ఏపీలో బీజేపీ రోడ్డెక్కుతోంది. రానున్న రోజుల్లో మిత్రపక్షం జనసేనతో కలిసి ఆందోళనలు చేపడతామని ప్రకటిస్తోంది. అయితే జనసేనాని మాట ఎక్కడా వినిపించడం లేదు. కీలక పరిణామాలపై ప్రకటనల ద్వారా స్పందించే పవన్ కల్యాణ్.. ఇప్పుడు దాన్నీ పక్కన పెట్టేశారు. ఇంతకీ సేనాని మౌనానికి కారణం ఏంటి? సినిమాలతో బిజీగా ఉన్నారా… కోవిడ్తో రాజీ పడ్డారా? ఏపీలో పెరిగిన బీజేపీ కార్యక్రమాలు ఏపీలో ప్రధాన ప్రతిపక్షం జోరు తగ్గింది. ఇదే సమయంలో మరో ప్రతిపక్షం బీజేపీ ప్రజా వ్యతిరేక…
నన్ను ఓడించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.. కానీ, మీకు కూడా గుణపాఠం చెబుతా అంటూ టీఆర్ఎస్ నేతలకు వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్… ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన బీజేపీలో చేరిన ఆయన.. ఆ తర్వాత తన నియోజకవర్గం హుజురాబాద్లో పర్యటిస్తూ.. రానున్న ఉప ఎన్నికలపై ఫోకస్ పెట్టారు.. వరుసగా ఆరు సార్లు విజయం సాధించా.. ఈసారి హుజురాబాద్లో కాషాయ జెండా ఎగురవేస్తానంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.. మా బీజేపీ నేతలు వచ్చి…
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏది రియలో.. ఏది వైరలో తెలియని పరిస్థితి… కొందరు కేటుగాళ్లు ఇష్టంవచ్చినట్టుగా తప్పుడు ప్రచారానికి తెరలేపుతున్నారు.. అది తెలియకకొందరు.. తెలిసి మరికొందరు షేర్ చేస్తూ.. అందులో భాగస్వాములు అవుతున్నారు.. అయితే, తెలంగాణ మంత్రి కేటీఆర్, వైఎస్ షర్మిల ఫొటోలతో.. హుజురాబాద్ ఎన్నికలకు సంబంధించిన ఓ తప్పుడు వార్త వైరల్ చేశారు కేటుగాళ్లు.. దీనిపై వైఎస్ షర్మిల అనుచరులు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.. బుధవారం రోజు సోషల్ మీడియాలో మేం పెట్టబోయే…
హుజరాబాద్ ఉప ఎన్నిక కోసం మండల ఇంచార్జ్ లను ప్రకటించింది బీజేపీ. హుజురాబాద్ టౌన్ ను ఇంచార్జ్ గా ఎమ్మెల్యే రఘునందన్ రావును నియమించగా హుజూరాబాద్ రూరల్ కు రేవూరి ప్రకాష్ రెడ్డి, జమ్మికుంట కు ఎంపీ అరవింద్.. జమ్మికుంట రూరల్ కు మాజీ ఎమ్మెల్యే ధర్మారావు ను నియమించింది. అలాగే వీణవంక- మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఇల్లంతకుంట- మాజీ ఎంపీ సురేష్ రెడ్డి కమలాపూర్- మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ను…
ఒకప్పుడు తిరుగులేని నాయకుడు. ఇప్పుడు పార్టీలను పట్టుకొని తిరుగుతున్నారు. పొలిటికల్ ఫ్లాట్ఫాం కోసం కండువాలు మార్చేస్తున్నారు. అయినప్పటికీ అదృష్టం కలిసి రావడం లేదు. పైగా ఏ పార్టీలో చేరినా గ్రూప్వార్ ఆయన్ని వెంటాడుతోంది. ఇంతకీ ఎవరా జంప్ జిలానీ? గ్రూప్వార్ కారణంగా టీఆర్ఎస్లో టికెట్ రాలేదా? రమేష్ రాథోడ్. మాజీ ఎంపీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో ఒకప్పుడు తిరుగులేని నాయకుడు. ఉమ్మడి ఏపీకి చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో పార్టీ ముఖ్య నేతల్లో ఒకరు. 