ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఏఐసిసి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి కి సపోర్ట్ చేయాలని కాంగ్రెస్ కార్యకర్తకు ఫోన్ చేసిన ఆడియో వైరల్ కావడం పై ఎఐసిసి సిరీయస్ అయ్యింది. ఎందుకు చర్యలు తీసుకోకూడదో 10 రోజుల్లో సమాధానం చెప్పాలని AICC నోటీస్ లో పేర్కొంది.
Karnataka Minister Slaps Woman: కొంతమంది నేతల దురుసు ప్రవర్తన ఆయా పార్టీలకు చేటు తెస్తున్నాయి. అధికారం తలకెక్కిన నాయకులు ప్రజలతో ఎలా నడుచుకోవాలనేది తెలియడం లేదు. ఆగ్రహంతో ప్రజలను దూషించడం, చేయి చేసుకోవడం చేస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. తన సమస్య చెప్పుకోవడానికి వచ్చిన మహిళపై చేయి చేసుకున్నారు ఓ మంత్రి. అధికారంలో ఉన్న వ్యక్తి, మంత్రి అయి ఉండీ మహిళ చెంపపై కొట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఓ…
Karnataka Assembly Deputy Speaker Anand Mamani passes away: బీజేపీ ఎమ్మెల్యే, కర్ణాటక అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఆనంద్ మామణి తీవ్ర అస్వస్థతతో కన్నుమూశారు. ఆయన మరణంతో భారతీయ జనతా పార్టీకి తీవ్ర లోటు ఏర్పడింది. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. తుది శ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు ఆదివారం వెల్లడించారు. 56 ఏళ్ల మామణి సౌదత్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మూడుసార్లు వరసగా ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన…
నల్లగొండ జిల్లా నాంపల్లిలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ మాత్రమే మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరైడ్ రక్కసిని తరిమికొట్టారు.. రాజగోపాల్ రెడ్డి తన ఎన్నికల ప్రచారంలో 3000రూపాయల పెన్షన్ ఇస్తాను అనడం సిగ్గుచేటు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు 3వేలు ఇవ్వడం లేదు.. వెయ్యి కోట్ల రూపాయలు ఎలా తెస్తారో…. దుబ్బాక, హుజురాబాద్ లో తెచ్చారా లేదా చెప్పాలి.. ఓడితే నల్లగొండ మొఖం కూడా…
Sunil Deodhar: ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జి సునీల్ దేవధర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో పొత్తుల గురించి మాట్లాడారు. 2024లో జరిగే ఎన్నికల్లో జనసేన-బీజేపీ కలిసి పోటీ చేస్తాయని సునీల్ దేవధర్ స్పష్టం చేశారు. టీడీపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే ఉండదన్నారు. గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకుని చేదు అనుభవాలు చవిచూశామని తెలిపారు. ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకునే టీడీపీతో పొత్తు పెట్టుకోరాదని నిర్ణయించినట్లు తెలిపారు. రోడ్డు మ్యాప్…
బిహార్ ముఖ్యమంత్రి నితీష్కుమార్ బీజేపీతో ఇంకా టచ్లో ఉన్నారని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్కిషోర్ ఆరోపించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఆయన ఈ అంశంపై వ్యాఖ్యానించారు.
ఏపీ విషయంలో బీజేపీకి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్… రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్లో ముగిసిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… ఏపీలో రాహుల్ భారత్ జోడో యాత్ర విజయవంతం అయ్యిందన్నారు.. ఇక, స్పెషల్ స్టేటస్ విషయంలో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.. రాహుల్ యాత్రతో ప్రజలల్లో మార్పు కనిపిస్తోంది. ప్రజలలో నమ్మకం, ఆదరణ పెరుగుతోందన్న ఆయన.. బీజేపీకి మాట్లాడే అర్హతేలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. దేశం,…