Pilot Rohit Reddy : మా ఎమ్మెల్యే కనిపించడంలేదంటూ పోలీసులకు ఫిర్యాదు.. కిడ్నాప్ చేశారా? నిర్బంధించారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పేరు తెలంగాణ రాజకీయాలతో పాటు దేశవ్యాప్తంగా చర్చగా మారింది.. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఆయన ఫామ్హౌస్లోనే జరగడంతో.. అందరి దృష్టి ఆయనపైనే పడింది.. ప్రభుత్వం ఆయనకు భద్రతను కూడా పెంచింది.. అయితే, ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి కనిపించడం లేదంటూ తాండూరు టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందిందింది.. గత 20 రోజుల నుంచి మా ఎమ్మెల్యే కనిపించడంలేదు.. మిస్సింగ్ అయ్యారా? ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేదా ఇంకా ఎవరైనా నిర్బంధించారా? అనే విషయాన్ని వెంటనే తేల్చాలంటూ పీఎస్లో ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి.. గత 20 రోజుల నుంచి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే లేరు.. ప్రజలు పలు రకాల సమస్యలతో నియోజకవర్గంలో సతమతమవుతున్నారని వాపోయారు.. ఎమ్మెల్యేను ఎవరైనా బంధించారా లేదా కిడ్నాప్ చేశారా నిర్బంధించారా అనే విషయం స్పష్టం చేయాలంటూ తాండూర్ పోలీసులకు కోరారు రామ్మోహన్ రెడ్డి.
Read Also: Mahesh Babu: బాధ నుంచి బయట పడడానికి ఎన్టీఆర్ బాటలో మహేశ్..
Also Read
- SIR Survey : మాది ఏ రాష్ట్రమో తేల్చండి.. తెలంగాణలోని ఆ గ్రామాల్లో ‘సర్’ ప్రక్రియకు బ్రేక్..
- Kishan Reddy vs Asaduddin Owaisi: అసదుద్దీన్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్.. ప్రజలను తప్పుదారి పట్టించొద్దు..!
- Vijayashanthi : ఫీజు బకాయిలపై విజయశాంతి ఫైర్.!
- Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఈ నెల 28 నుంచే ప్రారంభం..
కాగా, నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం తెలంగాణలో సంచలనం సృష్టించింది.. ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు, గువ్వల బాలరాజులను డబ్బు ఆశ చూపి ప్రలోభపెట్టి , పార్టీ ఫిరాయింపు చేయాలని ప్రయత్నం జరిగినట్టు ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. నందకుమార్, రామచంద్ర భారతి, సింహయాజీ స్వామీజీలు ఎమ్మెల్యేలను ఫిరాయింపుకు ప్రోత్సహించినట్లు, వారితో మాట్లాడిన ఆడియోలు, వీడియోలు కలకలం రేపాయి. ఆ తర్వాత వారిపై కేసు నమోదు కావడం, కోర్టులలో కేసులు సంచలన విచారణ, ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడం, ప్రస్తుతం ఈ కేసులో సిట్ దూకుడు పెంచడం ఆసక్తికరంగా మారిన విషయం విదితమే. మరోవైపు, తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆ మధ్య షాకింగ్ కామెంట్లు చేశారు.. తన నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో తాను ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో రిస్కు తీసుకున్నానని, లేదంటే 100 కోట్లు తీసుకుని నేను హ్యాపీగా ఉంటాను కదా అంటూ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
-
Isakapatnam Trailer: అధికారం కోసం కన్నతండ్రినే ఢీకొట్టిన కూతురు!”
-
Idupu Kayitham : ‘ఇడుపు కాయితం’ చుట్టూ కొత్త వివాదం.. అసలు ఈ పదం అర్ధమేంటి?
-
SIR Survey : మాది ఏ రాష్ట్రమో తేల్చండి.. తెలంగాణలోని ఆ గ్రామాల్లో ‘సర్’ ప్రక్రియకు బ్రేక్..
-
Chanakya Niti: జీవితంలో గెలవాలంటే ‘చాణక్యుడి’ ఈ ఒక్క సూత్రం చాలు.. శత్రువులను కూడా ఈజీగా బురిడీ కొట్టించవచ్చు!
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!