ప్రధాని మోడీ ఈ సాయంత్రం కీలక భద్రతా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి సీనియర్ మంత్రులంతా హాజరుకానున్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న తాజా పరిణామాలపై చర్చించనున్నారు.
జమ్మూకాశ్మీర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. గందర్బల్లో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా దళాలు అప్రమత్తం అయ్యాయి. దీంతో గందర్బల్ జిల్లాలోని అర్హమా అటవీ ప్రాంతంలో పోలీసులు, సైన్యం, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు.
బెంగళూరులో ఘోర విషాదం చోటుచేసుకుంది. తెలంగాణకు చెందిన సాఫ్ట్వేర్ జంట ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో సిద్దిపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సౌదీ అరేబియా యువరాజు, ప్రధానమంత్రి అయిన హెచ్ఆర్హెచ్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్కు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణపై ఇరువురి మధ్య సంభాషణ జరిగింది.
Mallojula Venu Gopal: మావోయిస్టు మాజీ అగ్రనేత మల్లోజుల వేణు గోపాల్ మరో వీడియో విడుదల చేశారు. "మావోయిస్టులు లోంగిపోవాలని కోరుతున్నా.. పరిస్థితులు మారుతున్నాయి.. దేశం కూడా మారుతోంది.. ఎన్ కౌంటర్లో మావోలు ప్రాణాలు కోల్పోతున్నారు.. హిడ్మాతో పాటు మావోలు ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారు.. మావోలు ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించింది. అందుకే మావోలు లోంగిపోవాలని కోరుతున్నా.. లోంగిపోవాలనుకునేవాళ్లు నాకు ఫోన్ చేయండి.. నా నంబర్ 8856038533.." అని వీడియోలో పేర్కొన్నారు. ఈ వీడియోను గడ్చిరోలి పోలీసులు…
Rahul Gandhi: దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహించిన న్యాయ సదస్సులో లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్సభ ఎన్నికల్లో చీటింగ్ జరిగిందని ఆరోపించారు.