2014లో…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది… ఆదివారం రోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా, రాజ్నాథ్సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో సమావేశమైన ప్రధాని నరేంద్ర మోడీ.. తాజా రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా మంతనాలు జరిపారు.. ఆ సమావేశం జరిగిన రెండు రోజుల తర్వాత కేబినెట్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.. ఈ సమావేశంలో కోవిడ్ -19 మహమ్మారికి…
దమ్ముంటే మీ సిద్ధాంతం చెప్పుకో.. కానీ, ఘర్షణకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు మాజీ మంత్రి ఈటల రాజేందర్.. హుజురాబాద్ నియోజకవర్గంలోని వీణవంక మండలం చల్లూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన మండల ముఖ్యకార్యకర్తలు సమావేశానికి హాజరైన బీజేపీ నేత ఈటల.. ఈసందర్భంగా మాట్లాడుతూ.. వీణవంక మండలంలో అక్కడొక దొర, ఇక్కడొక దొర ఉన్నారని ఎద్దేవా చేశారు.. మేం ఎవరి జోలికి వెళ్లం.. ఈ 20ఏళ్లలో ఎప్పుడు గొడువలకు తావు ఇవ్వలేదని.. ఎప్పుడైన శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించకునేదన్నారు..…
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు ఎప్పటివో అయినా.. ఈ మధ్య తరచూ విమర్శలు, ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.. ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ… మీకు నిజాయితీ ఉంటే అక్రమంగా చేపట్టిన ఆర్డీఎస్ పనులను ఆపాలని డిమాండ్ చేశారు.. ఆర్డీఎస్ పై అవగాహన లేని బచ్చాగాళ్లు ముఖ్యమంత్రి రాసిచ్చిన కాగితాలు చూసి మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయిన ఆమె.. ఆంధ్రవాళ్లు అని విమర్శించే వారు రాయలసీమను రత్నాల సీమ చేస్తా అన్నది…
ఏపీలో బీజేపీకి ఓ సరదా సమస్య వచ్చి పడింది. ముఖ్యనేతల మీటింగ్లో అంతర్గత వ్యవహారాల చర్చ బయటకు వెళ్లిపోతుందట. పార్టీలో లోటుపాట్లు, నేతలకు అక్షింతలు సైతం మీడియాలో రావడంతో తలనొప్పిగా మారిందట. దీంతో పార్టీ సమావేశాల్లో అసలు చర్చ కంటే ముందు.. మీటింగ్ సీక్రసీపైనే ఎక్కువ చర్చ జరుగుతుందట. మీటింగ్ అంశాలు ఎవరూ బయట మాట్లాడొద్దని ఒట్టు వేయించుకున్నంత పని చేస్తున్నారట. ఎందుకో ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. పార్టీ మీటింగ్లకు రహస్యం అవసరమని భావిస్తున్నారా? ఏపీ…
ఇవాళ ప్రతిపక్షపార్టీలు సమావేశం అవుతున్నాయి… ఈ సమావేశానికి హాజరుకావ్సాలిందిగా..నిన్ననే శరాద్ పవార్, యశ్వంత్ సిన్హా, ప్రతిపక్ష పార్టీలకు ఆహ్వానాలు పంపిరారు. కేవలం 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలే కాకుండా, వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో సహా బీజేపీకి వ్యతిరేకంగా సమిష్టి పోరాటానికి సిధ్ధమయ్యేందుకు సమాలోచనలు చేయనున్నారు.. ప్రతిపక్ష పార్టీలకు యశ్వంత్ సిన్హా కు చెందిన “రాష్ట్ర మంచ్” తరఫున ఆహ్వానాలు పంపారు.. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిపై చర్చించేందుకు రావాలని ప్రతిపక్షాలకు ఆహ్వానాలు పంపించారు..…