలన్నారు. పది రోజుల యుద్ధంలో రావణుడిని రాముడు చంపేశాడని, లంకలోకి లక్ష్మణుడు వెళ్లినప్పుడు మన భూమి…
తెలంగాణ మహిళలను నోటికొచ్చినట్లు దుర్భాషలాడి యథాలాపంగా చేసిన వ్యాఖ్యలంటూ విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసి, ప్రెస్ మీట్ లో విచారం వ్యక్తం చేసినంత మాత్రాన తెలంగాణ మహిళా సమాజం ఆ వ్యాఖ్యలను మరిచిపోదని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ మంత్రి కొండా సురేఖ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న మహిళలకు ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకాన్ని ఉద్దేశించి నిన్న పార్టీ మీటింగ్ లో తెలంగాణ మహిళలను బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు చేసుకొమ్మని…
శాఖ సమీక్షలు, జిల్లా పర్యటనలు, అధికార కార్యక్రమాలు, సమావేశాలు, సభలు, అభివృద్ధి పనుల పరిశీలన, ప్రజా సేవ, సందర్శకుల సమస్యల పరిష్కారం, పార్టీ ప్రోగ్రాముల్లో నిత్యం బిజీగా ఉండే మంత్రి సీతక్క నిత్య విద్యార్థిగా నిలుస్తున్నారు. సారం లేని భూమి చదువు లేని జీవితం ఒక్కటే అని బలంగా నమ్మే సీతక్క..అధ్యయనం పోరాటం అనే సూత్రాన్ని అనుసరిస్తున్నారు. అధికార బాధ్యతలు నిర్వర్తిస్తూనే చదువుకు ప్రాధాన్యతనిస్తున్నారు. ప్రజా సేవలోనే ఉంటూ ఎల్ఎల్బి, రాజనీతి శాస్త్రంలో పీహెచ్డీ పూర్తి చేసిన…
అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. హన్మకొండ జిల్లాకు చెందిన రాజేష్.. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడ మృతి చెందాడు. దీంతో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రాజేష్ బంధువులు అతడి మృతదేహం కోసం ఎదురు చూస్తున్నారు. వివరాల ప్రకారం.. హన్మకొండ జిల్లా ఆత్మకూరుకు చెందిన ఏరుకొండ రాజేష్ ఉన్నత చదువుల కోసం తొమ్మిదేళ్ల క్రితం అమెరికాకు వెళ్లాడు. 2015లో ఎమ్మెస్ ట్రైనింగ్ చేసేందుకు వెళ్లిన రాజేష్.. మూడు రోజుల…