Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Bjp Leader Prakash Javadekar Sensational Comments On Ap Political Leaders

జవడేకర్‌ సంచలన వ్యాఖ్యలు.. బెయిల్‌పై ఉన్న ఏపీ నేతలు జైలుకే..!

Published Date :December 28, 2021 , 6:03 pm
By Sudhakar Ravula
జవడేకర్‌ సంచలన వ్యాఖ్యలు.. బెయిల్‌పై ఉన్న ఏపీ నేతలు జైలుకే..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవడేకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆంధ్రప్రదేశ్‌లో చాలా మంది నేతలు బెయిల్‌పై ఉన్నారని.. త్వరలో వారు మళ్లీ జైలుకు వెళ్లే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగ్రహ సభలో పాల్గొని ప్రసంగించిన ఆయన… ఏపీలోని కొందరు నేతలు బెయిలుపై ఉన్నారు.. త్వరలో జైలుకెళ్లే అవకాశం లేకపోలేదు అంటూ కామెంట్లు చేసి ఒక్కసారిగా రాజకీయాల్లో హీట్‌ పెంచారు… ఇక, నిధులు కేంద్రానివి.. స్టిక్కర్లు రాష్ట్రానివి.. ఏపీలో ఇది విచిత్రమైన పరిస్థితి ఉందని ఎద్దేవా చేసిన ఆయన.. రూ. 1.60 లక్షలను పీఎంఏవై కింద ఇస్తే జగనన్న కాలనీలంటున్నారు. అవి జగనన్న కాలనీలు కాదు.. మోడీ కాలనీలన్నారు.. సమగ్ర శిక్షాభియాన్ ద్వారా యూనిఫాములను కేంద్రం ఇస్తుంటే జగనన్న కానుక అనే స్టిక్కర్ అంటించారని మండిపడ్డ ఆయన.. వైద్యారోగ్య నిధులను కూడా కేంద్రమే ఇస్తున్నా.. జగన్ స్టిక్కర్లు అంటిస్తున్నారని విమర్శించారు.. ఏపీలో జరిగే అభివృద్ధి కార్యక్రమం కేంద్ర నిధులతోనే జరుగుతోందని స్పష్టం చేశారు.

https://ntvtelugu.com/mla-jagga-reddy-interesting-comments-on-revanth-reddy/

తన ఉపన్యాసంలో పుష్ప సినిమాను గుర్తుచేసుకున్నారు ప్రకాష్ జవడేకర్.. ఎర్రచందనం స్మగ్లింగ్ పై పుష్ప సినిమాలో చూపించారు.. ఏపీలో అలాంటి పరిస్థితే ఉందన్నారు.. ఏపీలో ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతోన్నా సిట్‌ను ఎత్తేశారని మండిపడ్డ ఆయన.. వృద్ధాప్య ఫించన్లను నేరుగా వేయకుండా వలంటీర్ల ద్వారా ఇస్తున్నారని.. కానీ, మేం అవినీతిని అరికట్టేందుకు డీబీటీల ద్వారా నగదును అందిస్తున్నాం అన్నారు. ఏపీకి మంచి ప్రభుత్వం ఉండాల్సిన అవసరం ఉంది.. ఏపీ ప్రజలు బీజేపీకి అవకాశం ఇవ్వాలి.. ప్రజలు దీవిస్తే ఏపీలో బీజేపీ పెద్ద పార్టీ అవుతుందని విజ్ఞప్తి చేశారు. ఇక, ఏపీ అంటే నాకు ప్రేమ.. ఏపీలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించాను అని గత అనుభవానులు గుర్తుచేసుకున్న జవడేకర్.. ఆంధ్ర భోజనం అంటే చాలా ఇష్టం అన్నారు.

