తెలంగాణ బీజేపీ ఇంచార్జి తరుణ్ చుగ్ సమక్షంలో నాగర్ కర్నూల్ ఎంపీ పి. రాములు నేడు ఢిలీలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్బంగా తరుణ్ చుగ్ మాట్లాడుతూ.. ప్రతిరోజు దేశంలో ఏదో ఒక ప్రాంతం నుంచి సమాజం కోసం పనిచేసేవారు బీజేపీలో చేరుతున్నారన్నారు. ప్రధాని నేతృత్వంలో 10 ఏళ్లలో పేదలకు వ్యతిరేకంగా మోడీ యుద్ధం చేస్తున్నారన్నారు. పేదలకు ఇళ్ళు,గ్యాస్,నీళ్లు,మరుగుదొడ్లు నిర్మిస్తున్నారని, దేశ ఖ్యాతి ,వికసిత భారత్ లక్ష్యాన్ని,పేదరిక నిర్ములన కోసం మోడీ చేస్తున్న పని చూసి…
బీఆర్స్ తప్పులు ఒప్పుకోని కాళేశ్వరం విజిట్ మానుకోవాలన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ఎందుకు వెళ్తున్నారో చెప్పాలన్నారు. శ్వేతపత్రంలో కాళేశ్వరంలో జరిగిన తప్పులను వాస్తవాలను ప్రజల ముందు ఉంచామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా బిఅరెస్ నేతలు తప్పులు ఒప్పుకోని ప్రభుత్వానికి సహకరించాలన్నారు. కాళేశ్వరం తప్పులకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, కేసీఆర్, కేటీఆర్ చెప్పినట్లు చెయ్యరు, నిపుణుల కమిటీ నివేదికే ఫైనల్ అని ఆయన వ్యాఖ్యానించారు. కాళేశ్వరం విషయంలో…
ఒకనాడు తెలంగాణ నిరుద్యోగ యువత కన్న కలలు నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో సాకారం అవుతున్నాయని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగు లేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పోలీస్, స్టాఫ్ నర్స్, గురుకులం, సింగరేణి… మూడు నెలల లోపే 23 వేల ఉద్యోగాలను భర్తీ చేసాం, 63 అదనపు పోస్టులతో గ్రూప్ వన్ , 11062 పోస్టులతో మెగా డిఎస్పి నోటిఫికేషన్ జారీ చేసి ఉద్యోగాల భర్తీ…
మేము మేడిగడ్డ వెళ్తుంటే వాళ్ళు పాలమూరు పోతాము అంటున్నారని, సిల్లీ రాజకీయాలు చేస్తున్నారంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేడిగడ్డ రిపైర్లు చేయమంటే చేయట్లేదని, మార్చి 31 లోపు రిపేర్ చేసి నీళ్లు ఇవ్వకుంటే చాలా ఇబ్బందులు వస్తాయని ఆయన పేర్కొన్నారు. మీరు చేయలేక పోతే మాకు ఇవ్వండి మేము చేసి చూపిస్తామని కేటీఆర్ అన్నారు. మీకు చేత…
బస్తీవాసుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన నాంపల్లి నియోజకవర్గంలో పర్యటించారు. లకిడీకపూల్, ఆసిఫ్ నగర్, కుమ్మరివాడి, మెహదీపట్నం జిభాబాగ్ లో పవర్ బోర్ లను ప్రారంభించారు. హోటల్ నీలోఫర్ టీ తాగిన కేంద్రమంత్రి ,.. కుండల తయారీనీ పరిశీలించిన కిషన్ రెడ్డి.. లకిడీకపూల్, ఆసిఫ్ నగర్ నీలోఫర్ హోటల్ ముందు పవర్ బోర్ ను ప్రారంభించారు. అనంతరం స్థానిక నరసింహ స్వామి టెంపుల్ లో…
కన్నీళ్ళ గాథలు వినిపిస్తున్న పాలమూరు ప్రజల తరుపున మాట్లాడుతున్నానని, నీళ్ళు, నిధులు, నియామకాల పేరిట ఇంట్లో వాళ్ళందరూ ఉద్యోగాలు పొందిం కేసీఆర్ కుటుంబమని సీడబ్ల్యూసీ మెంబర్ వంశీ చంద్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నీళ్లను ఆంధ్రోళ్లు దోచుకువెళ్తుంటే… చేతకాక చూస్తూ ఉండిపోయారని ఆయన మండిపడ్డారు. కమిషన్ లు తీసుకొని కాళేశ్వరం కట్టి, కాంట్రాక్టులు ఆంధ్రోళ్లు కట్టబెట్టారని, నియామకాలు పాలమూరు జిల్లా ప్రజలకు రాలేదు కానీ కేసిఆర్ కుటుంబ సభ్యులకు వచ్చాయన్నారు వంశీ చంద్…
చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ మంగళవారం జన జాతర బహిరంగసభ నిర్వహించారు. ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తో పాటు మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ప్రణాళిక బద్దంగా పని చేస్తోంది ప్రభుత్వమన్నారు. కాంగ్రెస్ అధికారం వస్తుందా అని brs.. బీజేపీ కార్యకర్తలు చులకన చేశారని, ఆ కార్యకర్తలకు కూడా మనమే ఉచిత విద్యుత్.. సిలిండర్ ఇవ్వబోతున్నామన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ని గెలిపించండన్నారు.…
కాంగ్రెస్ కార్యకర్తలు తమ రక్తాన్ని చెమటగా మార్చి రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ జన జాతర బహిరంగసభ నిర్వహించారు. ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్ ఛార్జ్ దీపాదాస్ మున్షీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… కేసులు లేని వాళ్ళు.. వేధింపులు గురికాని కాంగ్రెస్ కార్యకర్తలు లేరన్నారు. ఇందిరమ్మ రాజ్యం ..…
రాష్ట్రములో ఆయిల్ పామ్ సాగు విస్తరణ కోసం, రాష్ట్రప్రభుత్వం జిల్లాల వారీగా, సాగుకు అనుకూల విస్తీర్ణాన్ని అంచనవేసి, 14 కంపెనీలతో ఒప్పందాలు అమలు చేసుకొని ముందుకు సాగుతున్నది. ముందుగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ చూసుకొన్నట్లయితే కొన్ని కంపెనీలు ఇంకా వాటి లక్ష్యములో 20 కూడా సాధించక పోవడం పట్ల, మంత్రి వర్యులు తీవ్రంగా పరిగణించడం జరిగింది. రానున్న కాలములో ఇదేవిధముగా వారి ప్రగతి ఆశించస్థాయిలోనే లేకపోతే వారితో చేసుకున్న ఒప్పందాలను పునః సమీక్షించి, కఠిన నిర్ణయాలు తీసుకోవలసిందిగా…
కేసీఆర్ ఇచ్చిన హామీలు, అమలుచేయడంలో విఫలం అయ్యారని, కేసీఆర్ అబద్దాలకంటే ఎక్కువ అబద్దాలు చెప్పే సీఎం రేవంత్ అని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. ఇవాళ రాజరాజేశ్వరి క్లస్టర్ లో జరుగుతున్న విజయ సంకల్ప యాత్రలో రామాయంపేటలో ఈటల రాజేందర్, బోడిగ శోభ, రాణి రుద్రమ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. రేవంత్ హామీ మేరకు ఒకే ఏడాది ఒకే దఫా రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తే రాజకీయాలనుండి తప్పుకుంటా అని…