ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’లో నటిస్తున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మూవీ చేయాల్సి ఉంది. కానీ దానికి మరికాస్తంత సమయం పట్టేలా ఉంది. ఎందుకంటే చిరంజీవి ‘ఆచార్య’ తర్వాత కొరటాల శివ యంగ్ టైగర్ ఎన్టీయార్ తో మూవీ చేస్తానని మాటిచ్చారు. సో… ఆ తర్వాతే బన్నీ – కొరటాల శివ మూవీ ఉంటుంది. సో… ఈ లోగా వేరే దర్శకులతో సినిమా చేయడానికి అల్లు అర్జున్…
అజయ్ దేవగణ్ దర్శకత్వం వహిస్తూ నటిస్తోన్న చిత్రం ‘మేడే’. థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ సినిమా చాలా భాగం హైద్రాబాద్ లోనే షూటింగ్ జరుపుకుంది. ఫిల్మ్ సిటీలో బిగ్ బి, రకుల్ ప్రీత్ సింగ్ సహా ఇతర నటీనటులు పాల్గొన్న షెడ్యూల్ ఇప్పటికే పూర్తైంది. అయితే, లాక్ డౌన్ కారణంగా అజయ్ దేవగణ్ ఇతర సినిమాల మాదిరిగానే ‘మేడే’ కూడా సందిగ్ధంలో పడింది. అజయ్ నటించిన ‘భుజ్’, ‘మైదాన్’ సినిమాలు కూడా జనం ముందుకు రావాల్సి ఉంది.…
నటన అంటే కళ. కానీ, కేవలం కళ మాత్రమే కాదు. యాక్టింగ్ అనే ఆర్ట్ కి… కొన్ని కండీషన్స్ అప్లై అవుతాయి అంటున్నారు బాలీవుడ్ స్టార్స్. సల్మాన్ మొదలు సన్నీ లియోన్ వరకూ ఒక్కొక్కరిది ఒక్కో రూల్. దాన్ని ముందుగానే తమ అగ్రిమెంట్ పేపర్స్ లో తెలియజేస్తారట. దర్శకనిర్మాతలు ఒప్పుకుంటేనే… సదరు స్టార్స్ తో సినిమా చేయగలిగేది! ఇంతకీ, ఎవరి నిబంధన ఏంటో ఓసారి చూసేద్దామా… గ్రీక్ గాడ్ ఆఫ్ బాలీవుడ్… హృతిక్ రోషన్… డేట్స్ విషయంలో…
కోవిడ్-19 సెకండ్ వేవ్ ఇంకా తగ్గుముఖం పట్టలేదు. గడిచిన కొన్ని రోజుల్లో చాలా మంది చనిపోయారు. మరోవైపు ఆసుపత్రులలో కరోనాతో బాధపడుతున్న వారి సంఖ్య కూడా భారీగానే ఉంది. ప్రభుత్వాలు లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ అంటూ కరోనా వ్యాప్తిని అరికట్టడానికి చర్యలు తీసుకోవడంతో ప్రస్తుతం కొంతవరకు కరోనా కేసులు తగ్గుతున్నాయి. అయితే కరోనా, లాక్ డౌన్ లాంటి పరిస్థితుల వల్ల సినిమా ఇండస్ట్రీపై బాగానే ప్రభావం పడింది. ముఖ్యంగా బాలీవుడ్ పరిశ్రమ కుదేలైందనే చెప్పాలి. గత…
తౌక్టే తుఫాను చాలా మంది ప్రాణాలను తీసింది. కొన్ని ప్రాంతాలలో భారీ ఆస్తి నష్టం కలిగించింది. అంతేకాదు బాలీవుడ్ నిర్మాతలపై కూడా తౌక్టే తుఫాను ఎఫెక్ట్ పడింది. ముంబైలోని బాలీవుడ్ టాప్ స్టార్స్ ఫిల్మ్ సెట్లపై తౌక్టే తుఫాను ఎఫెక్ట్ భారీగానే పడింది. ‘మైదాన్’ కోసం ఏర్పాటు చేసిన సెట్ బాగా దెబ్బతింది. అజయ్ దేవ్గన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం కోసం ముంబై శివారులో ఈ ప్రత్యేక సెట్ రూపొందించబడింది. ఈ చిత్రానికి ఇలాంటి…
