Balka Suman : బీజేపీది సంగ్రామ యాత్ర.. పాపాల యాత్ర..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరోసారి బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు ప్రభుత్వ విప్ బాల్క సుమన్. నిన్న టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో ఘనంగా జరిగాయి. ఈ ప్లీనరీ సమావేశాల్లో 13 కీలక తీర్మానాలు చేశారు. ఈ నేపథ్యంలో తాజా బాల్క సుమన్ మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ తీర్మానాలపై బీజేపీ నేతల నుంచి సమాధానం లేదని ఆయన విమర్శించారు. రిజర్వేషన్లు, నవోదయ విద్యాలయాలలతో పాటు ఏ ఒక్క అంశంపై బీజేపీ నేతల వైపు నుంచి సమాధానం లేదని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండ బీజేపీది సంగ్రామ యాత్ర…పాపాల యాత్ర.. అని ఆయన ఎద్దేవా చేశారు.
ఇది కమలం పార్టీ కాదు…కార్పోరేట్ పార్టీ అని ఆయన వ్యాఖ్యానించారు. మీ డబుల్ ఇంజన్కు దేశ ప్రజలు ఎర్రజెండా చూపిస్తారని, 11 లక్షల కోట్ల బకాయిలు కేంద్ర సర్కార్ కార్పోరేట్ దుస్తుల కోసం మాఫీ చేశారన్నారు. బీజేపీ నేతృత్వంలో వివిధ రాష్ట్రాల్లో దళితులపై దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. బీజేపీలో ఎంత మంది కేంద్ర మంత్రుల పిల్లలు ఎంపీలు గా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. బీజేపీ ఇప్పడు కుటుంబ పాలన, వారసత్వ రాజకీయాలు అని మాట్లాడడం సిగ్గుచేటని ఆయన ధ్వజమెత్తారు.
Also Read
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
-
MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!