Kishan Reddy : ప్లీనరీలో అబద్దాలు, అభూత కల్పనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిన్న టీఆర్ఎస్ 21వ ప్లీనరీ సమావేశాలు ఘనంగా జరిగాయి. అయితే ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ… ప్లీనరీలో కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు అబద్దాలు, అభూత కల్పనలు వెల్లడించారన్నారు. పూనకo వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని, బీజేపీ అంటే భయపడుతున్నారన్నారు. ఎనిమిదేళ్లుగా తెలంగాణను ఏం ఉద్ధరించారని, పౌరుడిగా ఫ్రoట్ పెట్టొచ్చు, టెంట్ వేసుకోవచ్చునన్నారు. రాజ్యంగం ప్రకారం ఉన్నత పదవుల్లోకి రావచ్చునని ఆయన అన్నారు. గుణాత్మక పరిపాలన అంటే కల్వకుంట్ల పాలనా? గుణాత్మక పాలన అంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టే పాలనా? గుణాత్మక పాలన అంటే తండ్రి కొడుకుల పాలనా? అని ఆయన ప్రశ్నలు సంధించారు.
అప్పులు చేసి కమిషన్లు కొల్ల గొడుతున్నారని, ఇతర రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో వందల కోట్ల రూపాయలు ఎక్కన్నుంచి వస్తున్నాయో చెప్పాలన్నారు. విదేశాల్లో ఉన్న భారతీయుల పట్ల కేసీఆర్ కు అవగాహన లేదని, మోడీ ప్రధాని అయ్యాక విదేశాల్లో ఉన్న భారతీయులు తలెత్తుకుని తిరుగుతున్నారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ యుద్ధం సమయంలో ఏ దేశం చేయని సాహసం మోడీతో సాధ్యమైందన్నారు. యుద్దాన్ని ఆపించి 22 వేల మందిని వెనక్కి తీసుకు వచ్చారని ఆయన తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
Pawan Kalyan : రాష్ట్రం కోసమే రాజీ పడ్డాను.. పొత్తులో మీ ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకోను
-
Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
-
Polavaram: పోలవరం నిర్వాసితులకు రూ. 307 కోట్ల పరిహారం.. 2027 నాటికి ప్రాజెక్ట్ పూర్తి: మంత్రి నిమ్మల రామానాయుడు
-
Tragedy: భార్య మోసంతో భర్త ఆత్మహత్య కేసులో ట్విస్ట్..!
-
Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..