రికార్డు టైంలో పోలవారినికి అనుమతి
పోలవరానికి రికార్డు టైంలో ఒక నెలలోనే పర్యావరణ అనుమతులు ఇచ్చానని.. తాను కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే ఇది జరిగిందన్నారు జవడేకర్… నేను నెలలో అనుమతులిస్తే.. ఇప్పటి వరకు చంద్రబాబు, జగన్ పోలవరాన్ని పూర్తి చేయలేకపోయారన్న ఆయన.. అమరావతి రాజధాని కోసం అటవీ భూములకు అనుమతులిచ్చాం.. కానీ, దురదృష్టకరం.. రాజధాని విషయంలో రెండూ పార్టీలు పోట్లాడుకుంటున్నాయని మండిపడ్డారు.. వైసీపీ, టీఆర్ఎస్, టీడీపీల ప్రభుత్వాలు మూడూ అవినీతి పార్టీలేనని ఆరోపించిన ఆయన.. ఈ మూడు పార్టీలు కుటుంబ పార్టీలేనని విమర్శించారు. ఇక, భారతదేశం నుంచి వచ్చామని విదేశాల్లో చెబితే సెల్యూట్ చేస్తున్నారు.. ఏపీ నుంచి వచ్చామని ధైర్యంగా చెప్పగలరా..? అని ప్రశ్నించారు. ఛార్‌ధామ్ అభివృద్ది చేస్తున్నాం.. సౌకర్యాలు కల్పిస్తున్నాం.. కాశీని అభివృద్ధి చేస్తున్నాం.. అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తున్నాం.. కానీ, ఏపీలో విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు.. రథాలు తగుల పెడుతున్నారు.. దేశంలో నిర్మాణత్మకంగా వెళ్తుంటే.. ఏపీలో విధ్వంసం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

మోడీ కారణంగానే టీడీపీ గెలిచింది..
2014 సాధారణ ఎన్నికల్లో నరేంద్ర మోడీ కారణంగానే ఏపీలో టీడీపీ గెలిచిందన్నారు ప్రకాష్‌ జవడేకర్.. టీడీపీ అధికారంలో వచ్చిన తొలి రెండేళ్లు బాగానే ఉన్నారు.. కానీ, ఆ తర్వాత బీజేపీని.. మోడీని అనరాని మాటలు అన్నారని.. అందుకే 2019లో టీడీపీ ఓడిపోయిందన్నారు. ఇక, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే మద్య నిషేధం అన్నారు.. కానీ, ఇప్పుడు మద్యం అమ్ముతున్నారన్న ఆయన.. పోలీసులను, టీచర్లను రిక్రూట్ చేస్తామన్నారు.. కానీ గాలికొదిలేశారని విమర్శలు గుప్పించారు.. రైతుల పంటల బీమా ప్రిమీయం కడతానన్న జగన్.. మాట తప్పారు.. జగన్ మాట తప్పి అందర్నీ ఇబ్బందుల్లోకి నెట్టారని వ్యాఖ్యానించారు ప్రకాష్ జవడేకర్.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amaravati
  • Andhra Pradesh
  • AP Political Leaders
  • bjp
  • Prakash Javadekar

తాజావార్తలు

  • Off The Record: ఆ ఉమ్మడి జిల్లాల్లో తగ్గిన జనసేన జోష్..!

  • Strait of Hormuz: హర్మూజ్‌ జలసంధిని మూసేసిన ఇరాన్.. ఆయిల్ ధరలు స్కైరాకెట్.. ఈ జలసంధి ఎందుకు ముఖ్యం?

  • Rai Rai Raa Raa : రయ్ రయ్ రా రా అదిరిందిగా!

  • Netanyahu: మానవాళిని బెదిరించాలని చూసింది.. అంతమైంది.. ఇరాన్‌పై నెతన్యాహు హాట్ కామెంట్స్

  • Ugadi Mahotsavam 2026: శ్రీశైలంలో 16 నుంచి ఉగాది మహోత్సవాలు..

ట్రెండింగ్‌

  • 40 గంటల బ్యాటరీ, Dolby Head Tracking సపోర్ట్.. Moto Buds 2 సిరీస్ లాంచ్! ధర ఎంతంటే?

  • క్వాడ్ కర్వ్ డిజైన్, మిలిటరీ గ్రేడ్ మన్నిక, ప్రీమియం లుక్ లో Motorola Edge 70 Fusion.. ఫీచర్స్ ఇవే!

  • MWC వేదికగా 24K గోల్డ్ లోగోతో ప్రత్యేక ఎడిషన్ ‘Motorola Razr Fold’ ఫోన్ లాంచ్..!

  • Sanju Samson: ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఫెయిల్.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!

  • 64 MP+50 MP+50 MP కెమెరాలు, IP69 రేటింగ్, 8.75mm మందంతో Honor Magic V6 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions