ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎన్నికలు జరిగే పరిస్థితి లేకపోయినా.. ముందస్తు ఎన్నికలపై ప్రచారం సాగుతోంది.. ప్రతిపక్ష టీడీపీ ముందస్తు ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు అంటుంటే.. అధికార వైసీపీ మాత్రం ముందస్తు ఎన్నికలకు పోయేదేలేదని స్పష్టం చేస్తోంది. ఇక, పొత్తులపై కూడా చర్చ సాగుతోంది.. జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో పవన్ కల్యాణ్ పొత్తులపై చర్చకు తెరలేపారు. అయితే, 2024 ఎన్నికల్లో పొత్తులపై క్లారిటీ ఇచ్చారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. Read…
తెలంగాణలో రేపు పలు జాతీయ రహదారులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేయనున్నారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ. 8 వేల కోట్ల వ్యయంతో నాలుగు వందల అరవై కిలోమీటర్ల పొడవు గల జాతీయ రహదారులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అయితే ఇందులో రెండు జాతీయ రహదారులను ప్రారంభించనుండగా, 10 జాతీయ రహదారుల పనులకు శంకుస్థాపన చేస్తారు. సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ ఫండ్ కింద 7 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలంగాణ బీజేపీ నేతలు వెల్లడించారు. అయితే నితిన్ గడ్కరీ…
మరోసారి బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు ప్రభుత్వ విప్ బాల్క సుమన్. నిన్న టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో ఘనంగా జరిగాయి. ఈ ప్లీనరీ సమావేశాల్లో 13 కీలక తీర్మానాలు చేశారు. ఈ నేపథ్యంలో తాజా బాల్క సుమన్ మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ తీర్మానాలపై బీజేపీ నేతల నుంచి సమాధానం లేదని ఆయన విమర్శించారు. రిజర్వేషన్లు, నవోదయ విద్యాలయాలలతో పాటు ఏ ఒక్క అంశంపై బీజేపీ నేతల వైపు నుంచి సమాధానం…
నిన్న టీఆర్ఎస్ 21వ ప్లీనరీ సమావేశాలు ఘనంగా జరిగాయి. అయితే ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ… ప్లీనరీలో కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు అబద్దాలు, అభూత కల్పనలు వెల్లడించారన్నారు. పూనకo వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని, బీజేపీ అంటే భయపడుతున్నారన్నారు. ఎనిమిదేళ్లుగా తెలంగాణను ఏం ఉద్ధరించారని, పౌరుడిగా ఫ్రoట్ పెట్టొచ్చు, టెంట్ వేసుకోవచ్చునన్నారు. రాజ్యంగం ప్రకారం ఉన్నత పదవుల్లోకి రావచ్చునని ఆయన అన్నారు. గుణాత్మక పరిపాలన అంటే కల్వకుంట్ల పాలనా? గుణాత్మక పాలన అంటే ఏ ఎండకు ఆ…
టీఆర్ఎస్ 21వ ఆవిర్భవ వేడుకలు ఘనంగా జరుతున్నాయి. అందరూ ఊహించిన విధంగానే టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లనున్నట్లు చెప్పకనే చెప్పారు. అయితే టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాల్లో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం మాటల్లో అచ్చే దిన్ అని.. కానీ.. చేతల్లో సచ్చే దిన్గా వ్యవహరిస్తోందన్నారు. కేంద్రంలో బలమైన ప్రభుత్వం.. రాష్ట్రంలో బలహీన ప్రభుత్వం ఉండాలన్నదే కేంద్ర ప్రభుత్వం ఆలోచన అని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా ఆ ఆలోచనలో భాగంగానే చిన్న…
టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు మాదాపూర్లోని హెచ్ఐసీసీ వేదికగా జరుగుతున్నాయి. టీఆర్ఎస్ 21వ ఆవిర్భవ వేడుకల్లో భాగంగా పలు కీలక తీర్మాణాలు చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ సమావేశాల్లో మాట్లాడుతూ.. ఈ రోజు దేశంలో జరుగుతున్నటువంటి మత విద్వేషాలు మంచిదా అని ఆయన ప్రశ్నించారు. కుటిల రాజకీయం, పచ్చి రాజకీయ లబ్దితోని, పది మంది పదవుల కోసం విధ్వంసం చేయడం తేలికనే.. కానీ.. నిర్మాణం చేయాలంటే చాలా సమయం పడుతుందన్నారు. ఎవరు అవునన్నా.. కాదన్నా.. కర్ణాటక రాష్ట్రంలో…
టి.పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర, సభలపై రేవంత్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందేకాగా.. వాటిపై స్పందించిన డీకే అరుణ.. జోగులాంబ సాక్షిగా ప్రమాణం చేద్దామా? అమ్మవారి ఎదుట బండి సంజయ్ పై చేసిన ఆరోపణలు నిరూపిస్తావా? అని చాలెంజ్ చేశారు. పాదయాత్రకు వస్తున్న స్పందనను చూసి పిచ్చి ప్రేలాపనలు చేస్తారా? అని మండిపడ్డ ఆమె.. టీఆర్ఎస్ –…
ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య వార్ నడుస్తోంది. అధికారంను అడ్డంపెట్టుకోని అరెస్ట్లు చేయిస్తున్నారని బీజేపీ నేతలు రాస్తారోకో చేపట్టగా ఆసమయంలో మహిళ ఎస్సై పై బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. మహిళ సంఘాలు, టీఆర్ఎస్ నేతలు బీజేపీ నేత వ్యాఖ్యలపై మండిపడ్డారు. అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ నేత ఎవ్వరు ఏమన్నారు…ఆ ఇష్యూ ఏంటీ.. ఆదిలాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాయల్ శంకర్ జైనాథ్ ఎస్ఐ పెర్సిస్ బిట్లనుద్దేశించి…
తెలంగాణలోనూ ఏ నేత నోట విన్నా ఇప్పుడు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పేరు వస్తుంది.. ఆయన చుట్టూ తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నాయి. నిన్న, మొన్నా కేసీఆర్తో ప్రశాంత్ కిషోర్ భేటీ.. రాష్ట్ర రాజకీయాల్లో హాట్టాపిక్ కాగా.. మరోవైపు ఢిల్లీలోనూ పీకే వ్యవహారానికి సంబంధించిన పరిణామాలు జోరుగా సాగాయి. పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన ప్రజేంటేషన్పై 8 మంది సభ్యులు… సోనియా గాంధీకి నివేదిక ఇచ్చారు. నివేదికపై కూలంకుషంగా చర్చించినట్లు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్…
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర వాయిదా అంటూ వార్తలు వస్తున్నాయి.. వడ దెబ్బకు గురైన బండి సంజయ్.. తన పాదయాత్రకు రెండు రోజుల పాటు విరామం ఇవ్వనున్నారని వాటి సారాంశం.. అయితే, దీనిపై బీజేపీ క్లారిటీ ఇచ్చింది.. బండి సంజయ్ రెండో విడత ‘‘ప్రజా సంగ్రామ యాత్ర’’ రెండ్రోజుల పాటు వాయిదా పడుతుందనే వార్తల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది… ప్రజా సంగ్రామ యాత్ర యథావిథిగా కొనసాగుతుందని…