పెందుర్తి మండలం సత్తివాని పాలెంలో రెవెన్యూ అధికారులపై దాడి చేసిన వైసీపీ నాయకుడు దొడ్డి కిరణ్ పరారీలో ఉన్న విషయం తెలిసిందే. అయితే భూకబ్జా, రెవెన్యూ ఉద్యోగులపై దౌర్జన్యం కేసులో పరారీలో ఉన్న వైసీపీ నాయకుడు దొడ్డి కిరణ్ ను పోలీస్ లు అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. 3 రోజులుగా దొడ్డి కిరణ్ అరెస్ట్ చేసేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేశారు. రాజమండ్రిలో దొడ్డి కిరణ్ ని పెందుర్తి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే ప్రస్తుతం దొడ్డి కిరణ్ ని పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసుతో పాటు గతంలో దొడ్డి కిరణ్ పై నమోదైన భూకబ్జా, ఆస్తుల ధ్వంసం, పలు బైండ్ ఓవర్ కేసుల పైనా విశాఖ పోలీసులు విచారణ చేస్తున్నారు. రేపు దొడ్డి కిరణ్ అరెస్ట్ ని చూపే అవకాశం ఉంది. అయితే రెవెన్యూ అధికారులపై దాడి చేసిన పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. రెవెన్యూ అధికారులపై దాడి చేయడాన్ని జిల్లా కలెక్టర్ సీరియస్ గా తీసుకున్నారు.