మాధురీ దీక్షిత్ ని రకరకాల టైటిల్స్ తో ఆమె ఫ్యాన్స్ పిలుచుకుంటూ ఉంటారు! అయితే, ‘ధక్ ధక్ గాళ్’ అని అప్పట్లో చాలా మంది పిలిచేవారు! ఇప్పుడైతే మాధురీ యంగ్ గాళ్ కాకపోవచ్చుగానీ… ‘ధక్ ధక్ సుందరి’ అని మాత్రం… మనం ఇప్పటికీ పిలుచుకోవచ్చు! ఆమె అందం, ఆకర్షణ ఇప్పటికీ చెక్కుచెదరలేని తన డై హార్డ్ ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటారు…మాధురీ కెరీర్ లోనే ఆల్ టైం రొమాంటిక్ హిట్ గా నిలిచిన ‘ధక్ ధక్ కరేనా లగా’…
రశ్మిక సౌత్ నుంచీ నార్త్ వైపు రాకెట్ లా దూసుకుపోతోంది. కన్నడలో మొదలైన ఈ బెంగుళూరు బ్యూటీ పయనం ఇప్పుడు తెలుగు, తమిళం మీదుగా హిందీకి చేరింది. తమిళంలో కార్తి, తెలుగులో మహేశ్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో రొమాన్స్ చేసిన మిస్ మందణ్ణా బాలీవుడ్ లోనూ క్రేజీ ఆఫర్లే కొట్టేస్తోంది. ఓ వీడియో సాంగ్ తో ఎంట్రీ ఇచ్చిన ఆమె ఇప్పుడు ‘సరిలేరు నాకెవ్వరూ’ అన్నట్టుగా సినిమా ఆఫర్లతో దూసుకుపోతోంది! రశ్మిక శాండల్…
కరణ్ జోహర్ టైం అస్సలు బాలేదనే చెప్పాలి. చాలా రోజులుగా ఆయనకు ఎదురుగాలి వీస్తోంది. మరీ ముఖ్యంగా, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తరువాత కరణ్ జోహర్ విపరీతంగా ట్రోలింగ్ కి గురయ్యాడు. ఇప్పటికీ నెటిజన్స్ కోపం పెద్దగా ఏం తగ్గలేదు. స్టార్ కిడ్స్ ని ఎంకరేజ్ చేస్తూ స్వయంగా ఎదిగిన వార్ని తొక్కేస్తాడని అతనిపై ముద్ర పడిపోయింది. అసలే నెపోటిజమ్ ఆరోపణలు, పైగా కరోనా లాక్ డౌన్ కష్టాలు, నష్టాల్లో ఉన్న కేజోకి ఇప్పుడు…
మాధురీ దీక్షిత్ అనగానే మనకు ఎన్నో అద్భుతమైన చిత్రాలు గుర్తుకు వస్తాయి. అయితే, ఆమె గొప్ప నటి అనటంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, అంతకంటే ఎక్కువగా మాధురీ అంటే డ్యాన్స్! ఆమె గ్రేస్ మళ్లీ మరెవరికి లభించేది కాదు. అంతలా తన స్టెప్పులతో నిన్నటి తరాన్ని, నేటి తరాన్ని కూడా ఆకట్టుకుంటోంది సీనియర్ సుందరి! మాధురీ లాంటి మాయాజాలం సంజయ్ లీలా బాన్సాలీతో కలిస్తే? ‘దేవదాస్’ చిత్రంలో మనం ఇప్పటికే ఓ సారి అటువంటి అద్భుతం…
2021 ప్రారంభంలో చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. కరోనా కేసులు బాగా తగ్గుముఖం పట్టటంతో మార్చ్ నెలకల్లా అనేక సినిమాల రిలీజ్ డేట్లు అనౌన్స్ అయ్యాయి. కానీ, ఏప్రెల్ నుంచీ సీన్ మారిపోయింది. సెకండ్ వేవ్ ఉధృతంగా వచ్చి పడటంతో మరోసారి బాక్సాఫీస్ మూతపడిపోయింది. థియేటర్ల గేట్లు తెరుచుకోవటం లేదు. మరి నిర్మాతల పరిస్థితి ఏంటి? 2020లో చేసిందే ఇప్పుడూ చేస్తున్నారు. ఓటీటీ వైపు సీరియస్ గా లుక్కేస్తున్నారు. లాస్ట్ ఇయర్…